పవర్ స్టార్ ‘గబ్బర్ సింగ్' సినిమా విజయం తర్వాత పవన్ కల్యాణ్ నటించే తదుపరి సినిమా షూటింగు ఈ రోజు ప్రారంభమైంది. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో 'కెమెరామేన్ గంగతో రాంబాబు' పేరుతో రూపొందే ఈ చిత్రం షూటింగు ఈ రోజు ఉదయం హైదరాబాదులోని సారధి స్టూడియోలో మొదలైంది. ఈ చిత్రం కోసం సారధీలో ప్రత్యేకమైన సెట్ వేశారు. ఇందులో కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తారు. ఈ సినిమాలో హీరో పవన్ కల్యాణ్ టీవీ రిపోర్టర్ గా నటిస్తున్నారు. మీడియా నేపథ్యంలో రూపొందే ఈ చిత్రంలో సమకాలీన రాష్ట్ర రాజకీయాలపై వ్యంగ్యాస్త్రాలను సంధిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. తమన్నా కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి మణిశర్మ సంగీతాన్ని అందిస్తున్నాడు. డివివి దానయ్య నిర్మిస్తోన్న ఈ చిత్రం మీద మంచి అంచనాలే ఉన్నాయి. గతంలో “బద్రి” వంటి హిట్ మూవీని అందించిన పూరి- పవన్ కాంబినేషన్ రిపీట్ అవ్వడంతో పవన్ ఫ్యాన్స్ యమ సంతోషంగా ఉన్నారు.
...avnk
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more