ఎవరైనా అనుకోకుండా తప్పనిసరి పరిస్థితుల్లో ఏదో ఒక తప్పు చేసి.. తమ జీవితాలు మారుతాయని అశిస్తే.. సర్లే వారు బాగుపడేందు దేవుడి ఇలా అవకాశం ఇచ్చాడని అనుకోవచ్చు. కానీ.. అనుకోకుండా జరిగిన పరిణామాన్నే అలవాటుగా చేసుకుని అదే తప్పును మళ్లి మళ్లీ చేసి.. విలాసాలు, వినోదాలకు పాల్పడితే.. దేవుడు మాత్రం ఎంతకాలం ఉపేక్షిస్తాడు. అదే జరిగింది. కరోనా మహమ్మారి రాకముందు ఇతర రాష్ట్రాలకు చెందిన వ్యక్తులు హైదరాబాద్ కు వలసవచ్చి.. ఇక్కడ వ్యాపారాలు చేసుకుని కాస్తా.. కూస్తో ఆర్జించిన డబ్బుతో వారి కుటుంబాలను పోషించుకునేవారు. అయితే కరోనా మహమ్మారి వారి తలరాతలను మార్చింది.
కరోనా దెబ్బకు లాక్ డౌన్ లు విధించడంతో.. వ్యాపారానికని దాచుకున్న డబ్బులు అన్ని ఖర్చుకావడంతో. ఏం చేయాలో తెలియక ఓ సారి ఏసీ క్లాస్ కోచులలో హైదరాబాద్ కు వచ్చారు. దిగిన వెంటనే తమ లగేజీ చేసుకున్నారు. తమతో పాటు ఇతర ప్యాసింజర్ లగేజీ కూడా వచ్చింది. సర్లే తెరచి చూద్దాం.. వారి చిరునామా ఉండే తిరిగి పంపిద్దామనుకుని తమ రూమ్ కు వెళ్లారు. వెళ్లగానే సూట్ కేసు తెరిచి చూశారు. అందులో ఇతర ప్యాసింజర్లకు చెందిన బట్టలతో పాటు బంగారు ఆభరణాలు ఉన్నాయి. బంగరాన్ని చూడగానే వారి మనసు మారింది. దానిని సోమ్ముచేసుకుని స్టార్ హోటళ్లకు వెళ్లి జల్సా చేశారు.
ఇలా ఒక్కసారి తరువాత మరోకటి.. ఇలా ప్యాసింజర్ల సూట్ కేసులు కొట్టేస్తూ.. వాటి నుంచి వచ్చిన డబ్బులతో ఎంజాయ్ చేస్తూనే.. బంగారాన్ని మాత్రం దాచిపెట్టారు. తీరా ఇక దొంగతనాలకు స్వస్తి పలికాలని భావించి బంగారాన్ని పంచుకున్నారు. అక్కడ ఇద్దరి మధ్య తేడాలు వచ్చాయి. ఇంకేముంది.. మరోమారు దొంగతనం చేసి లెక్కను సరిచేద్దామని అనుకున్నారు. ఈ క్రమంలో ఓ రైలులో ఏసీ కోచ్ లో టికెట్ రిజర్వు చేసుకుని యధాతధంగా సూట్ కేసు తీసుకుని దిగుతుండగా, రెడ్ హ్యాండెడ్ గా పోలీసులకు చిక్కారు. ఇక వీరి నుంచి ఏకంగా 55 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ఇంతకీ వీరులో ఒకరు జార్ఖండ్ కు చెందిన రాజీవ్ తక్సోంగీ (65) మరోకరు ఉత్తర్ ప్రదేశ్ కు చెందిన రంజన్ కుమార్ శ్రీవాత్సవ్ (42).
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more