నయనతార టైమ్ మళ్లీ స్టార్ట్ అయ్యింది...’ తెలుగు, తమిళ పరిశ్రమల్లో ఇప్పుడు వినిపిస్తున్న మాట ఇది. ప్రభుదేవాతో విఫల ప్రేమాయణం తర్వాత సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చిన ఈ సొగసరి ప్రస్తుతం భారీ అవకాశాలతో దూసుకుపోతోంది. నాగార్జున సరసన ఈ ముద్దుగుమ్మ నటించిన తాజా చిత్రం ‘గ్రీకువీరుడు’ ప్రేక్షకులముందుకొచ్చింది. ఇదిలావుండగా ఈ సుందరి బాలకృష్ణతో ముచ్చటగా మూడోసారి నటించనుందని తెలుస్తోంది. బాలకృష్ణ కథానాయకుడిగా దర్శకుడు బోయపాటి శ్రీను ఓ చిత్రాన్ని రూపొందించబోతున్న విషయం తెలిసిందే. ఇందులో కథానాయికగా నయనతారను ఎంపికచేసినట్లు సమాచారం. ‘సింహా’ ‘శ్రీరామరాజ్యం’ చిత్రాల్లో బాలకృష్ణ సరసన నటించి ప్రేక్షకుల్ని మెప్పించింది నయనతార. ప్రేక్షకుల్లో వీరిద్దరికీ హిట్పెయిర్ అనే గుర్తింపు వుంది. ఆ సెంటిమెంట్ దృష్ట్యానే నయనతారను కథానాయికగా ఎంపికచేశారని తెలిసింది.
ఛార్మి కథానాయికగా నటించిన సస్పెన్స్ థ్రిల్లర్ ‘మంత్ర ’ ఏస్థాయి విజయం సాధించిందో అందరికి తెలిసిందే. తులసీరామ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఛార్మీకి మంచి క్రేజ్ని తెచ్చిపెట్టింది. ఆ తరువాత వీరిద్దరి కలయికలో వచ్చిన ‘మంగళ’ అంతగా ఆకట్టుకోలేకపోయింది. అయితే తాజా సమాచారం ప్రకారం మళ్లీ వీరిద్దరు ముచ్చటగా మూడవసారి కలిసిపనిచేయబోతున్నారని తెలిసింది. మంత్ర ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై ఈ చిత్రాన్ని సి.హెచ్.వి. శర్మ నిర్మించబోతున్నారు. తులసీరామ్ దర్శకత్వం వహించనున్న ఈ చిత్రంలో ఛార్మి ఓ విభిన్నమైన పాత్రలో కనిపించనుందని చిత్ర వర్గాల సమాచారం. ‘మంత్ర’ తరువాత కథానాయికగా ఆ స్థాయి విజయాన్ని అందుకోని ఛార్మి తాజా చిత్రంతో భారీ విజయాన్ని దక్కించుకోవాలని భావిస్తోందట. ఇటీవల కథానాయిక వేశాలు పక్కన పెట్టి ప్రత్యేక గీతాల్లో మురిపించిన ఈ ముద్దుగుమ్మ తాజాగా ‘టెన్త్క్లాస్’ ఫేమ్ చందు దర్శకత్వంలో రూపొందుతున్న ‘ప్రేమ ఒక మైకం’లో నటిస్తోంది. ఈ సినిమాలో ఛార్మీ వేశ్య పాత్రలో కనిపించనున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం త్వరలో విడుదలకు సిద్ధమవుతోంది.
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more