ప్రపంచమంతట ప్రేమికుల రోజు జరుపుకుంటున్నారు. అలాగే భారత మొత్తం పెళ్లి సందడితో కళకళాడిపోతుంది. ప్రేమికుల రోజు, పెళ్లి సందడి రెండు దగ్గర బంధువుల్ల కలిసి వచ్చాయి. ప్రేమికుల రోజు ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 14న వస్తుందని తెలుసు. కానీ మూడురోజులు వరుసగా పెళ్లి సందడే కనిపిస్తుంది. 13, 14, 15 తేదీల్లో కలిసి లక్షలాది పెళ్లిళ్లు జరుగుతున్నట్లు సమాచారం. కేవలం ఒక్క హైదరాబాద్ లోనే 40 వేల వరకూ పెళ్లిళ్లూ జరుగుతున్నాయి. అసలు లక్షలాది పెళ్లిళ్లు జరగటానికి కారణం ఏమిటి? అంటే మాఘమాసంలో మంచి ముహూర్తాలు మూడు రోజులు మాత్రమే ఉండటంతో ఫిబ్రవరి 13, 14, 15 తేదీల్లో రాష్ట్రంలో పెళ్లి సందడి నెలకొంది. 13, 14, 15 తేదీల్లో ముఖ్యంగా 14వ తేదీన వాలైంటైన్స్ డే కావడంతో వివాహ బంధంతో ఒక్కటవ్వాలని అనేక జంటలు భావిస్తున్నాయి. ఇదే రోజున తిరుమల శ్రీవారి ఆలయంలో పెళ్లిళ్లు చేసుకోవాలని వధూవరులు తాపత్రయపడుతున్నారు. మాఘ మాసంలో పెళ్లిళ్లు చేసుకుంటే సూర్య భగవానుడి కృప లభిస్తుంది. అలాంటి ఈ మాఘమాసంలో కేవలం మూడు రోజులు మాత్రమే వివాహ ముహూర్తాలు ఉండటం, ఆ వెంటనే మూఢలు, ఆ తర్వాత వివాహం వంటి శుభకార్యాలయాలకు అనుకూలం కాని శూన్యమాసం ప్రారంభం కావడంతో ఫిబ్రవరి 13, 14, 15 తేదల్లో భారీ సంఖ్యలో పెళ్లిళ్లు జరుగుతున్నాయి. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ చూసినా పెళ్లి సందడి కనిపిస్తోంది. ఈ మూడు రోజుల్లో లక్షలాది పెళ్లిళ్లు జరగనున్నాయి. ఒక్క తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారి సన్నిధిలోనే ఈ మూడు రోజుల్లో ఐదువేల ఏడువందల జంటలు ఏకం కానున్నాయి. పెళ్లిళ్లకు మంచి ముహూర్తంగా భావించే రేవతీ నక్షత్రానికి తోడు ఈ నెల 14వ తేదిన ప్రేమికుల రోజు ఉంది.
దీంతో మంచి ముహూర్తంతో పాటు వాలెంటైన్స్ డే రోజు ఒక్కటయ్యేందుకు వేలాది జంటలు ఉత్సుకత చూపిస్తున్నాయి. నందననామ సంవత్సరానికి ఇవే చివరి ముహూర్తాలు కావడంలో రాష్ట్రంలో లక్షలాది వివాహాలు జరుగుతున్నాయి. అయితే లక్షలాది పెళ్లిళ్లు అయ్యే ఖర్చు ఎంతో తెలుసా? అక్షరాల 25 వేల కోట్ల రూపాయలు అని ఆంద్రవిశేష్.కామ్ సర్వే చేసినట్లు సమాచారం. ఈ లక్షలాది పెళ్లిళ్ల సందడితో అన్నీ రేట్లు విపరీతంగా పెరిగాయి. ఒక్క పూరోహితుడు 6 నుంచి 10 పెళ్లిళ్లకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పాడింది. దీనికి తగ్గట్టుగా రేట్లూ పెరిగాయి. సందట్లో సడేమియాలగా బ్యాండ్ బ్రుందాలు రేట్లు పెంచారు. 10 వేల నుండి 30 వేల వరకు పెరిగాయి. పెళ్లికి సంబంధించిన అన్ని వస్తువులు భారీ స్థాయిలో రేట్లు పెంచారు. అయిన ప్రజలు మాత్రం వెనక్కి తగ్గకుండా పెళ్లికి గ్రాండ్ లుక్కు రావాలని కోట్ల రూపాయాలు ఖర్చుపెడుతున్నారు.
ఒక్క హైదరాబాద్ లోనే రూ. 70 కోట్ల నుంచి 100 కోట్లు అమ్మకాలు జరిగినట్లు వ్యాపార వర్గాలు చెబుతున్నాయి. ఇక రవాణ చార్జీలు కలపకుండానే ఇన్ని కోట్లు రూపాయలు ఖర్చు పెట్టినట్లు తెలుస్తోంది. అయితే మొత్తం మీద ఒక్కొక్క పెళ్లి ఖర్చు 25 లక్షల నుండి 30 లక్షలు ఉంటుందని సర్వే నిపుణులు చెబుతున్నారు. దీనిని బట్టి ఒక్కటి బాగా అర్థం అవుతుంది. భారత దేశం పేద దేశం కాదని ప్రపంచ దేశాలు చెబుతున్నాయి. గతంలో భారత పేద దేశం అని చెప్పిన దేశాలు ఇప్పుడు ఈలక్షాలాది పెళ్లిళ్లు ఖర్చు చూసి ముక్కున వేలేసుకుంటున్నాయి. భారత దేశంలో కావాల్సినంత డబ్బు దాగి ఉందని ఈ పెళ్లిళ్లి సందడి ద్వారా తెలిసిపోయింది. లక్షాధికారి కోట్లు సంపాదిస్తున్నాడు. సామాన్యుడు మాత్రం అక్కడే ఉన్నాడు. సంపాదన కోసం సామాన్యుడు కష్టపడుతుంటే. సంపాదనపరుడు .. సంపదను ఎలా కరిగించుకోవాలో తెలియాక ఇలాంటి శుభకార్యలకు అంతులేకుండా ఖర్చుపెడుతున్నాడు. ఇన్ని కోట్లు ఖర్చు పెట్టిన .. ఇంక తెలియాని సంపద దాగి ఉన్నట్లు సర్వేలు చెబుతున్నాయి.
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more