దేశీయ విమానయాన సంస్థ స్పైస్జెట్కు చెందిన ఓ విమానానికి తృటిలో పెను ప్రమాదం తప్పింది. అత్యంత వేగంగా స్పందించిన పైలట్లు వెనువెంటనే తీసుకున్న చర్యలతో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగకుండా ప్రయాణికులతో పాటు క్యాబిన్ క్రూ అంతా సురక్షితంగా కిందకు దిగడంతో విమానయాన అధికారులు ఊపిరిపీల్చుకున్నారు. విమానంలో ఉన్నంత సేపు ప్రాణాలు అరచేతిలో పట్టుకుని కూర్చున్న ప్రయాణికులు కూడా హమ్మాయ్య అని ఊరటపోందారు. అయితే ఈ ప్రమాదం నేలపై ఉన్నప్పుడో లేక రన్ వే పై వెళ్తున్న సమయంలోనో సంభవించింది కాదు.
గగనతలంలో ఏకంగా 5000 అడుగుల ఎత్తులో ఉండగా క్యాబిన్ నుంచి పొగలు రావడంతో అప్రమత్తమైన సిబ్బంది విమానాన్ని వెంటనే వెనక్కి మళ్లించి సురక్షితంగా ల్యాండ్ చేశారు. స్పైస్జెట్ అధికార ప్రతినిధి తెలిపిన వివరాల ప్రకారం.. ఈ ఉదయం ఢిల్లీ విమానాశ్రయం నుంచి ఓ స్పైస్జెట్ విమానం మధ్యప్రదేశ్లోని జబల్పూర్ బయల్దేరింది. అయితే టేకాఫ్ అయిన కొద్ది సేపటి తర్వాత విమానం 5వేల అడుగుల ఎత్తులో ఉండగా క్యాబిన్లో పొగలు రావడాన్ని క్రూ సిబ్బంది గుర్తించారు. దీంతో అప్రమత్తమైన పైలట్లు వెంటనే విమానాన్ని ఢిల్లీ విమానాశ్రయానికి మళ్లించారు.
విమానం సురక్షితంగా ల్యాండ్ అయ్యిందని, ప్రయాణికులను క్షేమంగా దించేసినట్లు స్పైస్ జెట్ విమానయాన సంస్థ అధికారులు తెలిపారు. క్యాబిన్లో పొగలతో ప్రయాణికులు ఇబ్బంది పడుతోన్న వీడియోలు ప్రస్తుతం సోషల్మీడియాలో వైరల్గా మారాయి. అయితే ఘటనకు గల కారణాలేంటీ? విమానంలో ఎంతమంది ఉన్నారన్నదానిపై మాత్రం స్పష్టత లేదు. గత కొన్ని రోజులుగా స్పైస్జెట్ విమానాల్లో ఇలాంటి ఘటనలు తరచూ జరుగుతుండటం గమనార్హం. గత నెల 19న దిల్లీకి బయల్దేరిన ఓ విమానం ఇంజిన్లో మంటలు రావడంతో దాన్ని అత్యవసరంగా పట్నాలో దించేశారు.
#WATCH | A SpiceJet aircraft operating from Delhi to Jabalpur returned safely to the Delhi airport today morning after the crew noticed smoke in the cabin while passing 5000ft; passengers safely disembarked: SpiceJet Spokesperson pic.twitter.com/R1LwAVO4Mk
— ANI (@ANI) July 2, 2022
(And get your daily news straight to your inbox)
Aug 13 | దేశ స్వతంత్ర వజ్రోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. స్వాతంత్య్రం సిద్ధించి 75 ఏండ్లు గడుస్తున్న సందర్భంగా.. దేశప్రజలందరూ తమ ఇళ్లపై జెండాలను అవిష్కరించాలని ఇప్పటికే జెండాలను కూడా పంచిన క్రమంలో.. వాటితో తమ తమ... Read more
Aug 13 | కేంద్ర ప్రభుత్వంలోని వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న జూనియర్ ఇంజినీర్ (JE) పోస్టుల నియాక ప్రక్రియను స్టాఫ్ సెలెక్షన్ కమిటీ (SSC) చేపట్టింది. దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమయింది. అర్హులైనవారు వచ్చే నెల 2... Read more
Aug 13 | మరో రెండేళ్లలో దేశంలో సార్వత్రిక ఎన్నికలు రానున్నాయి. ఇప్పటి నుంచే రాజకీయ సమీకరణాలపై చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో జాతీయ మీడియా సంస్థ ఇండియా టుడే, సీ ఓటర్ సంస్థతో కలిసి చేపట్టిన జాతీయస్థాయి... Read more
Aug 13 | తెలంగాణ కాంగ్రెస్ చండూరు సభ వేడి తగ్గడం లేదు. ఎంపీ కోమటిరెడ్డిపై అద్దంకి దయాకర్ తీవ్ర వ్యాఖ్యలు చేయటంతో మొదలైన రగడ... రోజురోజుకూ ముదురుతుంది. ఈ కామెంట్స్ పై సీరియస్ గా ఉన్న కోమటిరెడ్డి...... Read more
Aug 12 | ఉచిత తాయిలాలు వద్దన్న భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ ఎన్వీ రమణపై రాష్ట్రీయ లోక్దళ్ (ఆర్ఎల్డీ) అధినేత జయంత్ చౌదరి విమర్శలు గుప్పించారు. ముందుగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా తాను పొందుతున్న ఉచితాలేంటో... Read more