రాష్ట్రాన్ని విడగొడితే సీమాంధ్రలో కాంగ్రెస్ పార్టీకి పుట్టగతులుండవని వివరణాత్మక... విశ్లేషణాత్మక హెచ్చరిక. ప్రస్తుతానికి విభజన ఫైల్ని పెండింగులో పెట్టండని సలహాపూర్వక హితోక్తి. సీమాంధ్రలో భగభగలు.. సచివాలయంలో సెగలుపొగలు... ఉద్యోగుల శంఖారావాలు... విపక్ష నేతల గర్జనలు... వెరసి కాంగ్రెస్ని దారుణంగా దెబ్బతీస్తున్నాయని... ఈ దశలోనన్నా మేలుకోకపోతే కోలుకోలేమని రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఆంటో కమిటి ముందు చెప్పినట్లు సమాచారం. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కమల్నాథ్ కూడా వచ్చి ఈ భేటీలో పాల్గొన్నారు. పార్లమెంటులో సమైక్యసెగలకు తన తల బొప్పికడుతున్న వైనాన్ని ఆయన ఆంటోనీ కమిటీ ముందు వెళ్ళబోసుకున్నారు. కిరణ్ తర్వాత సీమాంధ్ర కేంద్ర మంత్రులు, ఎంపీలు ఆంటోనీ కమిటీ ముందుకెళ్ళారు. మళ్ళీ అదే వాదన... అదే వివరణ. షిండే ప్రకటనల తీరుపై అసహనం వ్యక్తం చేశారు. మొత్తంమీద రెండున్నర గంటలకు పైగా ఈ భేటీలు సాగాయి. ఆ తర్వాత ఎవరి దారిన వారు నిష్క్రమించారు. అనుకున్నట్టుగానే ముఖ్య మంత్రి కిరణ్ మరోసారి ఆంటోనీ కమిటీ ఎదుట సమైక్యవాదాన్ని గట్టిగా వినిపించారు. పార్టీ అధినాయకత్వం పిలుపుతో ఢిల్లీకి చేరుకున్న సిఎం ఆంటోనీ కమిటీతో గంటన్నరకు పైగా మంతనాలు జరిపారు.
హైదరాబాద్ నుంచి విమానంలో ఇక్కడికి చేరుకున్న సిఎం కిరణ్ నేరుగా ఏఐసిసి కార్యాలయానికి వచ్చి వార్రూమ్లో అప్పటికే వేచిచూస్తున్న ఆంటోనీ కమిటీ సభ్యులతో సమావేశమయ్యారు. రాత్రి 7.30 గంటలకు ప్రారంభమైన సమావేశం 8.45 గంటలదాకా కొనసాగింది. భేటీ సందర్భంగా ముఖ్యమంత్రి తొలుత రాష్ట్రంలో నెలకొన్న తాజా పరిస్థితులను వివరించారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచడం మినహా మరో ప్రత్యామ్నాయం లేదని మరోమారు స్పష్టం చేశారు. విభజనకు సంబంధించి కాంగ్రెస్తోపాటు ఇతర పార్టీ లలో ఉన్న సీమాంధ్ర నేతలు ప్రజలతో కలిసి సమైక్య ఉద్యమంలో పాల్గొంటున్నారని, అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీని ప్రజలు వెలివేసే పరిస్థితులు వస్తున్నాయని చెప్పారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే కాంగ్రెస్ పార్టీని బహిష్కరించినా ఆశ్చర్యపోనవసరం లేదని సిఎం చెప్పినట్టు సమాచారం.
36 రోజులుగా సీమాంధ్ర ప్రాంతంలో జరుగుతున్న ఆందోళనలను, నెలకొన్న పరిస్థితులను ఈ సందర్భంగా ఆయన ఆంటోనీ కమిటీకి వివరించారు. రాష్ట్రంలో నెలకొన్న తాజా పరిస్థితులపై పూర్తిస్థాయి సమాచారంతో రూపొందించిన ఓ ప్రత్యేక నివేదికను నేరుగా సిఎం కేంద్రమంత్రి ఆంటోనీకి అందజేశారు. ఈ నివేదికలో రాష్ట్రాన్ని సమైక్యంగా ఎందుకు ఉంచాలి? విభజించడం వల్ల తలెత్తే పరిణామాలు, ఇబ్బందులు, పార్టీలో నెలకొన్న సందిగ్ధత, తిరుగుబాట్లు, రాజీనామాల వ్యవహారం తదితర అంశాలతోపాటు రాష్ట్రాన్ని విభజిస్తే ఇరు ప్రాంతాల్లో పార్టీ పరిస్థితి, ప్రతిపక్ష పార్టీలు ప్రజల్లోకి వెళ్ళి కాంగ్రెస్ పార్టీని దోషిగా నిలబెడుతున్న వైనాన్ని ఈ సందర్భంగా తన నివేదికలో సిఎం ప్రస్తావించారు. ఈ పరిణామాలను దృష్టిలో ఉంచుకుని విభజన ప్రక్రియను కొంత కాలంపాటు వాయిదా వేయాలని సిఎం కోరినట్టు అత్యంత విశ్వసనీయంగా తెలిసింది.
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more