What does latest Facebook post of ‘Sex Guru’ says నిత్యానంద స్వామి చనిపోయారా.? కైలాస దివిలో ఏం జరుగుతోంది.?

Fugitive godman swami nithyananda responds to his death news through latest facebook post

nityananda swamy, Sex Guru nityananda swamy, nityananda swamy dead, nityananda swamy no more, nityananda swamy passed away, nityananda swamy kailash, nityananda swamy kailash grave, doctors treating nityananda swamy, self-proclaimed godsman, false death news, Kailash island, grave, facebook, clariffication, grave

Opponents have spread false rumors that Nityananda Swamy of Kailash is sick and has died. Knowing this, Nithyananda delivered a clear message to his devotees via Facebook. Writing on Facebook, Nithyananda said he was not dead and was in the grave.

నిత్యానంద స్వామి చనిపోయారా.? కైలాస దివిలో ఏం జరుగుతోంది.?

Posted: 05/14/2022 11:42 AM IST
Fugitive godman swami nithyananda responds to his death news through latest facebook post

లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆధ్యాత్మిక గురువు నిత్యానంద స్వామి మరణించారని సోషల్ మీడియాలో వార్తలు వైరల్ గా మారాయి. ఈ వార్తలపై తీవ్ర చర్చ మొదలైంది. ఆధ్యాతికం కన్నా శృంగార గురువుగా కర్నాటక సహా పలు రాష్ట్రాల్లో పాపులారిటీ పోందిన నిత్యానంద.. దేశం వదిలి పారిపోవడానికి కూడా అదే కారణమైంది. దీంతో ఆయన గురించి వార్తలు కూడా వినబడటం లేదు. కాగా తాజాగా ఆయన మరణించారన్న వార్తలు విసృత్తంగా వినబడటంతో ఆయన భక్తులలో కలవరం మొదలైంది. అయితే సోషల్ మీడియాలో ఒక్కసారిగా వైరల్ అవుతున్న వార్తలపై స్వయంగా నిత్యానంద స్వామి స్పందించారు.

తాను చనిపోలేదని, ఇంకా బతికే ఉన్నారని స్ఫష్టం చేశారు. 27 మంది డాక్టర్లు తనకు చికిత్స అందిస్తున్నారని వివరించారు. ఈ మేరకు ఆయన ఫేస్‌బుక్‌లో స్పష్టం చేశారు. ‘‘నేను బతికే ఉన్నాను.. ప్రస్తుతం సమాధిలో ఉన్నాను. ప్రస్తుతానికైతే మాట్లాడడం కొంచెం కష్టంగా ఉంది. మనుషులు, పేర్లు, ప్రాంతాలను గుర్తుపట్టలేక పోతున్నాను’’ అంటూ ఆయన తన పేస్ బుక్ పోస్టు పెట్టారు. అనారోగ్యంతో నిత్యానంద చనిపోయాడంటూ కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. వీటిపై స్పందించిన ఆయన తన ఫేస్‌బుక్ పోస్టులో ఈ వ్యాఖ్యలు చేశారు. తాను బతికే ఉన్నట్టు స్పష్టం చేస్తూ పుకార్లకు తెరదించారు.

2019 నవంబర్‌లో ఆయన భారత్ వదిలి వెళ్లిపోయారు. కొన్నాళ్లకు ఆయన ఈక్వెడార్ సమీపంలో ఓ దీవిలో ఉన్నట్టు తెలిసింది. ఆ దీవిని స్వయంగా ఆయన కొనుగోలు చేశారని వార్తలు వచ్చాయి. దానికి ఆయన కైలాస దీవి అనే పేరు పెట్టారు. ఆ కైలాస దీవికి ఆయనే ప్రధానమంత్రి అని ప్రకటించుకున్నారు. అంతేకాదు, ఆ దీవికి ప్రత్యేకంగా కరెన్సీ కూడా ప్రారంభించారు. అంతేకాదు, ఆ కైలాస దీవిని ప్రత్యేక దేశంగా ప్రకటించాలని ఐరాసలోనూ విజ్ఞప్తి చేశాడు. కైలాస డాలర్‌ను ఆయన తెచ్చారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ కైలాసను ఆయన ప్రారంభించారు. ఆయన ప్రతీ ప్రకటన అప్పట్లో ఓ సంచలనమైంది.

లైంగికవేధింపుల కేసులో ఆయనను అరెస్టు చేయడానికి వెళ్లిన పోలీసులను తప్పించుకుని ఈక్వెడార్‌కు సమీపంలోని ఓ ద్వీపానికి వెళ్లినట్టు వార్తలు ఉన్నాయి. అయితే ఈ పోస్టు ఎక్కడి నుంచి పెట్టారన్నదానిపై కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇన్ని ప్రకటనలు చేసినా నిత్యానంద ఎక్కడ ఉన్నారన్న విషయం స్పష్టంగా ఎవరికీ తెలియదు. ఆయన ఈక్వెడార్‌లో ఉంటున్నట్టు పోలీసులు చెబుతున్నా.. ఆ వార్తలను ఆ దేశం ఖండిస్తోంది. కాగా, నిత్యానందపై లైంగిక ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసుల్లో ఆయన భారత్‌లో 50సార్లు కోర్టుకు హాజరయ్యారు. ఆ తర్వాత అకస్మాత్తుగా దేశం నుంచి అదృశ్యమై.. కైలస దివిలో ప్రత్యక్షమయ్యారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles