ఆ పార్టీ పేరు చెప్పేందుకు తనకే నోరు తిరగడం లేదని, ఇక వారేమి చెప్పగలరని ఆయన నవ్వుతూ అన్నారు. ‘ఛ..అధికారం కోసం ఇటువంటి రాజకీయాలు చేస్తారని, ఇంత దిగజారుతారని అనుకోలేదు’ అని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మపై మండిపడ్డారు. రైతుల కోసం ఎమ్మెల్యేలు రాజీనామా చేశారని ఇంతకాలం చెప్పారనీ, ఇప్పుడేమో జగన్ కోసం రాజీనామా చేశారని విజయమ్మ ఎన్నికల ప్రచారంలో పేర్కొనడం ఆశ్చర్యం కలిగించిందని బొత్స గాంధీభవన్లో విలేఖరుల సమావేశంలో అన్నారు. తాము మీ హృదయాన్ని, అనురాగాన్ని చూశామని, ఇప్పుడు పుత్రవాత్సల్యం కోసం ఇలా మారుతారని అనుకోలేదని ఆయన విజయమ్మనుద్దేశించి అన్నారు. హెలికాప్టర్ ప్రమాదంలో వైఎస్ రాజశేఖరరెడ్డి మరణిస్తే దానినీ రాజకీయం చేస్తున్నారని ఆయన విమర్శించారు. అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి, లోక్సభ మాజీ స్పీకర్ బాలయోగి, కేంద్ర మంత్రి మాధవరావు సింధియా హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారన్న విషయాన్ని మరిచిపోరాదని ఆయన సూచించారు. అధికారం కోసం ఇటువంటి ఆరోపణలు చేస్తారని అనుకోలేదని ఆయన అన్నారు. ఇలా మాట్లాడితే సానుభూతి రాదని, ప్రజలకు ఏహ్య భావం కలుగుతుందని ఆయన తెలిపారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆ పార్టీ పేరును ‘యువజన, శ్రామిక, రైతు’గా కూడా చెప్పుకోలేరని ఆయన విమర్శించారు.
(And get your daily news straight to your inbox)
Sep 20 | రాష్ట్రీయ జనతా దళ్ లాలు ప్రసాద్ పాట్నాలో గురువారం మీడియాతో మాట్లాడుతూ... భారత దేశానికి ప్రధానమంత్రి కావాలని తనకు కూడా ఉందని అన్నారు. దేశంలో ప్రధానమంత్రి రేసులో ఉన్న పద్నాలుగు, పదిహేను మందిలో తాను... Read more
Sep 20 | అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా వైట్ హౌజ్ లో గురువారం మియన్మార్ ప్రతిపక్షనేత ఆంగ్ సాన్ సూకీని కలుసుకున్నారు. ఎన్నో ఏళ్లుగా మానవ హక్కుల పరిరక్షణకు, ప్రజాస్వామ్య పరిరక్షణ కొరకు పోరాటం చేస్తున్న సూకీ... Read more
Sep 17 | తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు కుటుంబ సభ్యులకు ఆయన వియ్యంకుడు, సినీ నటుడు నందమూరి బాలకృష్ణ ఆదివారం విందు ఇచ్చారు. అమెరికాలో విద్యనభ్యసిస్తున్న నారా బ్రహ్మణి ఈ నెల తొమ్మిదిన నగరానికి వచ్చారు.... Read more
Sep 17 | తిరుపతి శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయంలో ఆదివారం సమైక్యాంధ్ర విద్యార్థి జేఏసీ ప్రతినిధుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా విద్యార్థి జేఏసీ నేత పి.హరికృష్ణయాదవ్, గౌరవాధ్యక్షుడు ప్రొఫెసర్ కృష్ణమోహన్రెడ్డి, కన్వీనర్ కృష్ణయాదవ్ మాట్లాడుతూ.. వేర్పాటువాదులు, కేంద్ర,... Read more
Sep 17 | మూడు నెలల్లో తెలంగాణ తెస్తానని మోసపూరిత మాటలు చెప్పిన టీఆర్ఎస్ అధినేత కె.చంద్రశేఖర్రావు ముక్కు నేలకు రాసి తెలంగాణ ప్రజలకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత కొండా సురేఖ, మాజీ... Read more