పెళ్ళంటె పందిళ్ళు.. సందళ్ళు, తప్పెట్లు.. తాళాలు తలంబ్రాలూ, మూడే ముళ్ళు.. ఏడే అడుగులు.. మొత్తం కలిసీ నూరేళ్ళు అంటూ ఎవర్వైనా తమ పెళ్లి అనగానే ఆ రోజున ఎంతో ఆనందంగా ఉంటూ.. అహ్లాదకరంగా గడపుతారు. అలానే ఇక్కడ ఈ పెళ్లిలోనూ వధూవరులు తమ పెళ్లి తర్వాత ఏర్పాటు చేసిన డీజేలో వారు కాలుకదపి డాన్స్ చేశారు. వధువు వచ్చి డాన్స్ చేస్తుండగా, వరుడు కూడా ఆ వెంటనే జతకలిసి.. హాయిగా, ఆనందంగా డాన్స్ చేస్తూ.. తన జీవితంలోకి అడుగుపెట్టిన భాగస్వామిని సంతోషపరుస్తున్నాడు. ఇంతలో ఎవరి దృష్టి పడిందో లేక.. ఎవరి కన్నుకుట్టిందో తెలియదు కానీ.. పెళ్ళి వేదిక కూలిపోయింది.
అన్నదమ్ముల పెళ్లిళ్లు ఒకేసారి జరుగ్గా.. ఆ కళ్యాణ వేదికలో అందరూ ఎంతో హుషారుగా పాల్గోని తమ సంతోషాలను పంచుకున్నారు. ఆ సమయంలో ఏకంగా పెళ్లి వేదికే కూలిపోవడంతో అప్పటివరకు విసిరిన ఆనందాలన్నీ క్షణాల్లో తారుమారై హాహాకారాలుగా మిన్నంటాయి. వేదికపైనున్న 14 మందికి గాయాలు కాగా అందులో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారని, ఒక మహిళకు మెడ సర్వైకల్ కూడా దెబ్బతిన్నదని వైద్యులు తెలిపారు. వేదిక పడిపోగానే అప్పటివరకు వేదికకు చేరువలోనే ఉన్న బంధువులు అందరూ ఒక్కసారిగా అక్కడి నుంచి భయపడుతూ పరుగులు తీశారు. ఇందుకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
వివరాల్లోకి వెళితే.. ఉత్తరాఖండ్ లోని శాంతిపురిలో కాలనీలో ఈనెల 12న ఓ వివాహ కార్యక్రమం జరిగింది. ఇదే సమయంలో అనుకోని సంఘటన జరిగింది. వివాహానంతరం నూతన దంపతులు బంధువులతో కలిసి చిందులేస్తున్నారు. డ్యాన్సులు చేస్తూ ఫుల్ ఎంజాయ్ చేస్తున్న సమయంలో ఒక్కసారిగా బలమైన గాలులు వీచాయి. అక్కడున్నవారిపై పందిరి కూలి మీదపడింది. వెంటనే అక్కడున్నవారంతా భయంతో పరుగులు తీశారు. పలువురికి గాయాలైనట్లు తెలిసింది. ఇందుకు సంబంధించిన వీడియో, ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more