దేశవ్యాప్తంగా ఉన్న పెట్రోల్ పంప్ డీలర్లు మంగళవారం నిరసనబాట పట్టారు. నిన్నమొన్నటి వరకు ఆకాశానంటిన ఇంధన ధరల నేపథ్యంలో అల్లాడిపోయిన వాహనదారులు.. ఇప్పుడు తాజాగా పెట్రోల్ బంకు డీలర్ల నిరసనలతో ఇక్కట్లు ఎదుర్కోన్నాడు. ఇవాళ దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాలకుచెందిన పెట్రోల్ బంకు డీలర్లు ఇంధనాన్ని కోనుగోలు చేయకుండా నిరసన చేపట్టారు. అయితే దీంతో దేశంలో పలు రాష్ట్రాల్లోని పెట్రోల్ బంకుల్లో ఇంధనం లభ్యం కాక వాహనదారులు ఇక్కట్లు పడ్డారు. ఈ మేరకు ఒక్క రోజు.. ఓఎమ్సీ(ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు)ల నుంచి పెట్రోల్, డీజిల్ కొనుగోలు చేయకూడదని వారు నిర్ణయించుకున్నారు.
దీంతో తమ నిరసనను ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలకు తెలియజేయాలని ముందుగానే వారు నిర్ణయించుకున్నారు. ఈ నిరసనల్లో భాగంగా దేశవ్యాప్తంగా పలువురు వాహన దారులు ఇంధనం లభించక ఇబ్బందులు పడ్డారు. పెట్రోల్ పంప్ల డీలర్లకు ఇచ్చే కమిషన్ను పెంచకపోవడంతో పెట్రోల్ పంప్ డీలర్స్ అసోసియేషన్ ఈ మేరకు నిరసనలు చేపట్టింది. 24 రాష్ట్రాల్లోని పెట్రోల్ పంప్లు ఈ నిరసనల్లో పాల్గొంటాయని అసోసియేషన్ వెల్లడించింది. అయితే.. పంప్లలో ఇప్పటికే పెట్రోల్, డీజిల్ స్టాక్ కావాల్సినంత మేర ఉండటంతో వాహనదారులకు ఎలాంటి ఇబ్బందులు ఉండవని వెల్లడించింది.
"మంగళవారం.. దేశంలోని 24 రాష్ట్రాలకు చెందిన ఒక్క పెట్రోల్ పంప్ కూడా ఓఎమ్సీ నుంచి చమురును కొనుగోలు చేయదు. పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతున్నా, మా కమిషన్ను మాత్రం పెంచడం లేదు. అందుకే ఈ నిరసన," అని ఢిల్లీ పెట్రోల్ డీలర్స్ అసోసియేషన్ పేర్కొంది. అసోసియేషన్ ప్రకారం.. డీలర్ల మార్జిన్లను ఓఎమ్సీ ప్రతి ఆరు నెలలకు ఓసారి రివైజ్ చేయాలి. కానీ 2017 నుంచి కమిషన్లలో మార్పులు లేవు. అదే సమయంలో చమురు ధరలు, ఆపరేషన్ వ్యయం భారీగా పెరిగిందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ద్రవ్యోల్బణంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న దేశప్రజలకు కాస్త ఉపసమనాన్ని అందించే విధంగా.. పెట్రోల్, డీజిల్ ధరలను కేంద్రం తగ్గించిన విషయం తెలిసిందే.
లీటరు పెట్రోల్పై రూ. 8, లీటరు డీజిలపై రూ. 6ను తగ్గించింది. కాగా.. పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గిస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయంతో ఇప్పటికే నష్టాల్లో ఉన్న తమపై మరింత భారం పడిందని అసోసియేషన్ ఆవేదన వ్యక్తం చేసింది. ఢిల్లీ, పంజాబ్, హరియాణా, గుజరాత్, రాజస్థాన్, మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక, హిమాచల్ప్రదేశ్, బిహార్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కేరళ, అస్సాం, మేఘాలయా, అరుణాచల్ప్రదేశ్, నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, త్రిపుర, సిక్కిం, పశ్చిమ్ బెంగాల్ రాష్ట్రాల్లోని పెట్రోల్ పంప్లు.. ఈ నిరసనల్లో పాల్గొన్నాయి.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more