సొంత పార్టీ నాయకులే సీఎం ను టార్గెట్ చేసి విమర్శలతో, ఫిర్యాదలతో ఆడుకుంటున్న విషయం తెలిసిందే. ఇలాంటి సమయంలో ముఖ్యమంత్రి నల్లారి కుమార్ రెడ్డికి అండగా నిలిచాడు రెబల్ నాయకుడు జగ్గారెడ్డి. జగ్గారెడ్డి పేరు వింటే కొంత మంది నాయకులకు గుండెళ్లో రైళ్ళు పరిగేత్తుతాయి. ఇప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి ప్రత్యర్థుల పైకి జగ్గారెడ్డి ని వదులుతున్నాడు. వివాదాస్పద వ్యాఖ్యలతో ఎప్పుడూ వార్తల్లో ఉండేటు వంటి ప్రభుత్వ విప్ జగ్గారెడ్డి తాజాగా మరోమారు వార్తల్లోని వ్యక్తి అయ్యారు. మాటలతోనే కాదు చేతల్లోనూ జగ్గారెడ్డి రూటే సెపరేటు. టీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ కుటుంబమన్నా, మజ్లిస్ పార్టీ పేరెత్తినా జగ్గారెడ్డి ఒంటికాలు మీద లేస్తారు. టైం దొరికితే చాలు కేసీఆర్ కుటుంబాన్ని ఉతికి ఆరేసే గ్గారెడ్డి...తాజాగా దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్ గురించి, ఆయన కుమారుడు వైఎస్.జగన్మోహన్రెడ్డి గురించి చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారాయి. ఓ వైపు టీఆర్ఎస్ చీఫ్, మజ్లిస్ పార్టీని,
మరోవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని లక్ష్యంగా చేసుకుని మాటల తూటాల్ని కురిపిస్తున్న జగ్గారెడ్డి...ప్రభుత్వం విషయానికి వచ్చే సరికి సీఎం కిరణ్కుమార్రెడ్డిపై ఈగ కూడా వాలనివ్వడం లేదు. బయ్యారం గనుల జీవో జారీ సందర్భంగా ప్రతిపక్షాలన్నీ సీఎం కిరణ్ణు టార్గెట్గా చేసుకుని మాటల దాడికి దిగుతున్నది. ఈ నేపథ్యంలో జగ్గారెడ్డి రివర్స్ అటాక్కు దిగారు. ఏళ్ల తరబడిగా కాంగ్రెస్ పార్టీలో ఉంటున్నటు వంటి, బాధ్యత గల వ్యక్తులు భిన్నాభిప్రాయాల్ని వ్యక్తం చేస్తున్న తరుణంలో జగ్గారెడ్డి మాత్రం కిరణ్కు అండగా నిలిచారు. తెలంగాణ ఆస్థులు అమ్మకుండా కాపాడుతున్న కిరన్ ను ఏమైనా అంటే ఊరుకోననీ హెచ్చరిక జారీ చేస్తున్నారు. తాజాగా వైఎస్ఆర్ సీపీ పార్టీపై, కేసీఆర్పై, మందకృష్ణ మాదిగను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో ఆసక్తికరమైన చర్చకు దారితీసింది. 2005 నుంచి కాంగ్రెస్కు దగ్గరైన జగ్గారెడ్డి 2009లో జరిగిన ఎన్నికల్లో సంగారెడ్డి నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు. పార్టీలతో సంబంధం లేకుండా జగ్గారెడ్డి తనకంటూ ఓ క్యాడర్ను ఏర్పాటు చేసుకోవడంతోనే ఎవరినైనా ఎదురించే స్థాయి వరకు ఎదిగినట్లు ఆయన వ్యవహారశైలియే చెప్పకనే చెబుతుంది. ఇకపోతే, తాజాగా వైఎస్ఆర్సీపీ, కేసీఆర్ కుటుంబంపై చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో ప్రకంపనాలు సృష్టిస్తున్నది. దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్రెడ్డి వల్ల సమైక్యవాదిగా, కాంగ్రెస్ నేతగా ఎదిగిన జగ్గారెడ్డి....తాజాగా వైఎస్ చేసిన తప్పులే కాంగ్రెస్ పార్టీకి శాపంగా మారాయంటున్న తీరుపై ఆసక్తికరమైన చర్చ సాగుతున్నది. అంతేకాదు, మరో అడుగు ముందుకేసి వైఎస్ కుటుంబ సభ్యుల్ని ఉద్దేశించి మంచి సంతానం లేకపోవడం వల్ల వైఎస్ పేరు అప్రతిష్టపాలవుతుందన్నారు. నాడు వైఎస్ కుటుంబ సభ్యుల బ్లాక్మెయిల్కు ఇష్టానుసారంగా కేటాయింపులు కేటాయించడం వల్ల ఇప్పుడు ఈ గతి పట్టిందన్నారు. కుటుంబ సభ్యులకు తగ్గి వైఎస్ అనేక తప్పుడు పనులు చేశారనీ,
జగన్ మంచోడు అనుకుని తాము ఆనాడు మద్దతుగా నిలబడ్డామనీ తరువాత ఆయన నిజస్వరూపం ఏమిటో తెలిసి దూరమయ్యారంటూ వైఎస్ఆర్ కుటుంబాన్ని ఉద్దేశించి జగ్గారెడ్డి చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. అదే విధంగా కేసీఆర్ను కూడా జగ్గారెడ్డి తన మాటలతో ఉతికి ఆరేశారు. గతంలో నోరు మెదపని కేసీఆర్ ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారనీ మండిపడ్డారు, బయ్యారం గనుల జీవో గురించి రాద్దాంతం చేయడం పట్ల విరుచుకుపడ్డారు. కేసీఆర్ కుటుంబంపై జగ్గారెడ్డి చేశారంటే దానికోర్థం వున్నది. ఉన్నఫలంగా వైఎస్ను, వైఎస్ఆర్ సీపీని టార్గెట్ చేయడం అనేది చూస్తుంటే ముందస్తు ప్రణాళికగానే రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. రానున్న రోజుల్లో వైఎస్ను మరింతగా టార్గెట్ చేసేందుకే జగ్గారెడ్డి తన దూకుడును పెంచారనీ అంటున్నారు. ఒకప్పుడు వైఎస్కు అత్యంత సన్నిహితంగా మెలిగిన జగ్గారెడ్డి ఇప్పుడు ఆ కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకుని మాటల తూటాల వేగాన్ని పెంచడం వల్ల రాజకీయ వర్గాలో బాగానే చర్చ సాగుతున్నది. జగ్గారెడ్డి చేసిన వ్యాఖ్యలు హాట్హాట్ టాఫిక్గా మారాయని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more