జమ్ముకశ్మీర్లో జంట బాంబు పేలుళ్లు కలకలం రేపుతున్నాయి. గత కొన్నేళ్లుగా ప్రశాంతంగా ఉన్న రాష్ట్రంలో మళ్లీ ఉగ్రమూకలు బాంబుదాడులకు తెగబడ్డాయి. ఉధంపూర్లో అనుమానాస్పద పేలుళ్లు సంభవించాయి. ఇది ఉగ్రవాదుల పనేనని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బుధవారం రాత్రి తొలి బాంబు పేలుడు జరిగిన తరువాత ఎనమిది గంటల వ్యవధిలో రెండో బాంబు పేలుడు జరగడం పెను కలకలం రేపుతోంది. ఇవాళ ఉదయం ఉధంపూర్లోని పాతబస్టాండ్లో నిలిపిఉన్న బస్సులో ఒక్కసారిగా పేలుడు సంభవించింది. అయితే ఈ ఘటనలో ఎవ్వరికీ ప్రమాదం జరుగలేదని అధికారులు వెల్లడించారు.
కాగా ఘటన పూర్వాపరాల్లోకి వెళ్తే.. బుధవారం రాత్రి 10.45 గంటల సమయంలో ఉధంపూర్కు నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఓ పెట్రోల్ బకు సమీపంలో దొమాలి చౌక్ వద్ద నిలిపి ఉన్న ఖాళీ బస్సులో భారీ విస్పోటనంతో తొలి పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. బస్సులోని డ్రైవర్ క్యాబిన్లో కూర్చున్న కండక్టర్ సునీల్ సింగ్(27), అతని స్నేహితుడు విజయ్ కుమార్(40)కు గాయాలయ్యాయి. వీరిని ఉధంపూర్ జిల్లా ఆసుపత్రికి తరలించారు. వారికి అత్యవసర చికిత్సను వైద్యులు అందిస్తున్నారు.
కాగా, ఇవాళ ఉదయం ఐదు గంటల సమయంలో ఉధంపూర్ లోని పాత బస్టాండ్ వద్ద నిలిపి వున్న మరో బస్సులోనూ భారీ విస్పోటనంతో రెండో పేలుడు సంభవించింది. దీంతో అప్పటివరకు చిన్న చిన్న ఘటనలు సాధారణమే అనుకున్న ప్రజలు ఒక్కసారిగా రెండో పెలుడుతో అందోళనకు గురయ్యారు. ఈ రెండు పేలుడు తొలి పేలుడు ఘటన సంభవించిన ప్రాంతానికి నాలుగు కిలోమీటర్ల దూరంలోనే ఉండటం గమనార్హం. అయితే ఈ రెండు పేలుడు ఘటనలపై పోలీసులు, భద్రతా బలగాలు దృష్టిసారించాయి. గంటల వ్యవధిలోనే ఇవి చోటుచేసుకోవడంతో ఏమైనా ఉగ్రవాద కారణాలున్నాయా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.
కాగా అక్టోబర్ మొదటి వారంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా మూడు రోజుల పర్యటన నిమిత్తం జమ్మూకశ్మీర్కు వెళ్లనున్నారు. కత్రా పట్టణానికి సమీపంలో ఉన్న త్రికుటా హిల్స్లోని మాతా వైష్ణోదేవి పుణ్యక్షేత్రాన్ని సందర్శించి, పూజలు చేయనున్నారు. అనంతరం సరిహద్దు జిల్లా రాజౌరి, బరాముల్లాలో బహిరంగ ర్యాలీలో ప్రసంగించడంతో పాటు, అక్కడే బస చేయనున్నారు. అయితే కేంద్రమంత్రి పర్యటన ముందు ఉధంపూర్ పట్టణంలో రెండు శక్తివంతమైన పేలుళ్లు సంభవించడం కలకలం రేపుతోంది. హోంమంత్రి సందర్శనను దృష్టిలో ఉంచుకుని పోలీసులు, భద్రతా దళాలు అప్రమత్తమయ్యాయి.
#WATCH | J&K: A blast occurred in an empty passenger bus parked near a petrol pump at Domail Chowk in Udhampur at around 10:30 pm. Two persons were injured and have been shifted to the District hospital. Police & other agencies reached the spot.
— ANI (@ANI) September 28, 2022
(CCTV Visuals verified by Police) pic.twitter.com/3ESVXPdufP
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more