టాలీవుడ్ లో ఒకప్పుడు టాప్ రేసులో దూసుకుపోయిన చెన్నై చిన్నది త్రిషకి ఇప్పుడు పెద్దగా అవకాశాలు లేదు. అడపాదడపా అవకాశాలు చిన్న హీరోల ప్రక్కన వస్తున్నాయి. ప్రస్తుతం వాటితోనే కాలం గడుపుతున్న త్రిషకి ప్రముఖ నిర్మాత అయిన ఎంఎస్ రాజు ఓ లేడీ ఓరియెంటెడ్ చిత్రంలో ఆఫర్ ఇచ్చాడు. త్రిషను టాలీవుడ్ కి తన బ్యానర్ ద్వారా పరిచయం చేసిన భారీ హిట్ కొట్టిన ఎంఎస్ రాజు, ఇప్పుడు అదే సెంటిమెంటుతో త్రిషను పెట్టి ఓ చిత్రాన్ని ప్లాన్ చేశాడు. తన స్వీయ దర్శకత్వంలో రూపొందే 'రమ్' చిత్రంలో ఆమెను రంభగా ఖరారు చేసారు. ముగ్గురు హీరోయిన్స్ ఉంటారు. ఈ చిత్రానికి ‘రమ్ ’ అని పేరు పెట్టారు. ఇంగ్లీష్ అక్షరాల ఆధారంగా ఖరారు చేసిన ఈ టైటిల్ పూర్తి పేరు ‘రంభ.. ఊర్వశి...మేనక’. అవును చిత్రంలో నటించిన పూర్ణ ఇందులో మరో హీరోయిన్. ఇంకో హీరోయిన్ ఖరారు కాలేదు. దేవిశ్రీప్రసాద్ స్వరాలు సమకూరుస్తారు. విదేశాల్లో కొంత మేరకు షూటింగ్ కి ప్లాన్ చేశారు. మరి త్రిష రంభగా ఏ మాత్రం ప్రేక్షకుల్ని మెప్పిస్తుందో చూడాలి.
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more