తెలంగాణ రాజకీయాల్లో ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ సంచలనంగా మారారు. అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలలో మాదిరిగా అది కేవలం ప్రచారానికేనా లేక నిజంగా సీట్లు గెలిచే సత్తా ఉందా అన్నది ప్రస్తుతానికి అప్రస్తుతం. అయితే.. సిరిసిల్ల పర్యటనకు వెళ్తుండగా తన కాన్వాయ్ ను అడ్డుకుని.. టీఆర్ఎస్ కార్యకర్తతో దాడి చేయించిన ఘటనపై ఆయన తెలంగాణ డీజీపీకి గట్టి షాకే ఇచ్చారు. డీజీపీని కలసి తన పిర్యాదును అందజేద్దామన్నుకున్న పాల్ కు మహేందర్ రెడ్డి అపాయింట్ మెంట్ ఇవ్వలేదు. దీంతో ఆయన నేరుగా ఢిల్లీకి వెళ్లి కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో భేటీ కావడంతో ఆయనలో ఏదో ఉంది అని రాజకీయ పక్షాలకు అర్థమైంది.
గడిచిన కొద్ద నెలలుగా తెలంగాణ రాజకీయాల్లో సంచలనాలకు తెరతీసిన ఆయన.. అధికార టీఆర్ఎస్ అవినీతి మయం అయిందని, సీఎం కేసీఆర్ కుటుంబం 8లక్షల కోట్ల అక్రమాలకు పాల్పడిందని పాల్ ఆరోపించారు. కేసీఆర్ కుటుంబంపై తీవ్ర ఆరోపణలు చేస్తూ, గవర్నర్ తమిళిసైని తరచూ కలుస్తోన్న కేఏ పాల్ పై ఇటీవల టీఆర్ఎస్ నేతలు దాడికి పాల్పడ్డారు. తనపై కేసీఆర్ కుటుంబం దాడి చేయించిందేనంటూ గవర్నర్ కు సైతం ఫిర్యాదు చేసిన పాల్.. ఇప్పుడు ఏకంగా కేంద్ర హోం మంత్రి అమిత్ షాను ఆశ్రయించడం చర్చకు దారి తీసింది.
ఆ తరువాత మీడియాతో మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్- ఆయన తనయుడు, రాష్ట్రమంత్రి మంత్రి కేటీఆర్ కనుసన్నల్లో తనపై జరిగిన దాడిని కేంద్ర హోం మంత్రి అమిత్ షా కూడా ఖండించారని కేఏ పాల్ తెలిపారు. తెలంగాణలో లక్షల కోట్ల రూపాయలు మాయమయ్యాయని, కల్వకుంట్ల కుటుంబం అక్రమాలపై దర్యాప్తు జరిగితే కేసీఆర్ జైలుకు పోవడం ఖాయమని అన్నారు. దాడి విషయంలో తెలంగాణ డీజీపీ తనకు సమయం ఇవ్వలేదని, కానీ కేంద్ర హోం మంత్రి అడగ్గానే సమయం ఇచ్చారని పాల్ తెలిపారు. ప్రధాని మోదీ మొదలుకొని, కేంద్ర మంత్రులు తనకు ఇచ్చే గౌరవాన్ని అందరూ చూడాలని కే ఏ పాల్ కోరారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more