అజాదీకా అమృత్ మహోత్సవ్ జరుపుకుంటున్న సందర్భంగా కేంద్ర ప్రభుత్వం దేశప్రజలకు ఓ గుడ్ న్యూస్ చెప్పింది. ఇన్నాళ్లు డబ్బులు వెచ్చించి తీసుకున్న కొవిడ్ టీకా ప్రికాషన్ డోసును ఈనెల 15 నుంచి ఉచితంగా అందించనున్నట్లు కేంద్రం ప్రకటించింది. అయితే ఇది కేవలం 18-59 ఏళ్ల వయసు వారికి మాత్రమే అందిస్తున్నట్లు ప్రకటించింది 18 నుంచి 59 ఏళ్ల మధ్య వయసు వారికి.. ఉచితంగా కొవిడ్ టీకా ప్రికాషన్ డోసు ఇవ్వాలని కేంద్రం నిర్ణయించింది. ఇందుకోసం ఈనెల 15 నుంచి 75 రోజుల పాటు ప్రత్యేక డ్రైవ్ చేపట్టనుంది.
దేశానికి స్వాతంత్ర్యం లభించిన 75 వసంతాలు కావస్తున్న సందర్భంగా జరుపుకుంటున్న ఉత్సవాల నేపథ్యంలో ఈ నెల 15 నుంచి 75 రోజుల పాటు ఈ ప్రికాషనరీ డోస్ ను అందించనున్నారు. అర్హులైన దేశప్రజలందరికీ ప్రభుత్వ వ్యాక్సినేషన్ కేంద్రాలలో ఉచితంగా ప్రికాషన్ డోసు ఇవ్వనున్నట్లు కేంద్ర ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఆజాదీ కా అమృత్ మహోత్సవాల్లో భాగంగా కరోనా టీకా మూడో డోసు తీసుకోవడాన్ని ప్రోత్సహించడానికి ఈ ప్రత్యేక డ్రైవ్ చేపడుతున్నట్లు తెలిపాయి. 18 నుంచి 59 ఏళ్ల మధ్యనున్నవారిలో.. కొవిడ్ టీకా ప్రికాషన్ డోసుకు 77కోట్ల మంది అర్హులు. వీరిలో ఒక శాతం కంటే తక్కువ మంది మాత్రమే ప్రికాషన్ డోసు తీసుకున్నారు.
ఇదే సమయంలో టీకా తీసుకునేందుకు అర్హులైన 60 ఏళ్లకు పైబడిన వారు 16కోట్ల మంది ఉండగా.. వారిలో 26శాతం మంది ప్రికాషన్ డోసు తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. దేశ జనాభాలో మెజారిటీ భాగం. 9 నెలల కిందట రెండో డోసు తీసుకున్నారని వెల్లడించారు. ఆరునెలల తర్వాత యాంటీబాడీల స్థాయి తగ్గుతున్న విషయాన్ని ఐసీఎంఆర్ సహా ఇతర అంతర్జాతీయ పరిశోధనా సంస్థల అధ్యయనంలో తేలిందని వివరించారు. ఈ నేపథ్యంలో అర్హులైన వ్యక్తులు ప్రికాషన్ డోసు తీసుకోవాలని కోరుతున్నారు. కొవిడ్ టీకా రెండో డోసుకు, ప్రికాషన్ డోసుకు మధ్య గడువును కేంద్ర ఆరోగ్యశాఖ ఇటీవలే 9 నెలల నుంచి ఆరు నెలలకు తగ్గించింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more