సినీపరిశ్రమలో డ్రగ్స్ కేసులు సంచలనం సృష్టిస్తున్నాయి. బాలీవుడ్, టాలీవుడ్; కోలీవుడ్; శాండిల్ వుడ్ ఇలా.. పేర్లు వేరైనా ఇండస్ట్రీ మాత్రం మాదకద్రవ్యాలతో ముడిపడటం గమనార్హం. టాలీవుడ్ లో వెలుగుచూసిన డ్రగ్స్ వివాదానికి సంబంధించిన వివరాలను తమకు సమర్పించాలని ఎన్సీబి అధికారులు కోరుతున్నా.. తెలంగాణ అధికారులు వాటిని అందించలేదు. దీంతో ఎన్సీబి సహా ఈడీ అధికారులు కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. శాండిల్ వుడ్ లోనూ డ్రగ్స్ కేసులో పలువురు జైలు శిక్షను కూడా అనుభవించిన బెయిల్ పై బయటకు వచ్చారు.
ఇక ఇటు బాలీవుడ్ లో మాత్రం డ్రగ్స్ కలకలం నిత్యం వినిపిస్తూనే ఉంటుంది. బాలీవుడ్ హీరోగా ఇంతింతై వటుడింతై అన్నట్లు తన నటనా కౌశల్యంతో ఎదుగుతూ వెళ్లిన సుశాంత్ సింగ్ రాజ్ పుత్.. కు సినీ అవకాశాలను దూరం చేసి.. చివరాఖరుకి తన జీవితాన్నే ముగిచేసేలా చేసిన పలు కారణాల్లో మాదకద్రవ్యాలది కీలకపాత్ర. దీంతోఅప్పట్నించి రంగంలోకి దిగిన ఎన్సీబి అధికారులు ఎక్కడికక్కడ డ్రగ్స్ పై దాడులు చేస్తూనే వున్నారు. గతేడాది షారుఖ్ తనయుడు ఆర్యన్ ఖాన్ పై డ్రగ్స్ కేసు నమోదుకాగా, ఇటీవలే క్లీన్చిట్ వచ్చింది. కాగా తాజాగా మరో బాలీవుడ్ సెలబ్రిటీ డ్రగ్స్ కేసులో ఇరుక్కున్నాడు.
ప్రముఖ బాలీవుడ్ స్టార్ హీరోయిన్ శ్రద్ధాకపూర్ సోదరుడు, సీనియర్ యాక్టర్ శక్తి కపూర్ కుమారుడు సిద్ధాంత్ కపూర్ డ్రగ్స్ వివాదంలో చిక్కుకున్నాడు. ఆదివారం రాత్రి బెంగళూరులోని ఎంజీ రోడ్లో ఓ హోటల్లో జరుగుతున్న పార్టీలో డ్రగ్స్ వాడుతున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దాంతో పోలీసులు ఆ హోటల్కు వెళ్ళి పలువురిని అదుపులోకి తీసుకున్నారు. అందులో నటుడు సిద్ధాంత్ కూడా ఉన్నాడు. వీరి శాంపిల్స్ టెస్టింగ్కు పంపగా.. ఆరుగురికి పాజిటీవ్గా వచ్చాయి. ఆ ఆరుగురిలో సిద్ధాంత్ ఒకడు. కాగా సిద్ధాంత్ పలు బాలీవుడ్ సినిమాలకు సహాయ దర్శకుడిగా పనిచేశాడు. అంతేకాకుండా కొన్ని సినిమాలలో కూడా నటించిన ఆయన ప్రస్తుతం ఊచలు లెక్కపెడుతున్నాడు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more