కరీంనగర్ జిల్లా గులాబీ మయమైంది. రెండురోజుల పాటు జరగబోయే సమావేశాల్లో ఉద్యమ పంథా చాటేందుకు సర్వం సిద్ధమైంది. మేథో మదనానికి కేసిఆర్ సహా ముఖ్యనేతలు హాజరుకానున్నారు. భవిష్యత్ ఉద్యమ కార్యాచరణపై ఈ సమావేశాల్లో ప్రధానంగా చర్చ జరగనుంది.కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ప్రతిమ మల్టీప్లెక్స్ లో జరగనున్న టిఆర్ఎస్ కార్యవర్గ సమావేశాలకు సర్వం సిద్ధమైంది. తొలిసారిగా హైదరాబాదేతర ప్రాంతంలో జరిగే ఈ సమావేశాలను సవాలుగా తీసుకున్న జిల్లా పార్టీ ఈ మేరకు అన్ని ఏర్పాట్లూ పూర్తి చేసింది. రోడ్లన్నీ బ్యానర్లు, కటవుట్లు, లే అవుట్లతో ఎటుచూసిన నగరం గులాబీమయమైంది. ఈ సమావేశంలో ప్రత్యేక తెలంగాణ సాధనకోసం కేంద్రంపై ఒత్తిడి తేవడానికి అనుసరించాల్సిన వ్యూహాలు, ఉద్యమాన్ని ఉదృతం చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలను ప్రధానంగా చర్చించనున్నట్లు నేతలు చెబుతున్నారు. ప్రత్యేక రాష్ట్రం సాధించుకోవాలంటే మరింత దూకుడుగా ఉద్యమించాల్సిన అవసరం ఉందని నాయకత్వం భావిస్తోంది. ఈ సమావేశాలకు పార్టీ ఎమ్మెల్యేలు, పొలిట్ బ్యూరో సభ్యులు, ఇతర ముఖ్యనేతలు, మేధావులు పాల్గొననున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more