Arvind Kejriwal's Minister Arrested By ED ఢిల్లీ అరోగ్యశాఖ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్.!

Ed arrests delhi health minister satyendar jain in hawala transactions case

Satyendar Jain, arrest, enforcement directorate, money laundering case, AAP, Delhi Health Minister, Himachal Pradesh AAP Incharge, Himachal Pradesh assembly Elections, BJP plan to defeat AAP, Political rivalry, Crime

Delhi Health Minister Satyendar Jain has been arrested by the Enforcement Directorate (ED) in a money laundering case. Assets worth Rs 4.81 crore linked to the Aam Aadmi Party minister's family were attached by the ED in a disproportionate assets case in April this year.

మనీ లాండరింగ్ అభియోగాలపై ఢిల్లీ అరోగ్యశాఖ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్.!

Posted: 05/30/2022 08:45 PM IST
Ed arrests delhi health minister satyendar jain in hawala transactions case

బీజేపియేతర రాష్ట్రాల్లోని మంత్రులను అరెస్టు చేయడంలో కేంద్ర ఏజెన్సీలు తమ సత్తాను చాటుతున్నాయి. గత ఎనమిదేళ్ల కాలంలో పలు రాష్ట్రాలకు చెందిన మంత్రులను అరెస్టు చేసిన కేంద్ర సంస్థలు.. తాజాగా మనీలాండరింగ్​ కేసులో ఢిల్లీ ఆరోగ్యశాఖ మంత్రి సత్యేంద్ర జైన్​ను కూడా అరెస్టు చేశాయి. ఎన్ ఫోర్సమెంట్ డేరెక్టరేట్ (ఈడీ) అధికారులు సోమవారం సాయంత్రం సత్యేంద్ర జైన్ ను అరెస్ట్​ చేశారు. 2015-16 మధ్య కాలంలో కోల్​కతాలోని ఓ సంస్థతో సత్యేందర్​ జైన్​.. అక్రమ లావాదేవీలకు పాల్పడినట్టు ఆయనపై అభియోగాలు మోపింది ఈడీ. ఈ అభియోగాల నేపథ్యంలో అయనను ఇవాళ అరెస్టు చేసింది.

అయితే అప్ మాత్రం ఈ అరెస్టును తీవ్రంగా ఖండిస్తోంది. తమను రాజకీయాంగా ఎదుర్కోనలేని బీజేపి కావాలని కేంద్ర సంస్థలను అడ్డుపెట్టుకుని పార్టీలను, ఆయా పార్టీల నేతలను భయభ్రాంతులకు గురిచేస్తోందని అరోపిస్తోంది. హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఇంచార్జ్ గా అప్ తరపున వ్యవహరిస్తున్న సత్యేంద్రజైన్ ను రాజకీయాంగా ఎదుర్కోనలేక.. ఇలా అభియోగాలు మోపి అరెస్టు చేసి.. రాజకీయ లబ్దిని పోందాలని బీజేపి ప్రయత్నాలు చేస్తోందని అప్ పార్టీ అరోపిస్తోంది. కాగా, హిమాచల్​ అసెంబ్లీ ఎన్నికల తరుణంలో సత్యేందర్​ జైన్​ అరెస్ట్​ సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.

ఆప్​ పార్టీకి, బీజేపీకి మధ్య ఇప్పటికే విభేదాలు తీవ్రస్థాయిలో ఉన్నాయి. "ఎనిమిదేళ్లుగా.. సత్యేందర్​ జైన్​పై తప్పుడు కేసు నడుస్తోంది. ఇప్పటి వరకు అనేకమార్లు ఆయన్ని ఈడీ పిలిచి విచారించింది. ఏం దొరకకపోవడంతో.. కొన్నేళ్లు ఆయన్ని వెంబడించడం ఆపేసింది. కానీ ఇప్పుడు కథ మళ్లీ మొదలైంది. సత్యేందర్​ జైన్​.. హిమాచల్​ ప్రదేశ్​ ఆప్​ ఇన్​ఛార్జ్​గా ఉన్నారు. త్వరలో అక్కడ ఎన్నికలు జరగనున్నాయి. హిమాచల్​ప్రదేశ్​లో అధికార బీజేపీకి ఓటమి భయం పట్టుకుంది. అందుకే సత్యేందర్​ జైన్​ను అరెస్ట్​ చేశారు. తప్పుడు కేసులో అరెస్ట్​ చేశారు కాబట్టి.. కొన్ని రోజుల్లోనే ఆయన్ని విడిచిపెట్టక తప్పదు," అని ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్​ సిసోడియా ట్వీట్​ చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles