ys jagan mohan reddy makes controversial comments on chandrababu naidu during guntur hunger strike | andhra pradesh controversies | ap capital city amaravathi

Ys jagan mohan reddy controversial comments on chandrababu naidu guntur hunger strike

ys jagan mohan reddy news, ys jagan hunger strike, ys jagan controversies, ys jagan updates, ys jagan mohan news, ys jagan mohan reddy scams, chandrababu naidu, chandrababu naidu controversies, ap capital city amaravathi, amaravathi master plan, ys jagan hunger dharna

ys jagan mohan reddy controversial comments on chandrababu naidu guntur hunger strike : ys jagan mohan reddy makes controversial comments on chandrababu naidu during guntur hunger strike.

వారంతా బాబు కాలర్ ఎందుకు పట్టుకోలేదు : జగన్

Posted: 10/07/2015 05:40 PM IST
Ys jagan mohan reddy controversial comments on chandrababu naidu guntur hunger strike

ప్రత్యేక హోదా కోసం వైకాపాధినేత వైఎస్ జగన్ మొదటినుంచి ఉద్యమాలు, నిరసన కార్యక్రమాలు చేపడుతూ వస్తున్నారు. ఇప్పుడు తాజాగా హోదాకోసం ఆయన గుంటూరులో నిరాహార చేపట్టారు. ఈ దీక్ష నేపథ్యంలోనే ఆయన ఏపీ సీచంద్రబాబుపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ప్రత్యేక హోదా గొప్పదనం ఏమిటో, దాని వల్ల వచ్చే లాభాలు ఏమిటో బాబుకు బాగా తెలుసని, అయినప్పటికీ ఏమీ పట్టించుకోకుండా సైలెంట్ గా ఎందుకు వున్నారో అర్థం కావడం లేదని జగన్ అన్నారు. ఆయన మంత్రులకు, ఎమ్మెల్యేలకు తెలుసో, తెలియదో తనకు తెలియదని... ఒకవేళ తెలిసి ఉంటే చంద్రబాబు కాలర్ ఎందుకు పట్టుకోలేదని ప్రశ్నించారు. ఓటుకు నోటు కేసు నుంచి తప్పించుకోవడానికి ప్రధాని మోదీ ముందు చంద్రబాబు మోకరిల్లారని, అందుకే ప్రత్యేక హోదాపై కేంద్రంపై ఒత్తిడి తీసుకురావడం లేదని మండిపడ్డారు.

ప్రత్యేక హోదా రాదనే బెంగతో రాష్ట్రంలో ఇప్పటికే ఐదుగురు చనిపోయారని తెలిపారు. 972 కిలోమీటర్ల సముద్రతీరం ఉన్న ఏపీకి ప్రత్యేక హోదా వస్తే, పిల్లల కోసం లక్షల ఉద్యోగాలు వస్తాయని చెప్పారు. బాబుపై ఒత్తిడి తీసుకొస్తే, ఆయన కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తారనే ఉద్దేశంతోనే దీక్షను జగన్ అన్నారు. ప్రత్యేక హోదా వస్తే రాష్ట్రానికి మేలు జరుగుతుందని గతంలో ప్రతి సమావేశంలో చెప్పిన చంద్రబాబు... ఇప్పుడు ఆ విషయాన్నే మర్చిపోయారని మండిపడ్డారు. ప్రత్యేక హోదా కోసం ఢిల్లీలో సైతం దీక్ష చేపట్టామని గుర్తు చేశారు. హైదరాబాద్ లో 90 శాతం ఐటీ సంస్థలు, 70 శాతం పరిశ్రమలు ఉన్నాయని... ఈ నేపథ్యంలో, ఏపీ విద్యార్థులు ఉద్యోగాల కోసం ఎక్కడకు వెళ్లాలని ప్రశ్నించారు. రాష్ట్రాన్ని కాంగ్రెస్, బీజేపీలు అడ్డగోలుగా విభజించాయని... కానీ, ఆనాడు ఇచ్చిన ప్రత్యేక హోదా హామీని మాత్రం మరిచిపోయారని మండిపడ్డారు. మేనిఫెస్టోలో ఉంచిన హామీలన్నింటినీ టీడీపీ తుంగలో తొక్కిందని అన్నారు. బాబు వస్తే జాబు వస్తుందని చెప్పారని... ఇప్పుడు ఉన్న ఉద్యోగాలను కూడా పీకేస్తున్నారని విమర్శించారు. చదువుకున్న పిల్లలకు అన్యాయం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.

పట్టిసీమ నుంచి పోలవరం వరకు అన్నిచోట్లా అవినీతే కనిపిస్తోందని జగన్ ఆరోపించారు. ఇక్కడ తీసుకున్న లంచాల డబ్బుతో, తెలంగాణలో ఎమ్మెల్యేలను కొనే ప్రయత్నం చేశారని విమర్శించారు. రాజశేఖరరెడ్డి బతికున్నంత కాలం తనను మంచోడిలా చూశారని... ఆయన చనిపోయిన తర్వాత తనపై కేసులు పెట్టారని అన్నారు. చంద్రబాబు, మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిలు కాంగ్రెస్ అధినేత్రి సోనియాతో కుమ్మక్కై తన మీద కేసులు పెట్టారని ఆరోపించారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

  • Trs and grand alliance parties are branches of one tree alleges gvl

    ప్రజాకూటమి- టీఆర్ఎస్ ఒకే టాను ముక్కలు

    Nov 26 | ప్రజాకూటమికి చెందిన పార్టీలన్నీ ఒకే టాను ముక్కలని బీజేపి జాతీయ అధికార ప్రతినిధి, రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు విమర్శించారు. కర్ణాటకలో పరస్పరం విమర్శలు చేసుకున్న జేడీఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీలు బీజేపిని అధికారంలోకి... Read more

  • Telangana deceiver cbn in congress led grand alliance alleges kcr

    తెలంగాణ ద్రోహితో కూటమా.?: కేసీఆర్

    Nov 26 | తెలంగాణ ద్రోహి, అంధ్రబాబుతో జతకట్టిన కాంగ్రెస్ కు రానున్న ఎన్నికలలో ప్రజలే బుద్ది చెబుతారని తెలంగాణ అపధర్మ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. వలసల జిల్లాగా పేరు పడిన పాలమూరును దత్తత తీసుకున్న... Read more

  • Cm kcr on defections to trs

    రాజకీయ సుస్థిరత కోసమే సభ్యులను కలుపుకున్నాం : కేసీఆర్

    Mar 14 | రాజకీయ సుస్థిరత సాధించటం కోసమే మిగతా పార్టీల సభ్యులను తాము కలుపుకున్నామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. తెలంగాణ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా బుధవారం అసెంబ్లీలో కేసీఆర్ ప్రసంగించారు. తెలంగాణ సాధన ఎంత ముఖ్యమే..... Read more

  • Kamal haasan on periyar statue vandalism

    విగ్రహాలను మేం కాపాడుకోగలం : కమల్ హాసన్

    Mar 07 | ప్రముఖ సంఘ సంస్కర్త, కుల వివక్ష వ్యతిరేక పోరాట యోధుడు, తమిళనాడుకు చెందిన పెరియార్ రామస్వామి విగ్రహాల కూల్చివేతపై ప్రముఖ నటుడు, మక్కల్ నీది మయ్యమ్ పార్టీ వ్యవస్థాపకుడు కమల్ హాసన్ స్పందించారు. పెరియార్... Read more

  • Ysrcp adi sheshagiri rao comments on cbn

    చంద్రబాబు మాటలు అదుపు తప్పుతున్నాయ్ : వైసీపీ ఆదిశేషగిరిరావు

    Jan 23 | చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఈ మధ్య మాటలు ఎందుకో అదుపు తప్పి మాట్లాడుతున్నారని వైసీపీ నేత ఆదిశేషగిరిరావు చెబుతున్నారు. పైగా చంద్రబాబు సీఎం అయిన తర్వాతే పంటలకు నీళ్లొస్తున్నట్టుగా మాట్లాడుతున్నారని ఆదిశేషగిరిరావు విమర్శించారు. తాజాగా‘ఐ... Read more