కాంగ్రెస్ పార్టీ అధ్యక్షరాలు సోనియా గాంధీ అయినప్పటికి, కాంగ్రెస్ పార్టీని బలపేతం చేయటానికి రాహుల్ సన్నాహాలు చేస్తున్నారు. లోక్ సభకు సాధారణ ఎన్నికలతో సహా వివిధ ఎన్నికలు వేగంగా సమీపిస్తుండడంతో రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీని చక్కదిద్దే ప్రక్రియకు పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ కసరత్తు చేస్తున్నారు. పీసీసీ , అధ్యక్షులు , కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీల నాయకులతోనూ రాహుల్ సమావేశాలు జరుపుతున్నారు. దేశంలో కాంగ్రెస్ పార్టీ 12 రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నప్పటికీ, కాంగ్రెస్ తనంతట తానుగా పాలన సాగించే ప్రధాన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ , ఉత్తరప్రదేశ్ , బీహార్ , గుజరాత్ , మధ్యప్రదేశ్ , పశ్చిమబెంగాల్ , తమిళనాడు వంటి ప్రధానమైన రాష్ట్రాల్లో చాలాకాలం నుంచీ కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేని విషయాన్ని రాహుల్ గాంధీ గుర్తు చేశారు. ఇప్పుడు ముఖ్యమంగా రాహుల్ గాంధీ ద్రుష్టి ఆంద్రప్రదేశ్ మీద పెట్టినట్లు తెలుస్తోంది. 2014 ఎన్నికలకు సమయం ముంచుకొస్తున్నందున రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేయాలని నిర్ణయించారు. ఇందుకు అవసరమైన కఠిన చర్యలు తీసుకోవాలని రాహుల్ గాంధీ తీర్మానించారు. ఆంద్రప్రదేశ్ లో పార్టీ ప్రక్షాళనకు నడుం కట్టిన రాహుల్ ఇందుకు తీసుకోవలసిన చర్యలపై వారితో చర్చించినట్లు సమాచారం. ఈ సమావేశంలో ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా ఆయన దిశానిర్ధేం చేస్తారని పేర్కొన్నారు.
రాహుల్ కీలక బాధ్యతలు అప్పగిస్తూ రాజస్థాన్ లోని జైపూర్ లో జరిగిన చింతన్ శిబిర్ లో పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. కాంగ్రెస్ ప్రభుత్వాలున్న రాష్ట్రాల్లో ఆయా ప్రభుత్వాల పనితీరు, పథకాల అమలుపై రాహుల్ చర్చిస్తారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అలాగే కేంద్ర ప్రభుత్వం చేపడుతన్న నగదు బదిలీ పథకంతో పాటు బడ్జెట్ లో ప్రవేశ పెట్టబోయే జనారంజక పథకాలపై సలహాలను కూడా పార్టీ నేతల ద్వారా స్వీకరించే అవకాశాలున్నాయని సమాచారం. మన రాష్ట్రం నుండి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి , పీసీసీ అధ్యక్షులు బొత్స సత్యనారాయణ ఈ సమావేశానికి హాజరయ్యరు .
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more