Patriotism through an artist’s eye కంటిలో త్రివర్ణ పతాక.. దేశ‌భ‌క్తి చాటుకున్న సామాజిక కార్య‌క‌ర్త‌

Tamil nadu activist paints tricolour in his eye to mark independence day 2022

tricolour in eye, national flag in eye, Tamil miniature artist, miniature artist places national flag in eye, Tamil Nadu, Tricolour, Eye, Freedom, Awareness, Patriotism, PM, Narendra Modi, Independence, August, Har Ghar Tiranga, Independence Day 2022, 75 Years of Independence, Tricolour in Eye, social activist, Kuniyamuthur, Coimbatore, Tamil Nadu

Ahead of 75th Independence Day celebration, a Coimbatore-based miniature artist sketched the national flag at the sclera of his eye to raise awareness about the freedom movement. UMT Raja used a mixture of wax and egg white and paint Tricolour in the eye. Raja said he did the painting by himself by looking at a mirror. It took hours of concentration for the 52-year-old artist in Kuniyamuthur to complete the design.

కంటిలో త్రివర్ణ పతాక.. దేశ‌భ‌క్తి చాటుకున్న సామాజిక కార్య‌క‌ర్త‌

Posted: 08/13/2022 03:59 PM IST
Tamil nadu activist paints tricolour in his eye to mark independence day 2022

దేశ స్వతంత్ర వజ్రోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. స్వాతంత్య్రం సిద్ధించి 75 ఏండ్లు గడుస్తున్న సందర్భంగా.. దేశప్రజలందరూ తమ ఇళ్లపై జెండాలను అవిష్కరించాలని ఇప్పటికే జెండాలను కూడా పంచిన క్రమంలో.. వాటితో తమ తమ శైలిలో ప్రముఖుల నుంచి సామాన్యుల వరకు తమ శుభాకాంక్షలను తెలుపుతున్నారు. భారత మూలాలున్న ఇటాలియన్‌ ఆస్ట్రోనాట్‌ సమంత క్రిస్టోఫొరెట్టి ఈ సందర్భాన్ని పురస్కరించుకుని భారత అంతరిక్ష పరిశోధనా కేంద్రానికి (ఇస్రో) ఇంటర్నేషనల్‌ స్పేస్‌ ఏజెన్సీ నుంచి శుభాభినందనలు తెలిపారు. ఇలా ఒక్కోక్కరు తమ దేశభక్తిని వ్యక్తం చేస్తున్నారు.

ఈ తరుణంలో త‌మిళ‌నాడులోని కోయంబ‌త్తూర్‌కు చెందిన ఓ సామాజిక కార్య‌క‌ర్త త‌న‌కున్న దేశ‌భ‌క్తిని వినూత్నంగా చాటుకున్నారు. సర్వేంద్రియానాం నయనం ప్రథానం అన్న నానుడిని ఆధారంగా చేసుకున్న ఆయన తన దేశభక్తిని కూడా అదే కన్నులతో చాటాలని పూనుకున్నాడు. తన చూపుతో ముడిపడిన అంశమని తెలిసినా.. తన దేశభక్తి ముందు నయనం చిన్నదనే భావించాడు. అంతే త‌న కుడి క‌న్నులో జాతీయ జెండాను చిత్రీక‌రించి స్వ‌తంత్ర భార‌త వ‌జ్రోత్స‌వ వేడుక‌ల్లో భాగ‌స్వామి అయ్యారు. కోయంబ‌త్తూరులోని కునియంతూర్‌కు చెందిన యూఎంటీ రాజా సామాజిక కార్య‌క‌ర్త‌గా కొన‌సాగుతున్నాడు.

మినీయేచ‌ర్ ఆర్టిస్ట్ కూడా. అయితే స్వ‌తంత్ర వ‌జ్రోత్స‌వ వేడుక‌ల్లో భాగంగా త‌న కనుగుడ్డుపైనే జాతీయ జెండాను చిత్రీక‌రించాడు. ఈ జెండాను చిత్రీక‌రించేందుకు కొన్ని గంట‌ల స‌మ‌యం ప‌ట్టింది. 16వ ప్ర‌య‌త్నంలో స‌ఫ‌లీకృతుడ‌య్యాడు. మొద‌ట క‌నుగుడ్డులోని తెల్ల‌సొన ప‌లుచ‌ని పొర‌కు మైనంతో త్రివ‌ర్ణ ప‌తాకం రంగుల‌ను పూశాడు. ఆ త‌ర్వాత దాదాపు 20 నిమిషాల పాటు కంటిలో ఆ పెయింట్‌ను ఉంచాడు. ఆ పెయింట్ క‌నుగుడ్డుపై ప్రింట్ అయిన త‌ర్వాత తొల‌గించాడు. ఈ ఫీట్ కోసం రాజా కంటి డాక్ట‌ర్ స‌ల‌హా తీసుకున్నాడు. అయితే ఇలాంటి ప్ర‌యోగం ఎవ‌రూ చేయొద్ద‌ని రాజా విజ్ఞ‌ప్తి చేశాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles