జార్ఖండ్లో జాతీయ రహదారి దుస్థితిపై మహిళా ఎమ్మెల్యే వినూత్నంగా నిరసన తెలిపారు. మహాగమకు చెందిన శాసనసభ్యురాలు తన నియోజకవర్గంలోని జాతీయ రహదారిపై నెలకొన్న పెద్ద పెద్ద గుంతలతో వాహనదారులు, పాదచారులు అనేక అవస్థలు పడుతున్నారని అరోపిస్తూ అమె ఏకంగా జలదీక్ష పేరుతో నడిరోడ్డుపై నిరసనకు దిగారు. జాతీయ రహదారిపై ఏర్పడిన గుంతలో నిలిచిన బురద నీటితో స్నానం చేశారు. జార్ఖండ్ ప్రభుత్వంలో భాగమైన కాంగ్రెస్ ఎమ్మెల్యే దీపికా పాండే సింగ్ బుధవారం గొడ్డా జిల్లాలో గుంతల మయంగా ఉన్న జాతీయ రహదారిపై ఉన్న బురద నీటితో స్నానం చేశారు.
ఆ రోడ్డు దుస్థితిపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఆమె వెంటనే బాగు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అప్పటివరకు తన దీక్షను ఆపబోనని తేల్చిచెప్పారు. ఈ సందర్భంగా తాను రాష్ట్ర ప్రభుత్వం, కేంద్రం మధ్య జరిగే పోరులో జోక్యం చేసుకోదలచుకోనని అన్నారు. ఇది NH-133. 2022 మేలో ఈ రహదారిని విస్తరించే బాధ్యతను చేపట్టిన అధికారులు.. పనులు చేపట్టలేదని అన్నారు. అయితే మరమ్మతులకు కేంద్రం నిధులు ఇవ్వలేదని కారణం తెలిసిందన్నారు. ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నందున దీనిని పూర్తి చేయాలని ముఖ్యమంత్రిని అభ్యర్థిస్తున్నాను’ అని ఆమె అన్నారు.
బీజేపీ గొడ్డా ఎంపీ నిషికాంత్ దూబేను కూడా ఆమె విమర్శించారు. ఇక్కడకు వచ్చి కూర్చొంటే ప్రజల బాధలు అర్థమవుతాయన్నారు. కాగా, సీఎం సోరెన్కు వ్యతిరేకంగా కాంగ్రెస్ ఎమ్మెల్యే దీపికా పాండే సింగ్ నిరసన తెలిపారని బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే ట్వీట్ చేశారు. ఈ రోడ్డు కోసం కేంద్రం ఆరు నెలల కిందట రూ.75 కోట్లు కేటాయించిందని తెలిపారు. అయితే కేంద్ర ప్రభుత్వం ఎలాంటి నిధులు ఇవ్వలేదని ఎమ్మెల్యే దీపికా పాండే ఆరోపించారు. బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే అబాద్ధాలు చెబుతున్నారని మండిపడ్డారు. మరోవైపు ఆ ఎమ్మెల్యే బురద నీటితో స్నానం చేసి నిరసన తెలిపిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
#Protest for Good #Roads.
— Deepak Mahato (@deepakmahato) September 21, 2022
Mahagama #Congress MLA Deepika Pandey Singh takes bath in a pothole filled with rain water at #Jharkhand's #Godda district to mark her protest.@INCIndia @nsui pic.twitter.com/F6SDNdD0XC
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more