కేంద్ర ప్రభుత్వం రైతులకు శుభవార్త అందించింది. నూతన సాగు చట్టాలను ఉపసంహరించుకునేలా చేసిన రైతుల పోరాటంతో వారిపై కేంద్రం గుర్రుగా ఉందన్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని ఈ గుడ్ న్యూస్ తో స్పష్టం చేసింది. దేశ ప్రగతి వ్యవసాయ ఉత్పత్తులతో ముడిపడివుందని బావించిన కేంద్రం.. దేశరైతాంగ అభ్యున్నతి కోసం ఎప్పటికప్పుడు తగు నిర్ణయాలు తీసుకుంటామని ఈ నిర్ణయంతో తేల్చిచెప్పింది. ఇంతకీ రైతులకు కేంద్రం చెప్పిన శుభవార్త ఏంటీ అంటారా. 2022-23 సంవత్సరానికి గానూ 17 ఖరీఫ్ పంటలపై కనీస మద్దతు ధరను పెంచుతున్నట్లు ప్రకటించింది.
ప్రధాని మోదీ నేతృత్వంలోని ఆర్థిక వ్యవహారాల కమిటీ దీనికి ఆమోదం తెలిపిందని ఈ మేరకు తాజాగా ప్రకటన విడుదల చేసింది. ప్రధాని మోదీ తీసుకున్న పలు చర్యలు రైతుల ఆదాయాన్ని పెంచేందుకు సాయపడతాయని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ అన్నారు. 17 పంటలకు తాజా ధరలు క్వింటాల్కు రూ.92 నుంచి రూ.523 వరకు పెరిగాయి. వరి రైతుల ఆదాయాన్ని పెంచేందుకు కనీస మద్దతు ధరను రూ.100 పెంచింది. దీంతో క్వింటాల్ ధాన్యం రూ.2,040కు పెరిగింది. ఎ-గ్రేడ్ ధాన్యానికి రూ.2,060కు పెంచింది. వీటిలో గరిష్టంగా నువ్వులు క్వింటాల్కు రూ.523 పెంచారు.
సోయాబీన్, కందులపై రూ.300 చొప్పున, పెసర్లపై రూ.480 పెంచారు. మొక్కజొన్నపై క్వింటాల్కు అత్యల్పంగా రూ.92 పెంచారు. వాణిజ్య పంటలైన పత్తి కనీస మద్దతు ధర రూ.6,380కు పెరిగింది. గతేడాది ఇది రూ.6,025గా ఉంది. పెసర్లు రూ.7,275 నుంచి రూ.7,755కు పెరిగింది. మినుములు రూ.6,300 నుంచి రూ.6,600 పెరగ్గా, సోయాబీన్ రూ.3,950 నుంచి రూ.4,300కు, సన్ ఫ్లవర్ రూ.6,015 నుంచి రూ.6,400కు పెరిగాయి. వేరుశనగ రూ.5,550 నుంచి రూ.5,850కి, నువ్వులు అత్యధికంగా రూ.7,307 నుంచి 7,830కి, రాగి ధర రూ.3,377 నుంచి రూ.3,578కి, జొన్నలు రూ.2,250 నుంచి రూ.2,350 పెరిగాయి.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more