భిన్నత్వంలో ఏకత్వం చాటే దేశం మనది. ఎన్నో కులాలు, మరెన్నో మతాలు.. అనేక ప్రాంతాలు.. ప్రతీ కులానికో ఆచారం. ఒక్కో మతానికి ఒక్కో విధానం. ప్రాంతానికో సంప్రదాయం.. అన్నింటినీ మేళవించినదే భారతీయ సంస్కృతి. అయితే తాము భారతీయులం అన్న విషయాన్ని మర్చిపోతున్న పలువురు కేవలం రాజకీయ నాయకులు ప్రసంగాలకు, మత పెద్దల ప్రబోధాలకు ప్రభావితమై ఇన్నాళ్లు.. భాయ్ భాయ్ అంటూ కలిసిఉన్న విషయాన్ని మర్చిపోయి.. మరీ కుట్రలు, కుతంత్రాలకు తెరతీస్తున్నారు. తమ మతం గురించి మంచి చెప్పుకోవడంలో ఏ మాత్రం తప్పులేదు కానీ.. పరమతాన్ని తక్కువ చేయడం అనర్థాలకు, అపార్థాలకు దారితీస్తోంది.
ఫలితంగా నిన్నమన్నటి వరకు కలసివున్నావాళ్లనే వేరుగా చూడటం.. వారి దేవతామూర్తులు ముద్రించిన పేపర్లను కించపర్చేలా మాంసాహారాన్ని అందులో ఫ్యాక్ చేయడం లాంటి ఘటనలు నమోదవుతున్నాయి. పరమత దేవుళ్ల పట్ల ద్వేష భావం, చులకన భావం పెరిగిపోతున్న తీరు ఇటీవలి కాలంలో ఎక్కువగా వెలుగులోకి వస్తోంది. ఇందుకు సంబంధించి పలు ఘటనలు వెలుగు చూస్తున్నాయి. మహమ్మద్ ప్రవక్త గురించి బీజేపీ బహిష్కృత నేత నుపుర్ శర్మ అనుచిత వ్యాఖ్యలు చేయడం, రాజస్థాన్, మహారాష్ట్రలో హిందువుల తలలు తెగనరకడం, కాళికా మాత నోట్లో సిగరెట్ తో పోస్టర్ ను ముద్రించడం వంటి ఎన్నో ఘటనలు వెలుగు చూశాయి. ఫలితంగా దేశంలో ఇవి అశాంతిని రాజేస్తున్నాయి.
తాజాగా యూపీలోని సంభాల్ లో ఓ ముస్లిం వ్యాపారి హిందూ దేవతల చిత్రాలున్న పేపర్లలో చికెన్ ప్యాక్ చేసి విక్రయిస్తున్న తీరు వెలుగులోకి వచ్చింది. తాలీబ్ హుస్సేన్ అనే వ్యాపారి హిందూ దేవత, దేవుడి చిత్రాలున్న పేపర్లలో చికెన్ ప్యాక్ చేసి విక్రయిస్తున్నాడని, మత మనోభావాలను గాయపరుస్తున్నాడంటూ కొంత మంది ఫిర్యాదు చేసినట్టు పోలీసులు తెలిపారు. ఫిర్యాదు అందిన తర్వాత పోలీసులు తాలీబ్ హుస్సేన్ షాపులో తనిఖీకి వెళ్లగా.. కత్తితో పోలీసులపైకి అతడు దాడికి యత్నించాడు. దీంతో పోలీసులు అతడ్ని అదుపులోకి తీసుకున్నారు. రెండు మతాల మధ్య శత్రుత్వాన్ని ప్రోత్సహిస్తున్నాడంటూ సెక్షన్ 153-ఏ, సెక్షన్ 295ఏ, సెక్షన్ 307 (హత్యాయత్నం) కింద కేసు నమోదు చేశారు.
(And get your daily news straight to your inbox)
Aug 13 | తన బిడ్డ అపదలో ఉన్నాడంటే ప్రతీ తల్లి గజేంద్రమోక్ష ఘట్టంలోని శ్రీమహావిష్ణువు రూపం దాల్చి అత్యంత వేగంగా ప్రతిస్పందించి రక్షిస్తుందని అంటారు. తన బిడ్డకు ఆపద వస్తుందంటే అవసరమైతే పులితో కూడా పోట్లాడి.. తన... Read more
Aug 13 | బీజేపీ ప్రభుత్వంపై కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రియాంక ఖర్గే చేసిన తీవ్రవ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ ఉద్యోగాలు పోందాలంటే యువకులు లంచం ఇవ్వాలి.. యువతులైతే మరో రకంగా సహకరించాలంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి ప్రియాంఖ ఖార్గే... Read more
Aug 13 | దేశ స్వతంత్ర వజ్రోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. స్వాతంత్య్రం సిద్ధించి 75 ఏండ్లు గడుస్తున్న సందర్భంగా.. దేశప్రజలందరూ తమ ఇళ్లపై జెండాలను అవిష్కరించాలని ఇప్పటికే జెండాలను కూడా పంచిన క్రమంలో.. వాటితో తమ తమ... Read more
Aug 13 | కేంద్ర ప్రభుత్వంలోని వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న జూనియర్ ఇంజినీర్ (JE) పోస్టుల నియాక ప్రక్రియను స్టాఫ్ సెలెక్షన్ కమిటీ (SSC) చేపట్టింది. దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమయింది. అర్హులైనవారు వచ్చే నెల 2... Read more
Aug 13 | మరో రెండేళ్లలో దేశంలో సార్వత్రిక ఎన్నికలు రానున్నాయి. ఇప్పటి నుంచే రాజకీయ సమీకరణాలపై చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో జాతీయ మీడియా సంస్థ ఇండియా టుడే, సీ ఓటర్ సంస్థతో కలిసి చేపట్టిన జాతీయస్థాయి... Read more