అభివృద్ది అంశంలో అవరోధాలు కల్పించడమే పనిగా పెట్టుకుని న్యాయపోరాటాల పేరుతో సమయాన్ని వృధా చేస్తున్న కోందరికి దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు తగిన పాఠం నేర్పించింది. అడ్డంకులు సృష్టించడమే పనిగా పెట్టుకుని కోర్టుల్లో పిటీషన్ వేస్తున్న ఇద్దరు పిటీషనర్లకు అత్యున్నత న్యాయస్థానం ఏకంగా లక్ష రూపాయల మేర వడ్డింపులు వడ్డించింది. దీంతో పిటీషన్ వేయడమే ఖర్చుతో కూడకున్న పనికగా, ఇప్పుడు లక్ష రూపాయల జరిమానా తమపై పడటంతో ఇకపై పిటీషన్లు వేసి అభివృద్ది పనులను ఆపాలని ప్రయత్నాలు చేసేవారికి ఇది చెంపపెట్టులాంటి తీర్పుగా మారింది.
ఇక ఈ కేసుకు సంబంధించిన వివరాల్లోకి వెళ్తే.. పూరి జగన్నాథ ఆలయం వద్ద చేపడుతున్న నిర్మాణాలను అడ్డుకోవాలంటూ దాఖలైన పిటీషన్లపై సర్వోన్నత న్యాయస్థానం తీర్పునిచ్చింది. ఒడిశా ప్రభుత్వం చేపడుతున్నట్లు నిర్మాణ ప్రక్రియ ప్రజల ప్రయోజనార్థమే జరుగుతోందని సుప్రీం తెలిపింది. పూరి ఆలయం వద్ద నిర్మాణ పనులను నిలిపాలని వేసిన పిటిషన్లను సుప్రీం కొట్టిపారేసింది. జస్టిస్ బీఆర్ గవాయి, హిమా కోహ్లీలతో కూడిన ధర్మాసనం ఈ తీర్పును వెలువరించింది. పూరి ఆలయానికి లక్షల సంఖ్యలో భక్తులు వస్తుంటారని, వారికి కనీస సౌకర్యాలు ఏర్పాటు చేయడం ప్రభుత్వ విధి అని అత్యున్నత న్యాయస్థానం పేర్కోంది.
అలాంటప్పుడు ఆ నిర్మాణాన్ని ఆపేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించలేమని సుప్రీం ధర్మాసనం తెలిపింది. అనవసరమైన పిల్స్ను దాఖలు చేయరాదు అని కోర్టు సీరియస్ అయ్యింది. ప్రతి రోజు 60 వేల మంది భక్తులు ఆలయాన్ని విజిట్ చేస్తారని, అక్కడ అధిక సంఖ్యలో టాయిలెట్లను నిర్మించాల్సిన అవసరం ఉందని అడ్వకేట్ జనరల్ అశోక్ కుమార్ పరిజా కోర్టులో వాదించారు. సంస్కృతి శాఖ అనుమతితోనే నిర్మాణం జరుగుతోందన్నారు. నేషనల్ మాన్యుమెంట్స్ అథారిటీ(ఎన్ఎంఏ) ప్రకారమే నిర్మాణ పనులు ప్రారంభమైనట్లు చెప్పారు. నిర్మాణాలను వ్యతిరేకిస్తూ పిటిషన్ వేసిన ఇద్దరికీ చెరో లక్ష చొప్పున కోర్టు జరిమానా విధించింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more