త్వరలో రాష్ట్రంలో క్యాష్ పార్టీ రాబోతుంది. పేదవారికి డైరెక్టర్ గా క్యాష్ ఇవ్వటానికి పార్టీ కొత్త పథకం ప్రవేశ పెడుతుంది. ఆ పథకం పేరు నగదు బదిలీ పథకాన్ని ప్రవేశపెట్టేందుకు కేంద్రం సిద్దమవుతోంది. దీనికి సంబంధించిన విధి విధానాలు రూపొందించే ప్రక్రియను ప్రధాని కార్యాలయం వేగవంతం చేసింది. ఇంతకీ నగదు బదిలీ పథకం అసలు లక్ష్యం ఏమిటి..? దీనిని ఎలా అమలు చేస్తారు..? ఇలాంటి అంశాలపై ఓ స్పెషల్ రిపోర్ట్ ఇప్పుడు.క్యాష్ ట్రాన్స్ ఫర్ స్కీమ్.. నగదు బదిలీ పధకం.. గత 2009 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ.. ఈ పథకం గురించి విస్రుత్తంగా ప్రచారం చేసింది. పేదవాడి బ్యాంక్ ఖాతాకు నేరుగా నెలకు రెండు వేల రూపాయలు ఇస్తామని ఆనాడు తన ఎన్నికల మేనిఫోస్టోలో ప్రకటించింది.ఇప్పుడు అదే పథకాన్ని కేంద్రం అమలు చేయబోతుంది. సంస్కరణలంటేనే దూకుడుగా వెళ్లే మన్మోహన్... నగదు బదిలీ పథకాన్ని అమలు చేసేందుకు నడుంబిగించారు..కేంద్ర ప్రభుత్వ పథకాలకు ఇచ్చే సబ్సీడీలను ఇక నగదు రూపంలో నేరుగా లబ్ధిదారుడికే ఇచ్చేందుకు మన్మోహన్ సర్కారు కసరత్తు చేస్తోంది.. అయితే ఒకప్పుడు ఏ కాంగ్రెస్ పార్టీ అయితే తాము ప్రతిపాదించిన నగదు బదిలీ పథకాన్ని విమర్శించిందో.. అదే కాంగ్రెస్ పార్టీ.. ఇప్పుడు ఆ పథకాన్ని ప్రవేశపెట్టేందుకు తహాతహాలాడుతోందని తెలుగుదేశం అంటోంది.
కేంద్ర ప్రభుత్వం ప్రతియేటా సబ్సీడీల కింద 3,25,000 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తోంది. అయితే ఇది ఎంతవరకు సద్వినియోగమవుతోంది..? ఎంతవరకు అర్హులైన లబ్ధిదారులకు చేరుతుందనేది ప్రశ్నార్థకంగా మారింది. గ్యాస్, రేషన్ సరుకులు, ఎరువులు ఇలాంటి ఎన్నో వస్తువులను కేంద్రం సబ్సీడి ధరలకు అందిస్తోంది.. అంటే అసలు ధర కంటే తక్కువకు అందించి.. తాను ఆ భారాన్ని మోస్తుంది. అయితే ఇందులో చాలా వరకు ప్రజాధనం వ్రుధ్దా అవుతోందని సర్కారు గ్రహించింది. దీనిని ఆరికట్టేందుకు సర్కారు ఇప్పుడు నగదు బదిలి పథకానికి శ్రీకారం చుడుతోంది.దీని ద్వారా.. అర్హులైన లబ్ధిదారులకు ఇక సబ్సీడీ వస్తువుల కంటే.. ఆ వస్తువులపై సర్కారు భరించే మొత్తాన్ని.. లబ్ధిదారుడి ఖాతాకు నేరుగా బదిలీ చేయనుంది.. ఆధార్ కార్డు ద్వారా అసలైన లబ్ధిదారులను గుర్తించి.. వారికే ఈ నగదు బదిలీ పథకాన్ని వర్తింప చేయనుంది. లబ్ధిదారులకు బ్యాంక్ ఖాతాలు కూడా తెరిచే ఏర్పాట్లు చేసేందుకు కేంద్రం కసరత్తు చేస్తోంది. ఇప్పటికే ఈ పథకం పైలట్ ప్రాజెక్టుగా ఛత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్, కర్నాటక, పశ్చిమ బెంగాల్, పంజాబ్, తమిళనాడు, రాజస్థాన్, సిక్కిం రాష్ట్రాల్లో అమలు చేస్తున్నట్టు ప్రధాని కార్యలయం తెలిపింది. వీలైనంత త్వరలో ఈ పథకాన్ని దేశ వ్యాప్తంగా అమలు చేస్తామని అధికారిక ప్రకటన కూడా చేసింది..అయితే సబ్సీడీల్లో.. వృద్ధాను ఆరికట్టేందుకు ఈ పథకమని సర్కారు అంటుంటే.. సబ్సీడీల కోతకే క్యాష్ ట్రాన్స్ ఫర్ స్కీం అని వామపక్షాలు ఆరోపిస్తున్నాయి.. ఏదీ ఏమైనా మరి కొద్ది రోజుల్లో నగదు బదిలీ పథకం కచ్చితంగా రాబోతోంది.
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more