తృణమూల్ చీఫ్ మమతా బెనర్జీ యూపీఏపై యుద్ధం ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక నిర్ణయాలకు నిరసనగా ఇవాళ ఢిల్లీలో దీక్షకు దిగుతున్నారు. జంతర్ మంతర్ వేదికగా పార్టీ నేతలతో కలిసి దీదీ ఆందోళన చేపట్టనున్నారు. ఇది ఆరంభం మాత్రమేనని, భవిష్యత్లో పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని పార్టీ నేతలు చెబుతున్నారు.రిటైల్ వ్యాపారంలోకి FDIలను అనుమతిస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయంపై తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. FDIల అనుమతి, డీజిల్ ధరల పెంపు, గ్యాస్ సిలిండర్లలో కోత వంటి నిర్ణయాలకు వ్యతిరేకంగా దీదీ ఇవాళ ఢిల్లీలో ధర్నా చేపట్టారు . జంతర్ మంతర్ వేదికగా జరగనున్న నిరసన దీక్షకు పార్టీ నేతలు భారీగా తరలివస్తున్నారు.
పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు ఇప్పటికే హస్తిన చేరుకున్నారు. 5 వేల మందితో నిరసన చేసుకునేందుకు పోలీసులు అనుమతించడంతో, ఆ మేరకు ఏర్పాట్లు చేస్తున్నారు తృణమూల్ నేతలు.అటు హర్యానా, యూపీ, అరుణాచల్ప్రదేశ్, మణిపూర్ తదితర రాష్ట్రాల నుంచి కూడా తృణమూల్ నేతలు ఢిల్లీకి వస్తున్నారు. పార్టీ అధినేత్రి పిలుపు మేరకు దేశ రాజధానికి చేరుకుంటున్నారు. ఇవాళ జరిగే ధర్నా ఆరంభం మాత్రమేనని, భవిష్యత్లో పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని తృణమూల్ నేతలు చెబుతున్నారు. తమతో ఏ పార్టీ కలిసొచ్చినా, రాకున్నా... యూపీఏపై సమరం ఆగదని ప్రకటించారు.కొద్ది రోజుల కిందటే యూపీఏతో తెగదెంపులు చేసుకున్న మమత, కేంద్రంపై పోరాటాన్ని మరింత ఉధృతం చేయాలని భావిస్తున్నారు. బెంగాల్ సీఎంగా బిజీగా ఉన్నప్పటికీ, సమయం చిక్కినప్పుడల్లా... ధర్నాలు, నిరసనలతో హోరెత్తించాలని ఆమె నిర్ణయించారు. మరోవైపు మమత చేపడుతున్న ధర్నాపై కాంగ్రెస్ మండిపడుతోంది. ముందు మమత బెంగాల్లో పాలనను గాడిలో పెట్టాలని సూచిస్తున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more