అసలే అంతర్జాతీయ నగరంగా పురగమిస్తున్న హైదరాబాద్.. రోడ్డుపై కదలాలంటే ట్రాఫిక్ సమస్య ఎంతలా ఉంటుందో అందరికీ తెలిసిందే. కరోనా లాక్ డౌన్ కారణంగా కాసింత ట్రాఫిక్ తగ్గినా.. కాలుష్యం మాత్రం అదే స్థాయిలో ఉంది. ఎందుకంటే కొన్ని వాహనాల గొట్టాల నుంచి పోగ అధికస్థాయిలో విడుదల అవుతోంది. ఓ వైపు తల పగిలే ఎండలో.. ఊపిరి పీల్చుకోలేని దారుణ కాలుష్యాన్ని వదిలే వాహనాల మధ్య నడిరోడ్డుపై ట్రాఫిక్ డ్యూటీలు చేయాలంటే.. ఈజీ పనికాదు. ఒక్కసారి ఊహించుకోండి. పీడకలలా అనిపిస్తుందా? ఇలాంటివి నిజం కావొద్దు అనుకుంటే మీరు తాగి వాహనం నడుపొద్దు. అలా చేస్తే.. కచ్చితంగా.. కొన్నిసార్లు మీరు ఎండలో ట్రాఫిక్ ను నియంత్రించే డ్యూటీ చేయాల్సి వస్తుంది.
మద్యం తాగి వాహనాలు నడిపే వారిపై జరిమానాలు, డ్రైవింగ్ లైసెన్స్ రద్దుతో పాటు ట్రాఫిక్ విధులు నిర్వహించాలని కోర్టు ఆదేశాలు జారీ చేసినట్టుగా సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ట్వీట్ చేశారు. తాగినవారు.. రద్దీగా ఉండే ట్రాఫిక్ జంక్షన్లలో శిక్షగా ట్రాఫిక్ విధులను నిర్వహిస్తారు. వీరితోపాటు ట్రాఫిక్ కానిస్టేబుళ్లు కూడా ఉంటారు. మద్యం తాగి వాహనాలు నడిపితే.. ఎలాంటి ప్రమాదాలు ఉంటాయోనని తెలియజేసేందుకు ఈ చర్య ఉపయోగపడుతుందని పోలీసులు అంటున్నారు. అంతకుముందు రద్దీగా ఉండే ట్రాఫిక్ జంక్షన్లలో అవగాహన కల్పించే ప్లకార్డులను చూపించడం వంటి వాటిని చేసేవారు. ఇకపై నేరుగా ట్రాఫిక్ విధులను నిర్వర్తించాలి.
అయితే గతంలో డ్రంగ్ అండ్ డ్రైవ్ లో చాలా కేసులు కోర్టుకు పంపించడంతో చాలా మంది కేసులు చుట్టు తిరిగేవారు. ఏళ్ల తరబడి కేసుల్లో ఇరుక్కుని పరిష్కారం లభించని కేసులను ఓ కొలిక్కి తీసుకువచ్చేందుకు పోలీసు శాఖతో పాటు లీగల్ సర్వీసెస్ అథారిటీ ప్రయత్నాలు చేశాయి. కేసులను జరిమానాలతో సరిపెట్టే ప్లాన్ వేశారు. కిందటి మార్చిలో లోక్ అదాలత్ ద్వారా కేసులను పరిష్కరించారు. అయితే ఇందులో భాగంగా.. జరిమానా తగ్గింపును ఫిబ్రవరి 19వ తేదీ నుంచి మార్చి 12వ తారీకు వరకు విధించేందుకు కోర్టు అనుమతి ఇచ్చింది. దీంతో ఆ సమయంలో డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో పట్టుబడ్డ వాహనదారులు క్యూలైన్లలో నిలబడి మరి జరిమానా చెల్లించి వాహనాలను విడిపించుకున్నారు.
మద్యం సేవించి బండి నడిపినందుకు జరిమానాతో పాటు ట్రాఫిక్ డ్యూటీ కూడా చేయాలనీ ఆదేశించిన గౌరవనీయమైన కోర్టు.
— CYBERABAD TRAFFIC POLICE సైబరాబాద్ ట్రాఫిక్ పోలీస్ (@CYBTRAFFIC) May 18, 2022
మద్యం సేవించి బండి నడిపితే జరిమానా, జైలు శిక్షతో పాటు డ్రైవింగ్ లైసెన్స్ కూడా రద్దు చేయడం జరుగుతుంది.#RoadSafety #RoadSafetyCyberabad pic.twitter.com/7EgRUk2rTL
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more