Revanth Reddy Makes Controversial Comments On KCR And Harish Rao After Suspend From Telangana Assembly | Telangana Assembly Issue

Revanth reddy controversial comments on kcr harish rao telangana assembly issue

revanth reddy news, revanth reddy updates, revanth reddy controversies, telangana assembly issue, telangana assembly, tdp minister controversy, telangana farmers suicide, telangana farmers cases, kcr news, harish rao controversies

Revanth Reddy Controversial Comments On KCR Harish Rao Telangana Assembly Issue : Revanth Reddy Makes Controversial Comments On KCR And Harish Rao After Suspend From Telangana Assembly.

మామా అల్లుళ్ల జగన్నాటకం : రేవంత్ రెడ్డి

Posted: 10/05/2015 12:12 PM IST
Revanth reddy controversial comments on kcr harish rao telangana assembly issue

టీఆర్ఎస్ పార్టీ మీద విమర్శలు గుప్పించడంలో తనకంటే సాటి ఎవ్వరూ లేరని టీటీడీపీ వర్కింగ్ కమిటీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మరోసారి నిరూపించారు. నిత్యం కేసీఆర్, ఆయన కుటుంబసభ్యుల్ని టార్గెట్ చేస్తూ సంచలన వ్యాఖ్యలు చేసే రేవంత్.. ఈసారి తెలంగాణ అసెంబ్లీలో జరిగిన ‘సస్పెండ్’ వ్యవహారంపై ఘాటుగా స్పందించారు. గతంలోలాగే ఈసారి తనదైన స్టైల్లో కేసీఆర్, హరీశ్ రావుల మీద వివాదాస్పద కామెంట్లు చేశారు.

సోమవారం తెలంగాణ అసెంబ్లీ సమావేశం ప్రారంభమైన కొద్దిసమయానికే గందగోళానికి తావుతీసింది. రైతుల ఆత్మహత్యల మీద ఇప్పటికే చాలా సార్లు దద్దరిల్లిన సభలో మళ్లీ అదే సీన్ రిపీట్ అయింది. మూడు రోజుల విరామం తర్వాత కూడా సభలో, సభ్యుల్లో ఎలాంటి మార్పులు రాలేదు. దీంతో సభలో గందరగోళ పరిస్థితి నెలకొంది. ఆ సమయంలో శాసనసభా వ్యవహారాల మంత్రి హరీష్ రావు ‘సభ్యుల సస్పెన్షన్‌’ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. దాన్ని ఆమోదించిన స్పీకర్.. వెంటనే మజ్లిస్, కాంగ్రెస్ శాసనసభాపక్ష నేత జానారెడ్డి మినహా ప్రతిపక్ష సభ్యులందరిని సస్పెండ్ చేశారు. దీంతో 'దొంగల రాజ్యం దోపిడి రాజ్యం' అంటూ సస్పెండైన సభ్యులు సభలో నినాదాలు చేశారు. ఇదే క్రమంలో మీడియా పాయింట్ వద్ద మాట్లాడిన రేవంత్ రెడ్డి.. టీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్, హరీశ్ రావులపై ఘాటు వ్యాఖ్యలు చేశారు.

రైతు సమస్యలపై ప్రశ్నిస్తున్న ప్రతిపక్షాలను ప్రభుత్వం అణగదొక్కటం అన్యాయమని రేవంత్ రెడ్డి అన్నారు. సభలో ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. సభ్యులను మొత్తం సమావేశాల నుంచి సస్పెండ్ చేయడం దారుణమైన చర్య అని ఖండించారు. రైతులను ఆదుకోమంటే సస్పెండ్ చేస్తారా? అని ప్రశ్నించారు. మామా అల్లుళ్లు కలసి సభలో ప్రతిపక్షాల గొంతు నొక్కుతున్నారని ధ్వజమెత్తారు. అసెంబ్లీలో వాళ్లిద్దరూ జగన్నాటకం ఆడుతున్నారంటూ విమర్శించారు. అందరితో చర్చించాక అవసరమైతే తెలంగాణ బంద్ చేస్తామని తెలిపారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : revanth reddy  kcr  harish rao  telangana assembly  

Other Articles

  • Trs and grand alliance parties are branches of one tree alleges gvl

    ప్రజాకూటమి- టీఆర్ఎస్ ఒకే టాను ముక్కలు

    Nov 26 | ప్రజాకూటమికి చెందిన పార్టీలన్నీ ఒకే టాను ముక్కలని బీజేపి జాతీయ అధికార ప్రతినిధి, రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు విమర్శించారు. కర్ణాటకలో పరస్పరం విమర్శలు చేసుకున్న జేడీఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీలు బీజేపిని అధికారంలోకి... Read more

  • Telangana deceiver cbn in congress led grand alliance alleges kcr

    తెలంగాణ ద్రోహితో కూటమా.?: కేసీఆర్

    Nov 26 | తెలంగాణ ద్రోహి, అంధ్రబాబుతో జతకట్టిన కాంగ్రెస్ కు రానున్న ఎన్నికలలో ప్రజలే బుద్ది చెబుతారని తెలంగాణ అపధర్మ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. వలసల జిల్లాగా పేరు పడిన పాలమూరును దత్తత తీసుకున్న... Read more

  • Cm kcr on defections to trs

    రాజకీయ సుస్థిరత కోసమే సభ్యులను కలుపుకున్నాం : కేసీఆర్

    Mar 14 | రాజకీయ సుస్థిరత సాధించటం కోసమే మిగతా పార్టీల సభ్యులను తాము కలుపుకున్నామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. తెలంగాణ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా బుధవారం అసెంబ్లీలో కేసీఆర్ ప్రసంగించారు. తెలంగాణ సాధన ఎంత ముఖ్యమే..... Read more

  • Kamal haasan on periyar statue vandalism

    విగ్రహాలను మేం కాపాడుకోగలం : కమల్ హాసన్

    Mar 07 | ప్రముఖ సంఘ సంస్కర్త, కుల వివక్ష వ్యతిరేక పోరాట యోధుడు, తమిళనాడుకు చెందిన పెరియార్ రామస్వామి విగ్రహాల కూల్చివేతపై ప్రముఖ నటుడు, మక్కల్ నీది మయ్యమ్ పార్టీ వ్యవస్థాపకుడు కమల్ హాసన్ స్పందించారు. పెరియార్... Read more

  • Ysrcp adi sheshagiri rao comments on cbn

    చంద్రబాబు మాటలు అదుపు తప్పుతున్నాయ్ : వైసీపీ ఆదిశేషగిరిరావు

    Jan 23 | చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఈ మధ్య మాటలు ఎందుకో అదుపు తప్పి మాట్లాడుతున్నారని వైసీపీ నేత ఆదిశేషగిరిరావు చెబుతున్నారు. పైగా చంద్రబాబు సీఎం అయిన తర్వాతే పంటలకు నీళ్లొస్తున్నట్టుగా మాట్లాడుతున్నారని ఆదిశేషగిరిరావు విమర్శించారు. తాజాగా‘ఐ... Read more