బీహార్ లోనూ తమ ప్రభుత్వమే ఉందని ఇన్నాళ్లు చెప్పుకున్న బీజేపి.. ఇక తాజాగా తమ మైత్రి ప్రభుత్వంతో ఒక పొసగడం ఇష్టం లేక.. జేడీయు పార్టీలోనూ చక్రం తిప్పాలని భావించింది. అందుకు గాను జేడీయూ నుంచి బయటకు వచ్చిన నేత ఆర్సీపీ సింగ్ను అడ్డుపెట్టుకొని జేడీయూలో సంక్షోభం సృష్టించాలనుకొన్న బీజేపీ ఆశలు గల్లంతయ్యాయి. నితీశ్ వేగంగా మేలుకొని వ్యూహాత్మకంగా కదిలి తన ప్రభుత్వాన్ని కాపాడుకోగలిగారు. నితీశ్ చేసిన చర్యలతో బీజేపి మైండ్ బ్లాక్ అయ్యింది. నితీశ్ అనుభవంతో పావులు కదిపి విపక్షాల ప్రశంసలను అందుకున్నారు. దేశ రాజకీయాల్లో మార్పునకు ఇది సంకేతమని కొనియాడాయి.
జేడీయుతో దశాబ్దకాలానికి పైగా కోనసాగుతున్న మైత్రిని కాదని పార్టీ నుంచి బయటకు వచ్చిన నేతతో మిత్రపక్షాన్ని కూడా వంచించి.. తాను బలపడాలని తపిస్తున్న బీజేపికి నితీశ్ కుమార్ కోలుకోలేని షాక్ ఇచ్చారు. బీజేపీతో తెగదెంపులు చేసుకుని సంకీర్ణ ప్రభుత్వాన్ని రద్దుచేసి కాషాయ పార్టీని అధికారానికి దూరం చేశారు. ఆర్జేడీ, కాంగ్రెస్, వామపక్షాలతో కలసి మరోమారు ఆయనే ముఖ్యమంత్రిగా కొనసాగనున్నారు. రాష్ట్రంలో మళ్లీ మహాఘట్ బంధన్ ప్రభుత్వం ఏర్పాటు దిశగా ఆయన చర్యలు చేపట్టారు. ప్రస్తుతం బీహార్లో ఎన్డీఏ కూటమి బలాబలాలు ఇలా ఉన్నాయి. బీజేపీ(77)-జేడీయూ(45) కూటమి పాలన బీహార్లో ముగిసిపోయింది.
బీజేపీతో తెగదెంపులు చేసుకున్నట్లు జేడీ(యు)నేత నితీశ్ తమ ఎమ్మెల్యేలకు చెప్పారు. ఇక ఇవాళ సాయంత్రం సీఎం నితీశ్ కుమార్ ఆ రాష్ట్ర గవర్నర్ను కలసి రాష్ట్రంలోని పరిస్థితులను విన్నవించనున్నారు. అయితే ఆర్జేడీ, కాంగ్రెస్తో కలిసి నితీశ్ కుమార్.. కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశాలు ఉన్నాయి. నితీశ్ కుమార్ ముఖ్యమంత్రిగానే కొనసాగనున్నారు. బుధవారం రోజున మహా ఘట్ బంధన్ ప్రభుత్వ ముఖ్యమంత్రిగా ఆయన ఎనమిదవ పర్యాయం ప్రమాణస్వీకారం చేయనున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. కొన్ని ఊహాగానాల ప్రకారం ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్కు హోంశాఖ ఇవ్వనున్నారు. నితీశ్కు ఆర్జేడీ, కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలు మద్దతు తెలిపినట్లు స్పష్టమవుతోంది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more