హైదరాబాద్లోని ప్రముఖ చెయిన్ ఎలక్ట్రానిక్ సంస్థకు చెందిన షోరూంకి కన్నమేసిన దొంగలు ఏకంగా కోటి రూపాయల మేర విలువైన వందలాది స్మార్టు ఫోన్లను ఎత్తుకెళ్లారు. అయితే ఇది పూర్తిగా తెలిసినవారి పనేనని అనుమానాలు రేకెత్తుతున్నాయి. కుషాయిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఈసీఐఎల్ చౌరస్తాలో ఉన్న బజాజ్ ఎలక్ట్రానిక్స్ షోరూంలో బుధవారం తెల్లవారుజామున 2.30 గంటల ప్రాంతంలో దొంగలు ఈ షోరూమ్ లోకి చోరబడ్డారు. ఈ ఎలక్ట్రానిక్స్ షోరూమ్ కు ఓ మూలన ఉన్న వెంటిలేటర్ ఇనుప చువ్వలు, ఫాల్స్ సీలింగ్ తొలగించి దొంగ లోపలికి చొరబడ్డాడు.
ఇక షోరూమ్ లోకి చొరబడిన దొంగ లోపలికి ప్రవేశించిన తర్వాత ముంగుజాగ్రత్త చర్యగా దుకాణంలోని సీసీ కెమెరాలను టార్గెట్ చేశాడు. సీసీ కెమెరాలు పనిచేయకుండా వాటి వైర్లను కట్ చేశాడు. అనంతరం షాపులోని కేవలం స్మార్ట్ ఫోన్లను విక్రయించే చోటుకు చేరుకున్నాడు. అందులో అత్యంత ఖరీదైన ఐఫోన్, వివో, ఒప్పో, వన్ప్లస్ ఫోన్లను విక్రయించే కౌంటర్ వద్దకు చేరుకున్నాడు. అక్కడి నుంచి తాను ఎంచుకున్న300లకు పైగా ఖరీదైన ఐఫోన్, వివో, ఒప్పో, వన్ప్లస్ ఫోన్లను తీసుకుని పరారయ్యాడు. కాగా, దుకాణంలోకి చొరబడిన దొంగ ఇతర కౌంటర్ల వద్దకు వెళ్లకపోవడం.. ల్యాప్టాప్లు, టీవీలు, ఎలక్ట్రానిక్స్ వస్తువులను ముట్టుకోకుండా వెళ్లకపోవడం గమనార్హం.
ఉదయం షోరూం తెరిచిన సిబ్బంది చోరీ విషయాన్ని గుర్తించారు. సంస్థ జనరల్ మేనేజర్ మహ్మద్ హబీబ్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్ బృందాలు షోరూంకు చేరుకుని ఆధారాలు సేకరించాయి. ఓ సీసీటీవీలో రికార్డయిన దృశ్యాలను బట్టి చోరీకి పాల్పడింది ఒక్కడేనని పోలీసులు నిర్ధారించారు. అతడికి ఇంకెవరైనా సహకరించి ఉంటారా? అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు, ఇది తెలిసినవారి పనేనన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. నేరుగా సెల్ఫోన్లు ఉండే చోటు వద్దకు వెళ్లడం ఇందుకు ఊతమిస్తోంది. సెల్ఫోన్లు కొనేందుకు వచ్చి రెక్కీ నిర్వహించి పథకం ప్రకారమే చోరీ చేసినట్టు అనుమానిస్తున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more