Marredpally Inspector K Nageshwar Rao in Judicial remand మాజీ సీఐ రిమాండ్ రిపోర్టులో విస్తుగొలిపే విషయాలు

Marredpally former ci in judicial remand police disclose key points in report

city police commissioner, cv anand, k nageshwar rao, marredpally inspector, marredpally police station, rape charges against CI, arms case against CI, Hyderabad, Karkhana Inspector C Nethaji, Vanasthalipuram, Rachakonda commissionerate, Hyderabad, Telangana, Crime

City Police Commissioner CV Anand placed under suspension Marredpally Inspector K Nageshwar Rao against whom a rape and murder case was booked at Vanasthalipuram. “In view of the rape and arms act registered against the SHO Marredpally K Nageshwar Rao in Vanasthalipuram police station and the report received from CP Rachakonda, he is suspended from service pending detailed enquiry and investigation,” a statement issued by the Hyderabad City Police read.

కటకటాల వెనక్కి మాజీ సీఐ.. రిమాండ్ రిపోర్టులో విస్తుగొలిపే విషయాలు

Posted: 07/14/2022 03:48 PM IST
Marredpally former ci in judicial remand police disclose key points in report

మారేడుపల్లి సిఐ నాగేశ్వరరావుపై అత్యాచారం, అపహరణ అభియోగాల కేసులో వనస్థలిపురం పోలీసులు కీలక ఆధారాలు సేకరించారు. అత్యాచారం, దాడి, భార్యభర్తల అపహరణ విషయంలో మాజీ ఇన్​స్పెక్టర్​ నాగేశ్వరరావు రిమాండ్ రిపోర్టులో విస్తుగొలిపే అంశాలను వెల్లడించారు. దర్యాప్తులో నాగేశ్వరరావు నేరాన్ని ఒప్పుకున్నట్లు వనస్థలిపురం ఏసీపీ పేర్కొన్నారు. ఈ కేసు రిమాండ్‌ రిపోర్టులో విస్తుపోయే అంశాలను పోలీసులు వెల్లడించారు. తనపై నమోదైన అభియోగాలన్నింటినీ ఆయన అంగీకరించడంతో.. వాటికి సంబంధించిన కీలక ఆధారాలు సేకరించిన్నట్లు పోలీసులు పేర్కొన్నారు.

వివాహిత కణితపై తుపాకి గురిపెట్టి అత్యాచారానికి పాల్పడిన మాజీ ఇన్‌స్పెక్టర్‌ కె.నాగేశ్వరావుపై ఇప్పటికే వనస్థలిపురం పోలీసులు అపహరణ, హత్యాయత్నం, ఆయుధ నిరోధక చట్టం కింద కేసులు నమోదు చేశారు. బాధితురాలికి వైద్య పరీక్షలు నిర్వహించి ఆమె వాంగ్మూలం రికార్డు చేశారు. బాధితురాలిపై అత్యాచారం జరిగిన గదిలో వెంట్రుకలు, దుప్పటి, గాజులు క్లూస్‌ టీమ్‌ స్వాధీనం చేసుకుంది. నాగేశ్వరరావును బాధితురాలి భర్త కొట్టిన కర్ర, అత్యాచార సమయంలో బాధితురాలి దుస్తులు స్వాధీనం చేసుకుని వాటిని ఎఫ్ఎస్‌ఎల్‌కి పంపించినట్టు పోలీసులు తెలిపారు.

బాధితురాలు, ఆమె భర్తను కారులో తీసుకెళ్తుండగా రోడ్డు ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని కేసు దర్యాప్తు చేస్తున్న వనస్థలిపురం ఏసీపీ పురుషోత్తం రెడ్డి పరిశీలించారు. బెంగళూరు పారిపోయిన నాగేశ్వరరావు: కేసు దర్యాప్తులో భాగంగా బాధితురాలి ఇంటి వద్ద ఓ ఎలక్ట్రిక్ దుకాణం సీసీ ఫుటేజీ సేకరించామని పోలీసులు వెల్లడించారు. ఇబ్రహీంపట్నం వెళ్లే దారిలో సీసీ కెమెరాల్లో నాగేశ్వరావు కారు గుర్తించినట్లు పేర్కొన్నారు. కారు వనస్థలిపురం నుంచి ఇబ్రహీంపట్నం వైపు వెళ్తుండగా ప్రమాదం జరిగిందని తెలిపారు. ప్రమాదానికి గురైన కారును స్వాధీనం చేసుకున్నామని.. బాధితురాలి సెల్‌ఫోన్ సీజ్ చేసినట్లు వెల్లడించారు.

కారుకు ఇబ్రహీంపట్నం వద్ద ప్రమాదం జరిగిందని హోంగార్డుకు నాగేశ్వరరావు సమాచారం ఇచ్చినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. అయితే కారును ట్రోయింగ్ వాహనం ద్వారా చంపాపేట్‌కు తరలించినట్లు గుర్తించారు. హోంగార్డు ప్రవీణ్ స్టేట్‌మెంట్ కూడా రికార్డ్ చేశామని పోలీసులు వెల్లడించారు. అత్యాచారం తర్వాత మారేడ్‌పల్లి పీఎస్‌లో విధులు నిర్వహించారని.. కేసు నమోదైందని తెలిసిన తర్వాత బెంగళూరు పారిపోయినట్లు పోలీసులు తెలిపారు. అత్యాచారం ఘటన తర్వాత నాగేశ్వరరావు తన బట్టలు స్వయంగా ఉతుక్కున్నాడని, ఏమీ తెలియనట్టు మారేడ్‌పల్లి పీఎస్‌కు వెళ్లి విధులు నిర్వహించినట్ట పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది.

బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలుసుకుని మారేడ్‌పల్లి ఠాణాలోనే రివాల్వర్‌ ఉంచి బెంగళూరుకు పరారయ్యాడు. కొత్తపేటలోని గ్రీన్‌ హిల్స్‌ కాలనీలో అతని నివాసంలో సోదాలు నిర్వహించిన పోలీసులు... అత్యాచార సమయంలో వాడిన ప్యాంటు, షర్టు, లోదుస్తులు స్వాధీనం చేసుకున్నారు. ఈనెల 10న నాగేశ్వరరావును అదుపులోకి తీసుకున్న పోలీసులు అరెస్టు చేసి వనస్థలిపురం ఏరియా ఆసుపత్రిలో వైద్య పరీక్షలు, కొవిడ్‌, లైంగిక పటుత్వ పరీక్షలు నిర్వహించిన అనంతరం హయత్‌నగర్‌ కోర్టులో హాజరుపర్చారు. కోర్టు రిమాండ్‌ విధించడంతో చర్లపల్లి జైలుకు తరలించారు

ఈ నెల 6న వివాహితపై అత్యాచారం చేసి, బాధితురాలితో పాటు ఆమె భర్తను బలవంతంగా రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం పరిధిలోని ఎల్మినేడుకు కారులో తీసుకెళుతుండగా కారు ప్రమాదానికి గురైంది. కారు నడుపుతున్న నాగేశ్వరరావు భుజానికి గాయం కావడంతో బాధిత దంపతులిద్దరూ తప్పించుకొని వనస్థలిపురం పోలీసులకు ఫిర్యాదు చేయగా ఈ దురాగతం బయటపడింది. ప్రమాదంలో గాయపడిన మాజీ ఇన్​స్పెక్టర్ తొలుత అజ్ఞాతంలోకి వెళ్లి.. బాధితులతో రాజీకీ యత్నించాడు. కేసును సీరియస్‌గా తీసుకున్న పోలీసులు ఆయనను పట్టుకొనేందుకు మూడు పోలీసు బృందాలను రంగంలోకి దించారు. ఈ క్రమంలోనే ఎస్​వోటీ పోలీసులు నిందితుడ్ని అరెస్ట్​ చేసి రిమాండ్ కు తరలించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles