ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రెడ్డిపై జనసేన పార్లమెంటరీ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ మండిపడ్డారు. రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర చేసి, దీక్షలు, శిబిరాలు చేపట్టిన జగన్.. ఎన్నికల ముందు ప్రజలకిచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమయ్యాయరని ఆయన విమర్శించారు. మేనిఫెస్టోలో చెప్పిన జాబ్ క్యాలెండర్ ఏమైందని నిలదీశారు. కంపల్సరీ పెన్షన్ పథకం (సీపీఎస్) విషయంలో కార్మికులకు హామీనిచ్చిన జగన్ సర్కార్.. అధికారంలోకి వచ్చిన రెండేళ్లు గడిచినా దానిని పూర్తిగా మర్చిపోయిందని దుయ్యబట్టారు. సీపీఎస్ రద్దుపై హామీని నిలబెట్టుకోవట్లేదని ఆయన డిమాండ్ చేశారు.
మద్యపాన నిషేధం విధిస్తామని చెప్పిన జగన్.. ఇప్పుడు ప్రతి గ్రామంలో మద్యాన్ని ఏరులై పారిస్తున్నారని దుయ్యబట్టారు. మద్యం దుకాణాల నిర్వహణ చేపట్టిన ప్రభుత్వం.. ప్రజారోగ్యాన్ని గాలికి వదిలి.. నాణ్యతలేని మద్యాన్ని అమ్మి సోమ్ముచేసుకుందని మండిపడ్డారు. ఇన్నాళ్లు మద్యం దుకాణాలను టెండర్లలో దక్కించుకున్నవారు చేస్తే.. అరోపణలు గుప్పించిన వైసీపీ పార్టీ.. అధికారంలోకి వచ్చిన తరువాత ఏకంగా ప్రభుత్వమే అమ్మడం.. కరోనా లాంటి కష్టకాలంలో మద్యందుకాణాల వద్ద కస్టమర్లను నియంత్రించే పనిలో ఉపాధ్యాయులను కూడా వినియోగించుకున్న తీరును ప్రజలు, ఉపాధ్యాయులు మర్చిపోలేదని ఆయన గుర్తుచేశారు. అలాగే,
ప్రభుత్వం చేసిన పనులతో విసిగివేసిరిన ప్రజలు.. ప్రతీ నియోజకవర్గంలో ఎమ్మెల్యేలను నిలదీస్తున్నారని, ప్రతి ఊరిలో గడప గడపలో వైసీపీ నేతలకు చీదరింపులు, ఛీత్కారాలు ఎదురవుతున్నాయని ఆయన ఎద్దేవా చేశారు. దీంతో పరిపాలన చేతగాని సీబీఐ దత్తపుత్రుడైన జగన్ రెడ్డిలో ఆందోళన మొదలైందని ఆయన వ్యాఖ్యానించారు. ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు రూ.7 లక్షల చొప్పున అందించాల్సిన డబ్బులనూ సర్కారు ఇవ్వట్లేదని ఆరోపించారు. నోటికొచ్చినట్లు జగన్ అబద్ధాలు చెబుతున్నారని ఆయన విమర్శించారు.
(And get your daily news straight to your inbox)
Jun 27 | బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (బిఐఎస్) పలు పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది.ఆసక్తిగల అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ రిక్రూట్మెంట్ డ్రైవ్ ద్వారా 46 పోస్టుల భర్తీ... Read more
Jun 27 | అగ్నిపథ్ కు వ్యతిరేకంగా సికింద్రాబాద్ లో చెలరేగిన అల్లర్లకు సంబంధించిన కేసులో ప్రధాని నిందితుడిగా భావిస్తున్న ఆవుల సుబ్బారావుకు రైల్వే కోర్టు శనివారం జ్యుడిషీయల్ రిమాండ్ విధించిన విషయం తెలిసిందే. సాయి డిఫెన్స్ అకాడమీని... Read more
Jun 27 | మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభం నేపథ్యంలో సీఎం ఉద్ధవ్ ఠాక్రే సన్నిహితుడు, ట్రబుల్ షూటర్గా పేరొందిన సేన ఎంపీ సంజయ్ రౌత్కు భూ కుంభకోణంలో ఈడీ సమన్లు జారీ చేసింది. ప్రవీణ రౌత్, పత్రా చావల్... Read more
Jun 27 | ఆర్మీలో నియామకాల కోసం కేంద్రంలోని నరేంద్రమోడీ ప్రభుత్వం నూతనంగా అగ్నిఫథ్ పథకాన్ని తీసుకువచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈ పథకంపై దేశవ్యాప్తంగా తీవ్రస్థాయి నిరసనలు, అందోళనలు వ్యక్తమవుతూనే ఉన్నాయి. అగ్నిపథ్’ పథకానికి యువత నుంచి... Read more
Jun 27 | శివసేన రెబెల్ ఎమ్మెల్యేలకు కేంద్ర ప్రభుత్వం ‘వై ప్లస్’ భద్రత కల్పించడంపై ఆ పార్టీ తీవ్ర స్థాయిలో విరుకుపడింది. బీజేపి అసలు రంగు బయట పడిందంటూ దుయ్యబట్టింది. కేంద్రంలోని విపక్షనేతలకు ఉన్న భద్రతను తొలగించి..... Read more