హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే రమ్మంటేనే ఢిల్లీ వచ్చినట్లు పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ తెలిపారు. రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ తరపున మంత్రి వట్టి వసంత్ కుమార్, డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ ఏం నివేదిక ఇస్తారో తనకు తెలియదని ఆయన అన్నారు.
కాగా రాష్ట్ర విభజనపై ఈ రోజు సాయంత్రం 4.30 గంటలకు కాంగ్రెస్ పార్టీ ప్రతినిధులుగా జీవోఎం సమావేశాని వట్టి, దామోదర హాజరు అవుతున్నారు. మరోవైపు కేంద్ర మంత్రుల బృందం (జీవోఎం)తో కాంగ్రెస్ పార్టీ సమావేశానికి ముందే సుశీల్ కుమార్ షిండేతో బొత్స సత్యనారాయణ సమావేశమవ్వడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.
కేంద్ర మంత్రుల బృందం (జీవోఎం)తో కాంగ్రెస్ పార్టీ సమావేశానికి ముందే షిండేతో బొత్స సత్యనారాయణ సమావేశమవ్వడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. జీవోఎం సమావేశానికి వెళ్లే కాంగ్రెస్ పార్టీ సభ్యుల్లో బొత్స ఒకరు కాకపోగా, షిండేతో 20 నిమిషాలపాటు భేటి కావడం మీడియాలో చర్చనీయాంశమైంది. వాస్తవానికి జీవోఎం సమావేశానికి కాంగ్రెస్ తరపున మంత్రి వట్టి వసంతకుమార్, డిప్యూటి ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహలు ఈరోజు సాయంత్రం సమావేశంకానున్నారు. ఈ నేపథ్యంలో షిండేను కలువడం అనేక సందేహాలకు తావిస్తోంది.
రాష్ట్ర విభజనపై పలు పార్టీలతో జరుగుతున్న కీలక జీవోఎం సమావేశానికి ముందు షిండేతో బొత్స సమావేశం కొంత వివాదానికి తెర తీసింది. బొత్స ను పీసీసీ పదవి నుండి తొలగించి, ముఖ్యమంత్రిగా ప్రమోషన్ ఇస్తారో తెలియదు. ఎందుకంటే.. నిన్న సోనియా గాంధీ తో మంత్రి కన్నా భేటీ అనంతరం కాంగ్రెస్ నాయకుల్లో ఇలాంటి చర్చలు జరుగుతున్నాయి. ఆ విషయం తెలుసుకున్న సీఎం తెలంగాణ మెదక్ జిల్లాలో ఈరోజు రచ్చ కార్యక్రమం జరగాల్సి ఉంది. కానీ సీఎ కిరణ్ రచ్చ బండాను ఈనెల 16, 17 తేదిలకు వాయిదా వేయటం జరిగింది. దీనిని బట్టి చూస్తే ..బొత్స మంచి యోగం ఉన్నట్లు కనిపిస్తుందని పార్టీలోని సీనియర్ నాయకులు అంటున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more