విద్యుత్ సమస్య మీద గనక సోమవారం కూడా శాసనసభలో చర్చకు అనుమతించకపోతే మాక్ సభ నిర్వహిస్తామంటున్నారు తెలుగు దేశం పార్టీ నాయకుడు ఎర్రబెల్లి దయాకర్ రావు.
విద్యుత్ సమస్య చాలా గడ్డు సమస్యని, దాన్ని మించిన సమస్య మరేమీ ఉండదని, అందువలన దానిమీద శాసన సభలో చర్చకు అవకాశం కల్పించాలని తెలుగుదేశం పార్టీ శాసన సభ మొదలైన దగ్గర్నుంచీ కోరుతూనే వుంది. కానీ సభ మొదలవటం, ప్రతిపక్షాల వాయిదా తీర్మానాలను సభాపతి అంగీకరించకపోవటంతో ఆందోళనల మధ్య సభ సాగటం లేదని వాయిదా వెయ్యటం, తిరిగి ప్రారంభించగానే మళ్ళీ ఆందోళనలు, ఈ విధంగా శాసన సభ సజావుగా సాగిన సందర్భం బడ్జెట్ సమావేశాలు ప్రారంభమైన దగ్గర్నుంచి ఇంతవరకూ రాలేదు.
సభను సాగేట్టుగా చూసే బాధ్యత సభాపతి దని, కాంగ్రెస్ ప్రభుత్వం దాటవేసే దిశగానే సభను వాయిదాలు వేస్తున్నదని తెలుగు దేశం పార్టీ వాళ్ళు ఆందోళన చేస్తూ, శుక్రవారం నాడు సభ మూసివేసిన తర్వాత కూడా శాసన సభలో రాత్రి 11 గంటల వరకూ ఆందోళన కొనసాగిస్తూనే వున్నారు. నిన్న పాదయాత్ర చేస్తూ శాసన సభకు చేరుకుని తమ నిరసనను కూడా తెలియజేసారు.
ఇక ఉపేక్షించేది లేదని, రేపు సోమవారం విద్యుత్ సమస్య మీద చర్చను తీసుకోకపోతే మాక్ సభను నిర్వహించి అందులో ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడతామని, దానితో పాటు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, సభాపతి నాదెండ్ల మనోహర్ నివాసాల ముందు ధర్నా చేస్తామని ఎర్రబెల్లి హెచ్చరించారు.
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more