ప్రజాస్వామ్యంలో ఎవరైనా సభలు పెట్టుకుని తమ వాదనలు విన్పించవచ్చని ఏపీ ఎన్జీవోల సభ నిర్వహించుకునే రోజే తెలంగాణ ఐకాస బంద్ కు పిలుపునివ్వడం సమంజసం కాదని బీజేపి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. ఉద్రిక్త పరిస్థితులతో ఉద్యమాలు పక్కదారి పడతాయని, బంద్ లేకుంటేనే భాగుంటుందన్నారు. ఏపీఎన్జీవోల సభకు అనుమతిచ్చిన విషయం తెలిసిందే. అయితే ఇలాంటి సమయంలో జేఏసీ చైర్మన్ ఫ్రొ. కోదండరామ్ , తెలంగాణ నేతలు, బంద్ కు పిలుపు ఇవ్వటం మంచి పద్దతి కాదు. రాజధాని పై సీమాంద్ర ప్రజలకు హక్కు ఉందని కిషన్ రెడ్డి అన్నారు. అయితే రెండు ప్రాంతాల ఉద్యోగుల మద్య కాంగ్రెస్ చిచ్చు పెట్టిందని, ఒకే కార్యాలయంలో పనిచేసేవారు కలిసి మాట్లాడుకోలేని, కలిసి భోజనం చేయలేని పరిస్థితి కల్పించిందన్నారు. ఇలా జరగటానికి కారణం కేవలం కాంగ్రెస్ పార్టీయేనని కిషన్ రెడ్డి అన్నారు. తెలంగాణ ప్రక్రియ జరగుతున్న సమయంలో.. తెలంగాణ నేతలు, తెలంగాణ ఉద్యోగులు తొందరపడితే.. విభజన ప్రక్రియకు ఆటంకం కలుగుతుందని కిషన్ రెడ్డి గుర్తు చేశారు. ఏపీ ఎన్జీవోలు సభ పెట్టుకున్నంత మాత్రం .. తెలంగాణ రాకుండా పోతుందా? తెలంగాణ ఇచ్చేది కాంగ్రెస్ పార్టీ, తీసుకునే తెలంగాణ ప్రజలు.. మధ్య ఎంతమంది ఎన్ని సభలు పెట్టిన ఫలితం ఏం ఉండదు కాబట్టి, తెలంగాణ నేతలు, తెలంగాణ ప్రజలు, తెలంగాణ ఉద్యోగులు సమయనం పాటించాలి. అప్పుడే మనకు తెలంగాణ దక్కుతుంది. ఎవరైన రెచ్చగొట్టే ప్రకటన చేయటం వల్ల ఇరుప్రాంతాలకు భారీ నష్టం జరిగే ప్రమాదం ఉందని ఆయన హెచ్చరించారు. ఏపీ ఎన్జీవోల సభ వల్ల తెలంగాణకు జరిగే నష్టం ఏం లేదని కిషన్ రెడ్డి అన్నారు. ‘‘ పులిని చూసి నక్క వాతలు పెట్టుకుందనే’’ విధంగా ఏపీ ఎన్జీవోల సభకు భయపడి తెలంగాణ బంద్ ప్రకటించారు అనే విషయం ప్రతి ఒక్కరికి అర్థం అవుతుంది. ఒకరకంగా చెప్పలంటే.. ఏపీ ఎన్జీవోల సభకు పబ్లిసిట్ పెంచుతుంది కేవలం తెలంగాణ నేతలే, తెలంగాణ ఉద్యోగులే. వీరి వలనే.. ఏపీ ఎన్జీవోల సభకు క్రేజ్ పెరుగుతుందని ఆయన అన్నారు. ఈ విషయం తెలుసుకొనే.. ఏపీ ఎన్టీవోల సభకు అడ్డుకోకుండా ఉంటే, వారి మనసులో ఉన్న మనోభావాలు ఏమిటో తెలంగాణ ప్రజలకు తెలుస్తాయని కిషన్ రెడ్డి అన్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more