నందమూరి హరికృష్ణ తన సొంత పార్టీ పైనే విమర్శలు చేసే దైర్యం చేస్తున్నాడు. పార్టీకి, చంద్రబాబుకు, బాలయ్యకు దూరంగా ఉంటున్న హరికృష్ణ దోరణిలో విచిత్రమైన మార్పులు చోటు చేసుకుంటున్నాయి. సమైక్యాంద్రకు మద్దతుగా రాజీనామా చేసిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఆ రాజీనామ విషయం పై టిడిపి నాయకులను తప్పుపడుతున్నారు. హరికృష్ణ రాజీనామా చేసిన వెంటనే.. స్పీకర్ కూడా అదే స్పీడ్ లో ఆమోదించిన విషయం తెలిసిందే. హరికృష్ణ తో పాటు టిడిపి ఎంపీలు కూడా రాజీనామాలు చేయ్యటం జరిగింది. కానీ వారి రాజీనామాలను మాత్రం స్పీకర్ ఆమోదించలేదు. కారణం ఏమిటో అప్పుడు ఎవ్వరికి తెలియాదు కానీ. హరికృష్ణ మాత్ర టిడిపి ఎంపీలు ఆడిన దొంగ నాటకాన్ని బయట పెట్టారు. టీడీపీ ఎంపీలు చేసిన రాజీనామాలన్నీ డ్రామాలేననే విషయం మరోసారి స్పష్టమైంది. పార్టీ ఎంపీలు సమర్పించిన రాజీనామాలు నిబంధనల ప్రకారం లేవని హరికృష్ణ అసలు విషయం బయటపెట్టారు. పదవులకు రాజీనామా చేయాలని చెప్పి పార్టీ కార్యాలయం నుంచి కొన్ని పత్రాలు పంపించారని, వాటిపై తాను సంతకం చేసి రాజ్యసభ చైర్మన్ కార్యాలయంలో అందజేసినా రాజీనామా ఆమోదం పొందలేదన్నారు. దీనిపై ఆరా తీస్తే రాజీనామా పత్రాలు నిబంధనల మేరకు లేవనే విషయం వెల్లడైందన్నారు.
రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా టీడీపీ ఎంపీలు రాజీనామా చేస్తున్నారని, మీరు కూడా చేయండని కోరుతూ ఎన్టీఆర్ భవన్ నుంచి తనకు ఓ పత్రం అందిందన్నారు. దానిపై సంతకం చేసి రాజ్యసభ చైర్మన్కు అందచేశాక వారం రోజులు గడిచినా ఎలాంటి స్పందనా కనిపించలేదన్నారు. తానే స్వయంగా వెళ్లి వాకబు చేయగా పార్టీ పంపిన రాజీనామా పత్రంలో శ్రీకృష్ణ కమిటీ నివేదికను సభలో ప్రవేశ పెట్టనందుకు నిరసనగా రాజీనామా చేస్తున్నట్టు పేర్కొన్నారని, ఇలాంటివి పొందు పరిస్తే తాము ఆమోదించలేమని చెప్పారని హరికృష్ణ వివరించారు. ఈ కారణంగానే తాను స్వయంగా మరో రాజీనామా లేఖను రాసిచ్చానని తెలిపారు. ఈ పత్రాన్ని స్వీకరించినవెంటనే రాజ్యసభ చైర్మన్ ఆమోదించారన్నారు. తెలుగు ప్రజలను వంచించకూడదనే ఉద్దేశంతోనే రాజీనామా చేశానని ఉద్ఘాటించారు. అయితే టిడిపి ఎంపీలు.. తెలుగు ప్రజలను మోసం చేశారని హరికృష్ణ మండిపడ్డారు. దీని వెనుక ఎవరు ఉన్నరో నాకు బాగా తెలుసునని, సమయం వచ్చిన వారి పేరు బయటపెడతానని హరికృష్ణ అన్నారు. ఇంటి గుట్టు హరికృష్ణ రట్టు చేస్తున్నారని కొంత మంది సీనియర్ నాయకులు హరికృష్ణ పై పరోక్షంగా మండిపడుతున్నారు. ఏమైన హరికృష్ణ మరోసారి తన బావ పై కయ్యానికి కాలుదువ్వుతున్నడని ..రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. హరికృష్ణ దూకుడు కు టిడిపిలో ఏం జరుగుతుందో చూడాలంటే.. కొద్ది రోజులు ఆగాల్సిందే.
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more