టామ్ బోయలన్ అనే 77 సంవత్సరాల రిటైర్ అయిన వ్యక్తి న్యూజెర్సీ చెరువులో చేపలను పట్టే సరదాతో గాలం వెయ్యగా 10 అంగుళాల చేప అతని గాలానికి చిక్కింది. ఇదేదో చూడటానికి పిరన్హా లా ఉందే అనుకుంటూ దాన్ని ఆ రోజు రాత్రి ఇంట్లో ఫ్రీజర్ లో భద్రపరచిన బోయలన్ మరుసటిరోజు అక్వేరియమ్ కి వెళ్ళి విచారిస్తే అది నిజంగానే పిరన్హా చేపే కాకుండా దానికో ప్రత్యేకత కూడా ఉందని తెలిసింది. అదేమిటంటే మనిషి వృషణాలను మరిగిన చేపట అది.
ఆ చేపలు పాకు జాతికి చెందినవని, అవి ఇద్దరు మత్స్యకారుల ప్రాణాలను హరించాయని చెప్పారు. వృషణాల మెలిపెట్టి లాగివేయటం వలన కలిగిన రక్తస్రావమే ఆ ఇద్దరు మరణించటానికి కారణమని తెలిసింది. ఈ సంగతి విన్న బోయలన్ షాక్ అయ్యానని, అంతకంటే ఇంకా ఏం చెప్పాలో అర్థం కాలేదని అన్నారు. పిరన్హా జాతికి చెందినవే అయినా పాకు కి అచ్చం మనిషికున్నట్లుగా పలువరస ఉండటం విశేషం.
దక్షిణ అమెరికాలోని అమెజాన్ కి చెందిన ఈ చేప ఇక్కడికెలా వచ్చిందా అని ఆ అక్వేరియం యజమానులు ఆశ్చర్యాన్ని వ్యక్తపరచారు. బహుశా ఎవరో తమ ఇంట్లో ఉన్న చిన్న అక్వేరియంలో పెంచుతుంటే ఇవి బాగా పెరిగి పోవటంతో వాటిని ఇందులో పడేసిపోయుంటారని భావిస్తున్నారు. పాకు చేపలు చాలా త్వరగా చాలా పెద్ద సైజులోకి పెరిగిపోయి ఇంట్లో అక్వేరియంలో పెట్టటానికి వీలుకాకుండా తయారౌతాయి.
ఎన్నో చోట్ల ఫిషింగ్ వేడుకగా చేసిన బోయలన్ ఈ అనుభవం చాలా గగుర్పాటుని కలిగించిందని చెప్పారు. వాటికి ఆ పలు వరస ప్రత్యేకంగా కొరకటం కోసమే కట్టించినట్లుగా ఉందని అన్నారాయన. పురష ద్వేషిలా మగవాళ్ళ మగతనాన్ని హరించటానికి అలవాటు పడ్డ ఆ చేపలకు అవి చేస్తున్నదేమిటో వాటికే తెలియకపోవచ్చని అన్నారు.
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more