అందరికీ వచ్చిన అనుమానం నిజమే అయింది. తెలుగు దేశం పార్టీ నుంచి రాజీనామా చేసిన సీనియర్ నేత దాడి వీరభద్రరావు తాను వైయస్ ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నానని ప్రకటించారు. 30 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీకి సేవ చేసినా గుర్తింపు లేకపోయిందని, తనను అవమానించారని ఆయన వాపోయారు. రేపు పదిగంటలకు ఆయన వైకాపా తీర్థం కోసం చంచల్ గూడా జైలుకి వెళ్ళనున్నారు.
శాసనమండలి సభ్యత్వం నుంచి పదవీ కాలం అయిపోయిన తన స్థానంలో తనకి మరో అవకాశం ఇవ్వకుండా మరొకరిని నిలబెట్టారంటూ దాడి వీరభద్రరావు తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు మీద అప్పుడే ఆగ్రహం చూపించారు కానీ తెదేపా కి విధేయతగా ఉంటానని కూడా అప్పట్లో మాటిచ్చారు. ఈలోపులో తన మద్దతుదారులను సంప్రదించి ఒక నిర్ణయానికి వచ్చిన దాడి పార్టీ సభ్యత్వం నుంచి రాజీనామా చెయ్యటంతో ఆయన వైకాపా లో చేరుతారనే అభిప్రాయం చాలామందిలో కలిగింది. దాన్ని నిజం చేస్తూ ఆయన అనకాపల్లిలో మీడియా ముఖంగా ప్రకటన చేసారు.
సీనియర్ నేతగా మరో పార్టీలోకి వెళ్ళి చేరటానికి ఒక మిష కావాలి కాబట్టి దాడి అలా కోపాన్ని ప్రదర్శించారని అప్పట్లోనే గుసగుసలు వినిపించాయి. కానీ తాను పార్టీకి విధేయుడిగా ఉంటానని అంటూనే ఆయన తన భావి రాజకీయ జీవితాన్ని వైయస్ జగన్ ఛత్రఛాయలో గడపటానికి వ్యూహ రచన చేసారని రాజకీయ పండితులు భావిస్తున్నారు.
తెదాపాలో పదవీ కాలం అయిపోయిన తర్వాత ఎమ్మెల్సీ టికెట్ ఇవ్వలేదు సరే కానీ అక్కడ ఏమీ లేదు సరిగదా, ముందుగానే ఆ పార్టీలో చేరిన సీనియర్ కొణతాల రామకృష్ణ, దాడి వీరభద్రరావు ఆ పార్టీలో చేరుతానని ప్రకటించక ముందునుంచే దాన్ని ఊహించి, ఆ ప్రక్రియను అడ్డుకోవాలని తన మద్దతుదారులైన కార్యకర్తలతో సమావేశమై నిర్ణయించుకున్నట్టుగా సమాచారం. వైకాపా లో చేరుతానని ప్రకటన చెయ్యటానికి ముందు దాడి వీరభద్రరావు అనకాపల్లిలో కార్యకర్తలతో జరిపిన సమావేశంలో ఆయన తెదేపాలో కొనసాగితేనే మంచిదని వారు సలహా ఇచ్చినట్టుగా కూడా సమాచారం.
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more