నాగర్ కర్నూల్ జిల్లా మద్యం ప్రియుల అదృష్టం కలసివచ్చింది. తెలంగాణ ప్రభుత్వం మద్యం ధరలను పెంచుతూ నిర్ణయం తీసుకున్న వారంలో.. నాగర్ కర్నూలుకు జిల్లా కేంద్రానికి సమీపంలో మందుబాబులకు మద్యంబాటిళ్లు ఉచితంగా లభించాయి. అదెలా అంటే.. ఇటీవల ఏపీలోని ప్రకాశం జిల్లాలో బీరు లోడుతో వెళ్తున్న లారీ బోల్తా పడటంతో.. అక్కడి మందుబాబులు పండుగ చేసుకున్నారు. తాజాగా నాగర్ కర్నూల్ మందుబాబుల వంతు వచ్చింది. జిల్లాలోని మంతటి చౌరస్తా వద్ద ప్రమాదవశాత్తూ మద్యం తరలిస్తున్న వాహనం బోల్తాపడింది. దీంతో మంతటి ప్రజలు సంబరంలో మునిగితేలారు. దొరికిన వారికి దొరికినంత మద్యాన్ని తీసుకెళ్లారు.
ఈ ఘటన సోమవారం రాత్రి చోటుచేసుకోగా.. బొలేరో వాహన డ్రైవర్ ను పట్టించుకున్నవారు లేరు కానీ.. మద్యం బాటిళ్లను మాత్రం అక్కడివారు ఎత్తుకెళ్లారు. మద్యం బాటిళ్లను తరలిస్తున్న వాహనం అదుపుతప్పి బోల్తా పడటంతో బీరు, లిక్కర్ బాటిళ్లు ప్రయాణికులు, వాహనదారులు దొరికినకాడికి మద్యం బాటిళ్లను ఎత్తుకెళ్లారు. అచ్చంపేట పట్టణానికి చెందిన సుభాష్ మద్యం దుకాణందారులు బొలేరో వాహనంలో లిక్కర్ కాటన్లను తీసెకెళ్తున్నారు. తిమ్మాజిపేట లిక్కర్ డిపో నుంచి రూ. 5 లక్షల మద్యం లోడుతో మినీ డీసీఎం అమ్రాబాద్ మండలం తుర్కపల్లికి వెళ్తుంది.
అయితే నాగర్ కర్నూల్ మండలం మంతటి చౌరస్తా సమీపానికి రాగానే అదుపుతప్పి వాహనం బోల్తాపడింది. దీంతో బీరు బాటిల్, లిక్కర్ బాటిళ్లు పగిలి మద్యం రోడ్డు పాలైంది. చాలా వరకు మద్యం బాటిళ్లను వాహనదారులు, ప్రయాణికులు లూటీ చేశారు. దాదాపు రూ. మూడున్నర లక్షల వరకు నష్టం వాటిల్లినట్టు అంచనా వేశారు. సమాచారం తెలుసుకున్న ఎక్సైజ్ అధికారులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. అచ్చంపేట పట్టణానికి చెందిన సుభాష్ మద్యం దుకాణందారులు బొలేరో వాహనంలో లిక్కర్ కాటన్లను తీసెకెళ్తున్నారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more