బ్రిటీష్ అరాచక పాలన నుంచి విముక్తి కలిగించడంలో వీరమరణం పొందిన స్వాతంత్ర్య సమరయోధుల్లో దండు నారాయణ రాజు ఒకరు. ఆనాడు న్యాయవాది వృత్తిలో కొనసాగిన ఈయన.. తన ఉద్యోగాన్ని త్యజించి దేశ స్వాతంత్ర్యమే లక్ష్యంగా ఎన్నో ఉద్యమాల్లో పాల్గొన్నారు. తన ప్రసంగంతో ఎంతోమందిని స్వాతంత్ర్యపోరాట దిశగా నడిచేలా చైతన్యం నింపారు.
జీవిత విశేషాలు :
1889 అక్టోబర్ 15వ తేదీన భీమవరం తాలూకా నేలపోగుల గ్రామంలో భగవాన్ రాజు, వెంకాయమ్మ దంపతులకు శ్రీ దండు నారాయణ రాజు జన్మించారు. ఈయన నర్సాపురం తాలూకా పోడూరులో ప్రాథమిక విద్యను, తణుకు ఉన్నత పాఠశాలలో విద్యనభ్యసించారు. కేవలం విద్యారంగంలోనే కాకుండా.. క్రీడారంగంలోనూ తన ప్రతిభ కనబరిచారు. 1907లో మెట్రిక్యులేషన్ పరిక్షల్లో ఉత్తీర్ణులైన అనంతరం మద్రాసు ప్రెసిడెన్సీ కళాశాలలో బి.ఎ పట్టా పొందారు. తణుకు ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయుడుగా కొన్నాళ్లు పనిచేశారు. ఆ సమయంలోనే ఈయన బి.ఎల్ విద్యను కొనసాగిస్తూ.. చివరికి ఉత్తీర్ణులయ్యారు. ఆ తర్వాత హైకోర్టు వకీలుగా, ఏలూరులో న్యాయవాదిగా పనిచేశారు. ఈయనకు 1910లో మహదేవపట్నం కాపురస్తులు శ్రీ కలిదిండి వెంకట్రామరాజుగారి కుమార్తె సుబ్బయమ్మతో వివాహం జరిగింది.
స్వాతంత్ర్యోద్యమంలో నారాయణ పాత్ర :
బ్రిటీష్ వారి అరాచకాలు నానాటికి పరిభవిల్లుతున్న రోజుల్లో స్వాతంత్ర్యోద్యమాలూ అదే స్థాయిలో జరిగాయి. ముఖ్యంగా గాంధీ చేపట్టిన ఉద్యమాలు ఎందరినో ఉత్తేజపరిచాయి. అలా.. గాంధీ విధానాలకు ఆకర్షితులైన ఆయా ఉద్యమాల్లో పాలుపంచుకున్నారు. అలాంటివారిలో ఒకరైన నారాయణ రాజు.. 1921లో తన న్యాయవాద వృత్తిని వదిలేసి మహాత్మాగాంధీ సహాయనిరాకరణ ఉద్యమంలో చేరారు. 1927 లో మద్రాసు శాసన సభకు పోటీ చేసి గెలిచారు. 1930లో మహాత్మాగాంధీ ఉప్పు సత్యాగ్రహ ఉద్యమంలో పశ్చిమ గోదావరి జిల్లాకు నాయకుడై తన సహచరులతో ఏలూరు నుండి సముద్రతీరమున తూర్పుతాళ్ళు గ్రామం వరకూ నడచి ఉప్పుసత్యాగ్రహం చేశారు. అప్పుడే ఈయనకు ‘సర్దార్’ అనే బిరుదు వచ్చింది. ఆ సందర్భంలో ప్రభుత్వం ఆయన్ను ఒక సంవత్సరంపాటు నిర్భందంలో ఉంచింది.
పశ్చిమ గోదావరి జిల్లాలో ఖద్దరు వ్యాప్తి కోసం నారాయణ విశేష ప్రచారం చేశారు. ఖద్దరు బోర్డుకు 1923 నుండి 1926 వరకూ అధ్యక్షులుగా వ్యవహరించారు. హరిజన, రైతు ఉద్యమాల్లో పాల్గొని వారి అభ్యుదయానికై పాటుపడ్డారు. సత్యాగ్రహం, క్విట్ ఇండియా ఉద్యమంలో కూడా పాల్గొన్నారు. అయితే.. ఆ నేపథ్యంలో ఈయన్ను ఆనాటి ప్రభుత్వం పలుమార్లు జైలుకు పంపింది. ఓ సందర్భంలో ఈయన్ను తంజావూరు జైలులో నిర్బంధించగా.. అదే జైలులో 1944 సెప్టెంబరు 10వ తేదీన తుదిశ్వాస విడిచారు.
(And get your daily news straight to your inbox)
Mar 10 | స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు పూర్తయిన ఈ అఖండ భారతావనిలో ఎదుటివాడి గురించి ఆలోచించేవాడు ఎవ్వడూలేడు. కళ్లెదుటే నేరాలు జరుగుతున్నా వాటిని ఎదుర్కోవడానికి ఎవ్వరూ సాహసించరు. ఎవరికి అన్యాయం జరిగినా.. మనం జోక్యం చేసుకుంటే... Read more
Jan 19 | పేద, పెద్ద అన్న తారతమ్యాలు లేకుండా ఆకలి అన్న అర్తనాధం వినిపించనంతనే వారిని దరిచేర్చుకుని కడుపారా అన్నంపెట్టి మహర్షి, సమర్ధసద్గురు, అవదూత, భగవాన్ శ్రీ కాశీనాయన. క్షుద్భాదను ఎవరూ అనుభవించరాదని ప్రజలకు హితబోధ చేశారు... Read more
Oct 02 | తెలంగాణ ఉద్యమానికి ఆది గురువు. తెలంగాణ ఉద్యమంలో క్రీయాశీలక పాత్ర పోషించిన తెలంగాణ గాంధీ, బోళతనానికి నిలువుటద్దం కొండా లక్ష్మణ్ బాపూజీ. తన జీవితమంతా తెలంగాణ పక్షమే వహించారు. చివరి నిముషం వరకు తెలంగాణ... Read more
Jun 21 | తెలంగాణ సిద్ధాంతకర్త, జాతిపిత ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్.. ప్రత్యేక రాష్ట్ర అవిర్భావానికి వేసిన ప్రణాళికలు.. ఉద్యమానికి ఇచ్చిన సూచనలు.. అసలు తెలంగాణ ఎందుకు అన్న ప్రశ్నలకు తెలంగాణవాదులందరూ బుదలిచ్చే విధంగా.. రాసిన పుస్తకాలు దోహదం... Read more
Jan 23 | భారత స్వతంత్ర్య పోరాటంలో ఆయన ఓ విప్లవాత్మక నాయకుడు. శాంతమంత్రి జపిస్తూ చేతులు కట్టుకుని కూర్చుంటే.. కాలయాపన చేస్తూ పబ్బం గడుపుకునే బ్రీటీష్ వారికి.. స్వతంత్ర్యం చేకూరే దశలో తిరుగుబాటు బావుటా రుచి చూపించిన... Read more