బీజేపియేతర రాష్ట్రాల్లోని మంత్రులను అరెస్టు చేయడంలో కేంద్ర ఏజెన్సీలు తమ సత్తాను చాటుతున్నాయి. గత ఎనమిదేళ్ల కాలంలో పలు రాష్ట్రాలకు చెందిన మంత్రులను అరెస్టు చేసిన కేంద్ర సంస్థలు.. తాజాగా మనీలాండరింగ్ కేసులో ఢిల్లీ ఆరోగ్యశాఖ మంత్రి సత్యేంద్ర జైన్ను కూడా అరెస్టు చేశాయి. ఎన్ ఫోర్సమెంట్ డేరెక్టరేట్ (ఈడీ) అధికారులు సోమవారం సాయంత్రం సత్యేంద్ర జైన్ ను అరెస్ట్ చేశారు. 2015-16 మధ్య కాలంలో కోల్కతాలోని ఓ సంస్థతో సత్యేందర్ జైన్.. అక్రమ లావాదేవీలకు పాల్పడినట్టు ఆయనపై అభియోగాలు మోపింది ఈడీ. ఈ అభియోగాల నేపథ్యంలో అయనను ఇవాళ అరెస్టు చేసింది.
అయితే అప్ మాత్రం ఈ అరెస్టును తీవ్రంగా ఖండిస్తోంది. తమను రాజకీయాంగా ఎదుర్కోనలేని బీజేపి కావాలని కేంద్ర సంస్థలను అడ్డుపెట్టుకుని పార్టీలను, ఆయా పార్టీల నేతలను భయభ్రాంతులకు గురిచేస్తోందని అరోపిస్తోంది. హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఇంచార్జ్ గా అప్ తరపున వ్యవహరిస్తున్న సత్యేంద్రజైన్ ను రాజకీయాంగా ఎదుర్కోనలేక.. ఇలా అభియోగాలు మోపి అరెస్టు చేసి.. రాజకీయ లబ్దిని పోందాలని బీజేపి ప్రయత్నాలు చేస్తోందని అప్ పార్టీ అరోపిస్తోంది. కాగా, హిమాచల్ అసెంబ్లీ ఎన్నికల తరుణంలో సత్యేందర్ జైన్ అరెస్ట్ సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.
ఆప్ పార్టీకి, బీజేపీకి మధ్య ఇప్పటికే విభేదాలు తీవ్రస్థాయిలో ఉన్నాయి. "ఎనిమిదేళ్లుగా.. సత్యేందర్ జైన్పై తప్పుడు కేసు నడుస్తోంది. ఇప్పటి వరకు అనేకమార్లు ఆయన్ని ఈడీ పిలిచి విచారించింది. ఏం దొరకకపోవడంతో.. కొన్నేళ్లు ఆయన్ని వెంబడించడం ఆపేసింది. కానీ ఇప్పుడు కథ మళ్లీ మొదలైంది. సత్యేందర్ జైన్.. హిమాచల్ ప్రదేశ్ ఆప్ ఇన్ఛార్జ్గా ఉన్నారు. త్వరలో అక్కడ ఎన్నికలు జరగనున్నాయి. హిమాచల్ప్రదేశ్లో అధికార బీజేపీకి ఓటమి భయం పట్టుకుంది. అందుకే సత్యేందర్ జైన్ను అరెస్ట్ చేశారు. తప్పుడు కేసులో అరెస్ట్ చేశారు కాబట్టి.. కొన్ని రోజుల్లోనే ఆయన్ని విడిచిపెట్టక తప్పదు," అని ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా ట్వీట్ చేశారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more