వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో రాజీనామాలు పర్వం కొనసాగుతుంది. ఒకే రోజు పార్టీలో రాజీనామాలు ప్రక్రియం సాగింది. వైకాపాలో ముసలం మరింత ముదిరింది. ఇప్పుటికే నివురుగప్పిన నిప్పులా ఉన్న నేతల మద్య విబేధాలు రాజీనామాలకు దారితీస్తున్నాయి. ఈ రోజు నిజామాబాద్ లో ముగ్గురు సీనియర్ నేతలు, పార్టీకి గుడ్ బై చెప్పారు. వీరితో పాటు 15 మంది మండల కన్వీనర్లు మరికొందరు సేవాదళ సభ్యులు వైకాపాకు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. అంతేకాకుండా వారు పార్టీ పై కొన్ని కామెంట్లు కూడా చేశారు డబ్బున్న వారికే వైకాపా ప్రాధాన్యమిస్తోందని వారు విమర్శలు చేశారు. పార్టీ పూర్తిగా వ్యాపారాత్మకంగా మారిపోయి, నాయకులు రాజకీయం చేస్తున్నారని పార్టీ పై విరుచుకుపడ్డారు. మాజీ జెడ్పీ ఛైర్మన్ వెంకటరమాణ రెడ్డి, మునిపల్లి సాయి రెడ్డి, మోహన్ రెడ్డి పార్టీకి రాజీనామా చెయ్యటం జరిగింది. అలాగే మరో రెండు జిల్లాలో విబేధాలు ముదిరాయి. గుంటూరు, అనంతపురం జిల్లాల్లో వైయస్ జగన్ నాయకత్వంలోని వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో విబేదాలు తలెత్తాయి. కార్యకర్తలు రెండుగా విడిపోయారు.
గుంటూరు జిల్లాలో అసంతృప్తికి గురైన నాయకులు సమావేశం ఏర్పాటు చేసుకోగా, అనంతపురంలో బాహాబాహికి దిగారు. గుంటూరు జిల్లా వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో విభేదాలు మరింతగా పెరిగాయి. అధిష్టానంపై ఆగ్రహంతో ఉన్న పది నియోజకవర్గ నేతలు నవభారత్లోని ఓ అతిథిగృహంలో సమావేశమయ్యారు. భవిష్యత్తు కార్యాచరణపై వారు చర్చించనున్నట్లు తెలుస్తోంది. తమకు ప్రాధాన్యం ఇవ్వడం లేదంటూ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అనంతపురం జిల్లా వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో విభేదాలు రచ్చకెక్కాయి. జిల్లాలోని కళ్యాణదుర్గం పార్టీ కార్యాలయంలో నేతలు బాహాబాహీకి దిగారు. యెల్ల రామ్మోహన్రెడ్డిపై కృష్టప్ప వర్గీయులు ప్రత్యర్థులు దాడికి దిగారు. మోహన్రెడ్డిపై మహిళలు దాడి చేశారు. దీంతో ఇరు వర్గీయుల మధ్య వాగ్వాదం నెలకొంది. విషయం తెలిసిన పోలీసులు అక్కడకు చేరుకుని పరిస్థితి అదుపు చేసేందుకు ప్రయత్నించారు. వైసీపీలో ముసలం ముదిరిపోయి..రచ్చ రోడ్డుకెక్కుతుంది.
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more