అమెరికాలో మరోమారు తూటాల పేలుళ్లు సంభవించాయి. దేశభక్తిని చాటేందుకు దేశప్రజలకు ఇచ్చే సెలవు దినమైన జూలై 4న షికాగోలో ఇల్లినాయిస్ పట్టణంలో నిర్వహించిన స్వాతంత్ర్య దినోత్సవ పరేడ్పై ఓ దుండగుడు అత్యంత దారుణంగా కాల్పులతో విరుచుకుపడ్డాడు. దేశ స్వాతంత్ర్య పరేడ్ లో పాల్గోని తమలోని దేశభక్తిని చాటిన ప్రజలపై రూఫ్ టాప్ గన్ తో విఛక్షణారహితంగా జరిపిన కాల్పుల్లో ఆరుగురు ప్రాణాలు కోల్పోగా 36 మందికిపైగా గాయపడ్డారు. షికాగో శివారులోని ఇల్లినాయిస్ పట్టణంలోని హైలాండ్ పార్క్లో ఈ ఘటన చోటుచేసుకుంది.
స్వాతంత్ర్య పరేడ్లో నిమగ్నమై తమ దేశభక్తిని ప్రకటించుకుంటూ పరేడ్ నిర్వహిస్తున్న వారిపై అత్యంత శక్తిమంతమైన రైఫిల్తో దుండగుడు పైకప్పు నుంచి కాల్పులు జరిపాడు. ఈ ఘటనకు సంబంధించి ఓ అనుమానితుడ్ని అరెస్టు చేశారు. గత రాత్రి రాబర్ట్ ఇ.క్రిమో 3 అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు అతడి కారును చుట్టుముట్టి తుపాకులు ఎక్కుపెట్టడంతో.. కారు నుంచి దిగి చేతులు పైకెత్తిన నిందితుడి వీడియోను అమెరికాలోని స్థానిక మీడియా విడుదల చేసింది. నిందితుడు క్రిమోపై పలు అభియోగాలు మోపినట్టు హైలాండ్ పార్క్ పోలీసులు తెలిపారు.
ప్రశాంతంగా జరుగుతున్న పరేడ్పై ఒక్కసారిగా కాల్పులు జరగడంతో జనం భయంతో పరుగులు తీశారు. పెద్ద ఎత్తున బాణసంచా పేలుతున్నట్టు అనిపించిందని ప్రత్యక్ష సాక్షి అయిన రిటైర్డ్ వైద్యుడు రిచర్డ్ కౌఫ్మన్ తెలిపారు. దాదాపు 200 షాట్లను విన్నట్టు చెప్పారు. అయితే బాణాసంచా అని భావించానని చెప్పిన ఆయన కాల్పులు జరిగిన వెంటనే ప్రజలు భయంతో పరుగులు తీశారని.. దీంతోనే తనకు ఇవి కాల్పులని అర్థంచేసుకున్నానని పేర్కొన్నారు. ఈ ఘటనపై అధ్యక్షుడు జో బైడెన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. కాల్పుల విషయం తెలిసిన వెంటనే తాను, తన భార్య జిల్ షాకైనట్టు చెప్పారు.
(And get your daily news straight to your inbox)
Aug 13 | బీజేపీ ప్రభుత్వంపై కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రియాంక ఖర్గే చేసిన తీవ్రవ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ ఉద్యోగాలు పోందాలంటే యువకులు లంచం ఇవ్వాలి.. యువతులైతే మరో రకంగా సహకరించాలంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి ప్రియాంఖ ఖార్గే... Read more
Aug 13 | దేశ స్వతంత్ర వజ్రోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. స్వాతంత్య్రం సిద్ధించి 75 ఏండ్లు గడుస్తున్న సందర్భంగా.. దేశప్రజలందరూ తమ ఇళ్లపై జెండాలను అవిష్కరించాలని ఇప్పటికే జెండాలను కూడా పంచిన క్రమంలో.. వాటితో తమ తమ... Read more
Aug 13 | కేంద్ర ప్రభుత్వంలోని వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న జూనియర్ ఇంజినీర్ (JE) పోస్టుల నియాక ప్రక్రియను స్టాఫ్ సెలెక్షన్ కమిటీ (SSC) చేపట్టింది. దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమయింది. అర్హులైనవారు వచ్చే నెల 2... Read more
Aug 13 | మరో రెండేళ్లలో దేశంలో సార్వత్రిక ఎన్నికలు రానున్నాయి. ఇప్పటి నుంచే రాజకీయ సమీకరణాలపై చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో జాతీయ మీడియా సంస్థ ఇండియా టుడే, సీ ఓటర్ సంస్థతో కలిసి చేపట్టిన జాతీయస్థాయి... Read more
Aug 13 | తెలంగాణ కాంగ్రెస్ చండూరు సభ వేడి తగ్గడం లేదు. ఎంపీ కోమటిరెడ్డిపై అద్దంకి దయాకర్ తీవ్ర వ్యాఖ్యలు చేయటంతో మొదలైన రగడ... రోజురోజుకూ ముదురుతుంది. ఈ కామెంట్స్ పై సీరియస్ గా ఉన్న కోమటిరెడ్డి...... Read more