తెలంగాణ గురించి అడిగితే దోసే అంటడా? అంత బలుపా.. పాగల్ గాళ్లా? పోరాటాన్ని ఎలా అవహేళన చేస్తడు? మహిళలు తలచుకుంటే దోసె పిండి లెక్కనే పిసికేస్తరు? సమ్మె చేశాం.. సహాయ నిరాకరణ చేశాం..? ఇంకేం చేయాలి..? ప్రధానిని పండబెట్టి కొడతామా? ఇలాంటి తిట్లు ఉపయోగించేది ఎవరు మనకు బాగా తెలుసు. ఫామ్ హౌస్ లో ఉన్న మాటల మాంత్రీకుడు తన మంత్రాలు చదవటం మొదలుపెట్టారు. ఈ సారి ఏకంగా కేంద్ర మంత్రిని టార్గెట్ చేయటం జరిగింది. కేంద్ర మంత్రి దోశ, అప్పడం అన్న రెండు మాటలకే మన మాటల మాంత్రీకుడు .. 100 పేజీల బుక్ ఫ్రింట్ చేసుకోనే విధంగా బండ బూతులు తిట్టి తర్వలో ఫ్రింట్ చేసుకోమని సలహా ఇవ్వటం జరిగింది. ఈ మాటల మంత్రికుడి దెబ్బకు కేంద్ర మంత్రికి మైండ్ బ్లాక్ అయ్యిందని సమాచారం. ఇంతకీ మన మాటల మాంత్రీకుడు ఎవరు అనుకుంటున్నారు. కలుగులో ఉన్నకేసిఆర్. కేంద్ర మంత్రి వాయిలార్ రవి పై తిట్ల వర్షం కురిపించారు. ప్రత్యేక తెలంగాణ ఇవ్వడం దోసె వేసినంత తేలిక కాదంటూ కేంద్ర మంత్రి, రాష్ర్ట కాంగ్రెస్ వ్యవహారాల పరిశీలకుడు వాయిలార్ రవి చేసిన వ్యాఖ్యలు రాజకీ యంగా దుమారం రేపుతున్నాయి. అడగ్గానే వేసివ్వడానికి ఇదేమైన దోసె అనుకుంటున్నారా? అంటూ వాయిలార్ వ్యాఖ్యానించడాన్ని టీఆర్ఎస్ అధినేత కేసిఆర్తో పాటు ఆ పార్టీ నేతలు ఫైర్ అయ్యారు.
తెలంగాణ ఇస్తారో ఇవ్వరో తేల్చుకోకుండా దోసె, అప్పడం ఇడ్లీ వడ అంటూ వెటకారపు మాటలు ఎందుకు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ప్రజల ఆకాంక్షలపై నీళ్లు చల్లుతారెందుకని వారు ధ్వజమెత్తుతున్నారు. తెలంగాణ ఇస్తే ఇవ్వండి లేకపోతే లేదు కానీ, తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని కించపర్చేలా మాట్లాడడం సరికాదన్నారు. తెలంగాణ మహిళలు తలచుకుంటే దోసే పిండిలా పిసికేస్తారని హెచ్చరించారు. అసలు వయాలార్ రవి సోయి ఉండి మాట్లాడుతున్నాడా? ఆయనకు జ్నానం ఉందా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక నుంచి ఒళ్లు దగ్గరపెట్టుకొని మాట్లాడాలని హెచ్చరించారు. వాళ్లు తెలంగాణ ఇవ్వకపోయినా జేజమ్మ దగ్గర నుంచి తెచ్చుకుంటామని కేసిఆర్ స్పష్టం చేశారు.
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more