Five Charred to Death After Auto Catches Fire శ్రీసత్యసాయి జిల్లా విషాదంపై ప్రముఖుల సంతాపం..

Sri satya sai tragedy 5 women electrocuted after high tension wire falls on auto rickshaw

Sri Satya Sai Electrocution, high-tension wire fell on auto-rickshaw, five women electrocuted to death, five women charred to death, Kanthaamma, Ramulamma, Lakshmi Devi, Ratnamma, Kumari, electricity department, high-tension wire, auto-rickshaw, Chillakondapally, Tadimarri Mandal, Sri Satya Sai district, Andhra Pradesh, Crime

In a tragic incident on Thursday morning, five women were electrocuted to death after a high-tension wire fell on an auto-rickshaw at Chillakondapally in Tadimarri Mandal of Sri Satya Sai district. This is the second incident in the last one week in the state. Earlier two siblings were electrocuted after an 11 KV high-tension wire fell on them while they were riding a motorcycle, in Devulapalli village under Jangareddygudem Mandal in Eluru.

శ్రీసత్యసాయి జిల్లాలో విషాదఘటన మృతులకు రూ.10లక్షల ఎక్స్ గ్రేషియా

Posted: 06/30/2022 12:15 PM IST
Sri satya sai tragedy 5 women electrocuted after high tension wire falls on auto rickshaw

ఆంధ్రప్రదేశ్ లోని శ్రీసత్యసాయి జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. కూలీలతో వెళ్తున్న ఆటోపై హైటెన్షన్‌ విద్యుత్‌ తీగ తెగి పడింది. దీంతో ఐదుగురు మహిళా కూలీలు అక్కడికక్కడే సజీవదహనమయ్యారు. వివరాల్లోకి వెళితే.. డ్రైవర్‌ సహా తాడిమర్రి మండలం గుండంపల్లి, పెద్దకోట్ల గ్రామాలకు చెందిన 12 మంది మహిళా కూలీలు పొలం పనుల నిమిత్తం చిల్లకొండయ్యపల్లి గ్రామానికి ఆటోలో వెళ్తున్నారు. మార్గం మధ్యలో ఆటోపై హైటెన్షన్‌ విద్యుత్‌ తీగ తెగిపడింది. దీంతో ఆటోలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ఆటోలో ఉన్న ఐదుగురు మహిళా కూలీలు మృతిచెందగా.. డ్రైవర్‌తో పాటు 8 మందికి స్వల్ప గాయాలయ్యాయి.

ప్రమాద సమయంలో మొత్తంగా ఆటోలో డ్రైవర్ తో పాటుగా 13 మంది ప్రయాణిస్తున్నారు. మృతులను కుమారి(35), రత్నమ్మ(35), రాములమ్మ(35), లక్ష్మి లక్మీదేవి(32), కాంతమ్మ(32)గా గుర్తించారు. క్షతగాత్రులను ఆర్డీటీ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ప్రమాద ఘటనపై సీఎం వైఎస్ జగన్‌ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. క్షతగాత్రులకు మెరుదైన వైద్యం అందించాలని జిల్లా కలెక్టరును అదేశించిన ఆయన.. మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున పరిహారం అందించాలని అధికారులను ఆదేశించారు. ఈ కష్ట సమయంలో బాధితుల కుటుంబాలకు అండగా నిలవాలని సీఎం జగన్‌ ఈ సందర్భంగా ప్రస్తావించినట్లు తెలుస్తోంది.

ఈ విషాధఘటనపై పలువురు ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. 12 మంది మహిళలతో వెళ్తున్న జీపుపై విద్యుత్ హైటెన్షన్ లైన్ తీగలు తెగిపడిన ఘటనపై ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. శ్రీసత్యసాయి జిల్లా విషాదఘటనపై జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆయన ప్రార్థించారు. విద్యుత్‌ తీగ తెగిపడడం మానవ తప్పిదమా? నిర్వహణ లోపమా అని పవన్‌ కల్యాణ్‌ అనుమానం వ్యక్తం చేశారు. ఛార్జీలు పెంచడంపై చూపించే శ్రద్ధ విద్యుత్‌ లైన్ల నిర్వహణపై చూపాలని సూచించారు. చాలాచోట్ల విద్యుత్‌ స్తంభాలు ఒరిగి, తీగలు వేలాడుతున్నా పట్టించుకోవడం లేదని విమర్శించారు. ఈ ప్రమాదంపై నిపుణులతో విచారణ జరిపించాలని పవన్ కల్యాణ్ డిమాండ్‌ చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles