చైనాలో పురుడుపోసుకుని ప్రపంచవ్యాప్త మానవాళికి సవాల్ విసిరి.. లక్షలాధి మందిని పొట్టనపెట్టుకున్న కరోనా మహమ్మారి తన ప్రభావాన్ని తగ్గించుకున్నా.. ఇప్పటికీ దాని తీవ్రతపై అధ్యయనాలు జరుగుతూనే ఉన్నాయి. ప్రపంచ దేశాలపై పెను ప్రభావం చూపి ప్రజల ప్రాణాలతో పాటు దేశ అర్థిక వ్యవస్థలను కూడా కుదేలయ్యేలా చేసిన ఈ మహమ్మారి.. దేశంలోనూ మారణహోమం సృష్టించిన విషయం తెలిసిందే. అయితే రెండో దశలో దేశంలో తీవ్ర ప్రభావాన్ని చూసింది. దీంతో ఈ దశలో వచ్చిన డెల్టా వేరియంట్కు సంబంధించి హైదరాబాద్లోని సెంటర్ ఫర్ సెల్యూలార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ (సీసీఎంబీ) అధ్యయనాలు చేస్తూనే ఉంది.
సిసిఎంబి-సీఐఎస్ఆర్ సంయుక్తంగా నిర్వహించిన అధ్యయనంలో తాజగా మరో ఆందోళనకర అంశం వెలుగులోకి వచ్చింది. కరోనా వైరస్లోని అన్ని వేరియంట్ల కంటే డెల్టా అత్యంత ప్రమాదకరమైనదని ఈ అధ్యయనంలో గుర్తించారు. సార్క్- కోవ్- 2 వైరస్ సోకిన వ్యక్తులు ఒక్కో వేరియంట్కు ఒక్కోలా స్పందిస్తారా? లేదా? అన్న విషయాన్ని తెలుసుకునేందుకు సీసీఎంబీ ఈ అధ్యయనం చేసింది. ఇందులో భాగంగా కరోనా రకాలైన ఆల్ఫా, డెల్టాతోపాటు అంతకుముందు వెలుగుచూసిన మూడు వేరియంట్లపై పరిశోధన నిర్వహించారు. అయితే, ఇతర వేరియంట్లతో పోలిస్తే డెల్టా వేరియంట్ సోకినప్పుడు రోగ నిరోధక వ్యవస్థ సమర్థమైన యాంటీబాడీలను ఉత్పత్తి చేయని విషయాన్ని శాస్త్రవేత్తలు గుర్తించారు.
మిగతా నాలుగు వేరియంట్ల విషయంలో రోగ నిరోధక వ్యవస్థకు హెచ్చరికలు అందినప్పటికీ డెల్టా విషయంలో అలా జరగలేదని గుర్తించారు. డెల్టా విషయంలో యాంటీబాడీలు శక్తిమంతం కావని తెలుసుకున్నారు. దీంతో శాస్త్రవేత్తలు ఈ వేరియంట్ విషయంలో ఓ నిర్ధారణకు వచ్చారు. ఈ సందర్భంగా అధ్యయనకారులు మాట్లాడుతూ.. ప్రపంచవ్యాప్తంగా ఎన్నో వేరియంట్లు వ్యాపిస్తున్నాయని, కానీ వాటి ప్రభావంలో చాలా తేడాలు ఉన్నట్టు గుర్తించామన్నారు. అన్నింటికంటే కూడా డెల్టా వేరియంట్ అత్యంత ప్రమాదకారన్న విషయాన్ని గుర్తించినట్టు వారు వివరించారు.
(And get your daily news straight to your inbox)
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more
Oct 07 | గుజరాత్ పోలీసులు స్థానిక యువతపై కాకీ కాఠిన్యాన్ని ప్రదర్శించారు. ఓ వర్గానికి చెందిన యువతపై ఇలా విరుచుకుపడటం ఇప్పుడు రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది. సబ్ కా సాత్, సబ్ కా వికాస్ అంటూ కేంద్ర,... Read more