మాజీ మంత్రిగా, ఎంపీగా , ఎమ్మెల్యేగా రాష్ర్ట ప్రజలకు బాగా తెలిసిన వ్యక్తి. వైఎస్సార్ పట్ల అభిమానంతో వైకాపా పెట్టిన తొలి రోజుల్లోనే జగన్ పక్షాన నిలిచిన నేత కొణతాల రామకృష్ణ.. పార్టీలో తనకంటూ గుడ్విల్ కలిగిన లీడర్. గవర్నింగ్బాడి సభ్యునిగా పార్టీ విధాన నిర్ణయాల్లో ప్రధాన భూమికను నిర్వహిస్తున్నారు. వైవి సుబ్బారెడ్డి, మైసూరారెడ్డి వంటి నేతలపై పార్టీలో వ్యతిరేక స్వరాలు వినిపిస్తున్నాయి, కానీ కొణతాల పట్ల పార్టీ క్యాడర్లో ఏ కోశాన మరో విధమైన అభిప్రాయానికి చోటులేదు. అలాంటి నేత ఇప్పుడు దీర్ఘాలోచనలో పడ్డారు. తెలుగుదేశం పార్టీకి చెందిన మాజీ మంత్రి దాడి వీరభద్రరావును పార్టీలోకి తీసుకోవాలనే ప్రతిపాదన తెరపైకి రావడం, ఆయనలో ఆగ్రహాన్ని తెప్పించింది. వాస్తవానికి అనకాపల్లి ఎంపీ సబ్బం హరి మౌనంగానే ఉంటూ దాడి వీరభద్రరావును వైకాపాలోకి తీసుకురావడానికి ప్రయత్నాలు చేశారని తెలుస్తోంది. అంతే గాకుండా అధినాయకత్వంతో ఒప్పించి అనకాపల్లి అసెంబ్లీ టికెట్ ఇప్పిస్తానని కూడా దాడికి హరి మాటిచ్చినట్లు వార్తలు వచ్చాయి.
ఇవి సహజంగానే పార్టీలో తొలి నుంచి పనిచేస్తూ అదే అసెంబ్లీ స్థానంపై లక్ష్యంగా పెట్టుకున్న కొణతాల రామకృష్ణకు మనసునొప్పించాయి. ఈ విషయాన్ని లోటస్పాండ్ దృష్టికి తీసుకెళ్లారు. అనకాపల్లిలో వైకాపా కార్యకర్తలు రచ్చచేశారు. దాడిని పార్టీలోకి చేర్చుకోరాదని నినదించారు. సామూహికంగా సంతకాలు చేసి మెమరాండంను పార్టీకి పంపించారు. వైఎస్ను జగన్ను తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టిన దాడిని ఎలా చేర్చుకుంటారని అక్కడి కార్యకర్తలు బాహాటంగా అభ్యంతరం వ్యక్తం చేశారు. కొణతాల వెనకుండి వ్యవహారాన్ని నడిపించారని చెబుతున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో కొణతాల లోటస్పాండ్లో తన మనసులోని మాటను పంచుకున్నారు. ఎవరిని పడితే వారిని పార్టీలోకి చేర్చుకంటే ఎలా, దాడి మనకు మన పార్టీకి చాలా డ్యామేజ్ చేశారు.
అలాంటి వారిని ఎలా చేర్చుకుంటారు. క్యాడర్ ఏ విధంగా జీర్ణించుకుంటుంది, దాడి మన పార్టీ నాయకులపై చేసిన విమర్శలు, ఆరోపణల సీడీలను బయట ప్రచారం చేస్తాం మంటూ అనకాపల్లి కార్యకర్తల నుంచి ఎదురవుతున్న వ్యతిరేకతను లోటస్పాండ్ దృష్టికి రామకృష్ణ తీసుకెళ్లారు. సబ్బంహరి అక్కడ దాడికి అసెంబ్లీ టికెట్ హామీ ఇచ్చారని జరుగుతున్న ప్రచారాన్ని ప్రస్తావిస్తూ మరి నా సంగతి ఏమిటని, అలా అయితే పార్టీలో తను కొనసాగడంలో అర్థం లేదని ఒకింత అసహనంగానే కొణతాల మాట్లాడినట్లు సమాచారం. తొందరపడొద్దని అక్కడి వారు రామకృష్ణను వారించినట్లు తెలిసింది.
దాడి ని పార్టీలో చేర్చుకోవాలా వద్దా అనే అంశాన్ని అధినేత జగన్ తేలుస్తారని, అప్పుడే టికెట్ ఆయనకిచ్చినట్లు భావించడం సరికాదని కొణతాలను లోటస్పాండ్లో సీనియర్లు సముదాయించినట్లు తెలుస్తోంది. మొత్తనికి దాడికి పార్టీలో చేరుతారో లేదో ఆయనకి ఏ టికెట్ ఇస్తారో లేదో తెలియదు కానీ ఏది తేలకముందే వైకాపాలో గొడవలు మొదలయ్యాయి. ఈ పరిణామాల నేపథ్యంలో దాడి చేరికపై అధినేత జగన్ ఎటువంటి నిర్ణయం ప్రకటిస్తారో, దానిపై కొణతాల రామకృష్ణ ఎలా ప్రతిస్పందిస్తారో, ఈ సమస్యను ఎలా లోటస్పాండ్ అధిగమిస్తుందో వేచి చూడాల్సిందే.
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more