కొవిడ్ మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా లక్షలాధి మందిని అధికారికంగా బలితీసుకోగా, కోటిమందికి పైగా ఈ కంటిని కనిపించని శత్రువోతో మరణించారని అనదికార లెక్కలు చెబుతున్నాయి. అయితే ఇప్పటికీ కరోనా మహమ్మారి బారినపడిన మరణాలు కోనసాగుతున్నాయి. కాగా, కరోనా హృద్రోగుల పాలిక శాపంగా కూడా మారింది. గుండె పనితీరును లోలోపల ప్రభావం చూపుతూనే ఉందని ఇటీవల ఇండియన్ ఫెడరేషన్ ఆప్ కార్డియోలజిస్టులు ఏర్పర్చుకున్న సమావేశంలో ఈ సమాఖ్య కరోనా ప్రభావం-గుండె పనితీరుపై సమీక్ష నిర్వహించిన అందోళన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.
ఇక హృద్రోగులతో పాటు దీర్ఘకాలిక రోగాల బారిన పడిన మధుమేహ వ్యాధిగ్రస్తులు.. కిడ్నీ, శ్వాసకోశ సంబంధిత వ్యాధుల బారిన పడిన రోగులు కూడా అప్రమత్తంగా ఉండాలని ఇప్పటికీ వైద్యులు సూచనలు చేస్తున్నారు. ఇక తాజాగా కరోనా సోకిన ఉద్యోగుల్లో పనితీరు సామర్థ్యం తగ్గిందా? వారు జ్ఞాపక శక్తి, ఏకాగ్రత సమస్యలను ఎదుర్కొంటున్నారా? అంటే అవుననే అంటోంది ఓ నూతన అధ్యయనం. కొవిడ్ సోకనివారితో పోలిస్తే కొవిడ్ సోకినవారిలో జ్ఞాపకశక్తి సమస్యలున్నాయని, వారి పనితీరు మందగించిందని పరిశోధకులు గుర్తించారు. ఈ అధ్యయన ఫలితాలు సైంటిఫిక్ రిపోర్ట్స్ జర్నల్లో ప్రచురితమయ్యాయి.
ఈ అధ్యయనాన్ని కెనడాలోని వాటర్ లూ యూనివర్సిటీ పరిశోధకులు నిర్వహించారు. కొవిడ్ సోకిన, సోకని 94 మందిని పరిశోధకులు రెండు బృందాలుగా విభజించి అధ్యయనం చేశారు. కొవిడ్-19 బారినడపడ్డవాళ్లకు శారీరక హాని కాకుండా..పనిచేసేసామర్థ్యంపై హానికరమైన ప్రభావాన్ని చూపుతుందని అధ్యయనంలో తేల్చారు. కొవిడ్ -19 బారిన పడనివారితో పోలిస్తే కొవిడ్ సోకినవారు పనిచేసేటప్పుడు ఎక్కువ ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు తమ అధ్యయనంలో తేలిందని పరిశోధనకు నేతృత్వం వహించిన సైకాలజీ అసోసియేట్ ప్రొఫెసర్ జేమ్స్ బెక్ పేర్కొన్నారు.
కొవిడ్తో బాధపడ్డవారి పనితీరు సామర్థ్యం చాలామేర తగ్గిపోయిందని, కొందరు ఉద్యోగాన్ని స్వచ్ఛందంగా వదిలేయాలని అనుకుంటున్నట్లు పరిశోధనలో తేలిందని బెక్ చెప్పారు. కొవిడ్తో బాధపడ్డవారు పూర్వస్థితికి రావాలంటే, పనిలో వారికి కొంత వెసులబాటు కల్పించాలని సూచించారు. పనిభారం తగ్గించడం, వారి డెడ్లైన్స్ని పొడిగించడం, సౌకర్యవంతమైన పని ఏర్పాట్లు చేయడంలాంటివి వారిలో మళ్లీ పనిపట్ల ఉత్సాహాన్ని పెంచుతాయని బెక్ వివరించారు. మొత్తానికి కరోనా కొందరిని ఉన్నపళంగా ప్రాణాలను హరిస్తే.. మరికోందరిపై నెమ్మెదిగా తన ప్రభావాన్ని చాటుతూ స్లో పాయిజన్ లా మారిందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. కల్పించాలని సూచించారు. పనిభారం తగ్గించడం, వారి డెడ్లైన్స్ని పొడిగించడం, సౌకర్యవంతమైన పని ఏర్పాట్లు చేయడంలాంటివి వారిలో మళ్లీ పనిపట్ల ఉత్సాహాన్ని పెంచుతాయని బెక్ వివరించారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more