దేశంలోనే అత్యున్నత పౌర పురస్కారం అయిన భారత రత్న అవార్డు ఈసారి ఇండియన్ హాకీ లెజెండ్ ధ్యాన్ ఛంద్ ని వరించింది. ఈ మేరకు క్రీడా మంత్రిత్వశాఖ ప్రధాని కార్యాలయానికి లేఖ పంపించింది. గత కొంత కాలంగా అత్యున్నతమైన ఈ అవార్డుకు మన దేశం నుండి ఎవర్నీ ప్రతిపాదించకపోవడం పై పలు విమర్శలు ఎదుర్కొన్న క్రీడా శాఖ ఎట్టకేలకు ఈసారి ఆయన పేరును ప్రతిపాదించింది. 1928, 1932, 1936 ఒలింపిక్స్లో భారతదేశానికి మూడు స్వర్ణపతకాలు అందించి చరిత్ర స్రుష్టించారు. ఆయన మరణించి 24 సంవత్సరాలు అయిన ఇన్నాళ్ళకు ఆయన ప్రతిభను గుర్తించినందుకు ప్రతి ఒక్కరు గర్వించాల్సిందే. ప్రపంచ హాకీ చరిత్రలోనే అతనిలాంటి లెజెండ్ ఎవరూ లేరని హాకీ పండితులు అంటుంటారు.
గత కొంత కాలంగా ఈ అవార్డుకు క్రికెట్ దేవుడు సచిన్ పేరును ప్రతిపాదించాలని డిమాండ్ ఉన్నా, దీని పై పలు విమర్శలు రాడంతో ఇతన్ని ప్రక్కన పెట్టి ధ్యాన్ చంద్ పేరును ప్రతిపాదించారు. సచిన్ టెండూల్కర్ను కాదని ధ్యాన్చంద్ పేరును భారతరత్నకు సూచించడం సర్వసాధారణంగా చేసినదేనని క్రీడా మంత్రిత్వశాఖ తెలిపింది. టెండూల్కర్ పట్ల కూడా తమకు చాలా గౌరవం ఉందని, అదే సమయంలో ధ్యాన్ చంద్ దేశ క్రీడా చరిత్రలోనే అత్యున్నతుడని క్రీడాశాఖ కార్యదర్శి ప్రదీప్ దేవ్ అన్నారు. భారత హాకీ చరిత్రకు ఇది చాలా గర్వకారణమని, ఆయనకు ఈ అవార్డు వస్తుందని తాము ఎంతగానో ఆశిస్తున్నామని హాకీ ఇండియా సెక్రటరీ జనరల్ నరీందర్ బాత్రా అన్నారు. మొత్తానికి భారత రత్నకు ఎంపికైన తొలి క్రీడాకారుడిగా ధ్యాన్ చంద్ చరిత్ర పుటల్లోకి ఎక్కిన ఘనత దక్కింది.
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more