ఎన్నికల వేడి పంచాయతీ స్థాయిలో విచిత్రంగా సాగుతోంది. సర్పంచ్ పదవులకు ఎన్నికలు కాక వేలం ద్వారా అమ్మకాలు జరుగుతున్నాయి. ఆ గ్రామాల్లో వేలం ద్వారా కొనగలిగే వాళ్ళే ఆ పదవిని సంపాదించుకోగలగుతారు కానీ ఎన్నికల అధికారులు నిర్వహించే ఎన్నికల విధానంలో కాదు. అంటే ప్రజలు ఎన్నుకునేవాళ్ళు కాక డబ్బుతో కొనగలిగేవాళ్ళే ఆ పదవులను అందుకుంటారు.
ఎన్నికల్లో ఎలాగూ డబ్బు ఖర్చు పెట్టాలి. అదేమీ లేకుండా డబ్బునే ఫణంగా పెట్టి సర్పంచ్ పదవిని కొట్టేస్తే ఏ బాదరబందీ ఉండదని వాళ్ళ భావన. వేలం పాటలో పదవిని గెల్చుకున్నవాళ్ళు పాట సొమ్మును చెల్లించగా ఇతర అభ్యర్థులు బరిలోనుంచి తప్పుకుంటారు, ఎన్నికలు ఏకగ్రీవమవుతాయి. ఆలోచన చాలా బావుంది. ఎలాగూ డబ్బుతో కొనేదే కాబట్టి ఇలా కొనేస్తే గొడవ లేని పనని గ్రామస్థాయిలో నాయకులు కనిపెట్టేసారు.
కానీ ఇది ప్రజాస్వామ్య పద్ధతికి వ్యతిరేకం. అందువలన ఎన్నికల అధికారి నవీన్ మిట్టల్ అటువంటివి జరగకుండా చూస్తూ, ఈ లోగా వేలం నిర్వహించిన వారిమీద కేసులు నమోదు చెయ్యమని పోలీసులకు ఆదేశాలిచ్చారు. ఇవి బయటకు వచ్చిన కేసులు. ఇంకా ఎన్ని ఉన్నాయో తెలియవు కాబట్టి ఏ గ్రామంలోనైతే పోటీలేకుండా ఏకగ్రీవంగా ఎన్నికలు జరుగుతాయో అక్కడంతా విచారణ చేపడతామని, ఫలితాలను ఆ తర్వాతనే వెల్లడిస్తామని ఆయన అన్నారు.
ఇప్పటి వరకు రెండు పంచాయతీల మీద కేసులు పెట్టారు. మరో పంచాయతీ మీద కేసు పెట్టమని నవీన్ మిట్టల్ పోలీసులకు అదేశాలిచ్చారు. వరంగల్ జిల్లాలో అకల్చాడ గ్రామంలో ఎనిమిది మందిని, కరీం నగర్ జిల్లా కొత్తపల్లి లో 17 మందిని వేలం నిర్వహిస్తుండగా పట్టుకుని కేసులు పెట్టి వాళ్ళని అరెస్ట్ చేసారు.
ఇంతవరకూ అందిన నామినేషన్ల సంఖ్యను వెల్లడిస్తూ, సర్పంచ్ పదవికోసం 20994 నామినేషన్లు, వార్డు సభ్యత్వం కోసం 51961 నామినేషన్లు అందాయని తెలియజేసారు.
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more